30/05/2026
మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జిల్లా స్థాయి ప్రశిక్షణ శిబిరం
మేడ్చల్ అర్బన్, మే 30:
భారతీయ జనతా పార్టీ కేంద్ర మరియు రాష్ట్ర నాయకత్వాల ఆదేశాల మేరకు మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు శ్రీ మల్లారెడ్డి గారి అధ్యక్షతన జిల్లా స్థాయి ప్రశిక్షణ శిబిరం VBIT కళాశాలలో అత్యంత ఘనంగా మరియు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది.
ఈ శిబిరాన్ని బీజేపీ జాతీయ నాయకులు శ్రీ మురళీధర్ రావు గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ తివారీ గారు కార్యకర్తలకు పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణం, క్రమశిక్షణ, ప్రజలతో అనుసంధానం, భవిష్యత్తు రాజకీయ సవాళ్లను ఎదుర్కొనే విధానాలపై సమగ్ర మార్గదర్శనం చేశారు.
ఉప్పల్ మాజీ శాసనసభ్యులు శ్రీ ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ గారు శిక్షణార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
జాతీయ నాయకులు శ్రీ మురళీధర్ రావు గారు మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, సిద్ధాంత నిబద్ధత, క్రమశిక్షణ, నిరంతర ప్రజాసేవ ద్వారానే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సన్నద్ధంగా ఉండాలని సూచించారు.
ఈ శిక్షణా శిబిరంలో జిల్లా పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్చార్జ్లు, మండల డివిజన్ అధ్యక్షులు, శక్తికేంద్ర ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ సిద్ధాంతాలపై అవగాహన, సంస్థాగత బలోపేతం, ప్రజాసేవ పట్ల అంకితభావమే ఈ ప్రశిక్షణ శిబిరం ప్రధాన లక్ష్యం అని నాయకులు పేర్కొన్నారు.
పోతగాని గోపాల్ గౌడ్
మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి.
NVSS Prabhakar