30/07/2026
భారతీయ జనతా పార్టీ నాచారం హెచ్ఎంటి నగర్ డివిజన్ SIR ప్రవాస్ అభియాన్ లో భాగంగా
రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు
SIR మండల ప్రవాస్ అభియాన్ 24 గంటల పర్యటనలో భాగంగా మొదటి రోజు నాచారం హెచ్ ఎమ్ టి నగర్ డివిజన్ సంయెజకులు (ఇంచార్జి కో ఆర్డినేటర్) మెడ్చల్ అర్బన్ జిల్లా కౌన్సిల్ మెంబర్ & ఉప్పల్ MBC చైర్మన్ సంగిశెట్టి రవింద్ర సాగర్ గారు BJP సీనియర్ నాయకుడు మోర నర్సింహా రెడ్డి గారి నివాసంలో శక్తి కేంద్ర ఇంచార్జ్ ల సమావేశం నిర్వహించి అనంతరం అక్కడే భోజన వ్యవస్థ, నిద్ర వ్యవస్థ పూర్తి చేయటం జరిగింది.ఈరోజు HMT నగర్ లోని శక్తి కేంద్రాల ఇన్చార్జ్ లతో సమావేశం నిర్వహించి బిజెపి నాయకులు కాటిపల్లి రవీందర్ రెడ్డి గారు ఏర్పాటుచేసిన అల్పహార అనంతరం SIR ఫారంల డిస్ట్రిబ్యూషన్ వివరాలు అడిగి తెలుసుకోవటం జరిగింది. మరియు వివిధ పరివార క్షేత్రాలతో, మరియు పలు కుల సంఘాలతో సమావేశం నిర్వహించడం జరిగింది. రాఘవేంద్ర నగర్ లోని పోతగాని గోపాల్ గౌడ్ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద ఓటర్లతో సంభాషించి వివరాలు తెలుసుకోవటం జరిగింది.అనంతరం BLO లతో కలసి SIR ప్రక్రియ జరుగుతున్న తీరును, ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫార్మ్ లు ఇచ్చిన తీసుకున్న మరియు ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. BJP మేడ్చల్ అర్బన్ జిల్లా కౌన్సిల్ సభ్యులు, శక్తికేంద్ర ఇంచార్జ్ బొల్లం చంద్రమౌళి గారి నివాసం లో భోజన కార్యక్రమం పూర్తిచేసుకోవటం జరిగింది. ఈ సందర్బంగా చివరి ఐదు రోజులు యుద్ధప్రాతిపదికన ప్రతి ఒక్క ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొనే విధంగా కష్టపడి పని చెయ్యాలని BLA 2,BJP కార్యకర్తలకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో BJP ఉప్పల్ నియోజకవర్గం BLA1 పోతగాని గోపాల్ గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు బొల్లం చంద్రమౌళి,మోర నర్సింహా రెడ్డి, రాజిరెడ్డి, గందమల్ల గోపి,డివిజన్ అధ్యక్షులు నవీన్ కుమార్, ఉదయ్, కాటిపల్లి రవీందర్ రెడ్డి,సురేందర్ స్వామీ, శేఖర్ గుప్తా, చిల్లా అశోక్, శ్రీనివాస్ యాదవ్, బాలకృష్ణ,కిరణ్ కుమార్, నర్సింగ్, కృష్ణ, శేఖర్, అనిత రెడ్డి, మంజులవాణి,కళావతి, వరలక్ష్మి మరియు శక్తి కేంద్రాల ఇన్చార్జ్ లు తదితరులు పాల్గొన్నారు.
BJP Telangana