08/12/2021
బాలానగర్ డివిజన్ లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
బాలానగర్ నివాసితులు ఎవెన్యూ డయాగ్నస్టిక్స్ అధినేత్రి తేటబావి దీనమని ఆధ్వర్యంలో గడ్డి చేను వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *ధైవ సేవకురాలు మేరీ రత్నం హాజరై ప్రసంగించారు. ఏసుక్రీస్తు ఎప్పుడూ ప్రేమను, కరుణను, క్షమను కలిగి ఉండాలని బోధించారని తెలిపారు. ప్రతిఒక్కరూ క్షమాగుణంతో సర్వ ప్రాణులను ప్రేమిస్తే యావత్ ప్రపంచం సుఖఃశాంతులతో ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ దీన మని ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాల వారికి ప్రాధాన్యమిస్తూ కానుకలను అందజేస్తుందని కార్పొరేటర్ గారు అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి క్రైస్తవ కుటుంబానికి దుస్తులను అందజేస్తున్న సంగతి గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను ఆదరిస్తూ వారి అభిమానాన్ని పొందుతుందన్నారు. ప్రతి పేదవాడు పండుగ రోజు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో సీఎం కెసీఆర్ గారు దుస్తులను పంపిణీ చేస్తున్నారన్నారు. ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. కార్పొరేటర్ గారు క్రైస్తవ సోదరి, సోదరులకు శుభాకాంక్షలను తెలిపారు. వేడుకల సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
అనంతరం స్థానిక పాస్టర్ లకు గౌరవంగా కార్పొరేటర్ గారి చేతులమీదుగా శాలువా తో సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రసాద్, షారోన్ మినిస్ట్రీస్ పాస్టర్ ఎమ్. రాజు, బెరక చర్చి పాస్టర్ సుందర్, తెరాస క్రిస్టియన్ మైనారిటీస్ కూకట్పల్లి నియోజకవర్గం అధ్యక్షుడు డాడీ డేవిడ్, క్రిస్టియన్ మైనారిటీ సెల్ బాలానగర్ డివిజన్ అధ్యక్షురాలు మధులత తో పాటు స్థానిక తెరాసా పార్టీ నాయకులు మందడి సుధాకర్ రెడ్డి,పంజా రాంచందర్ ముదిరాజ్,దేవులపల్లి కృష్ణమూర్తి,స్వామి గౌడ్,అభిమన్యు,రామచంద్ర చారీ,శ్రీనివాస రావు, సుర్యా ప్రకాష్ కోరపాటి తదితరులు పాల్గొన్నారు.