23/11/2023
కూకట్పల్లిలో కాంగ్రెస్ ప్రచారానికి వచ్చిన రేవంత్ రెడ్డి అసత్యమైన వ్యాఖ్యలు చేశాడని అవి నిరూపించినట్లయితే నేను దేనికైనా సిద్ధమేనని నిరూపించకపోతే రేవంత్ రెడ్డి ఏం చేస్తారని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు సవాల్ విసిరారు.
కొడంగల్ లో ఓడిపోయి మల్కాజ్గిరి లో అబద్ధాల మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలుస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ రూపురేఖలు మారుస్తానన్న రేవంత్ రెడ్డి గెలిచిన నాటినుండి నేటి వరకు మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలకు ముఖం కూడా చూపెట్టలేనీ దుర్మార్గుడు అని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు అన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గం లోని అల్లాపూర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ తో కలిసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు మహా పాదయాత్ర నిర్వహించారు పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు పూలతో శాలువాలతో సత్కరిస్తూ బ్రహ్మరథం పట్టారు. కార్యకర్తలు గులాబీ పాటలకు డ్యాన్సులు వేస్తూ పాదయాత్రను కొనసాగించారు.
ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూకట్పల్లి నియోజకవర్గంలో వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని రేవంత్ రెడ్డి కూకట్పల్లి కి వచ్చి అబద్దాల మాటలు మాట్లాడి వెళ్లిపోయే నాయకుడు నాయకుడేనా కూకట్పల్లి ప్రజలు ఓట్లు వేస్తే ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి గెలిచిన నాలుగు సంవత్సరాలలో ఏనాడైనా కూకట్పల్లి నియోజకవర్గం లో అడుగు పెట్టాడా...? కరోనా వచ్చి పేద ప్రజలందరూ కష్టకాలంలో ఉన్న సమయంలో కనీసం ప్రజల కష్టసుఖాలు తెలుసుకోలేని నాయకుడు ఇంట్లో కూర్చొని భార్యతో ఆమ్లెట్లు వేపించుకొని ఇంటికే పరిమితమైన రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాలుగా సేవలు చేస్తున్న వారికి టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకున్న రేవంత్ రెడ్డి అసత్య మాటలు మాట్లాడితే కూకట్పల్లి కూకట్పల్లి ప్రజలు ఊరుకోరని అలాంటి నాయకునికి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు అన్నారు.
బైట్ : మాధవరం కృష్ణారావు ( BRS అభ్యర్థి )