01/06/2026
మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం విజయవంతం
ఘట్కేసర్ మండలం పరిధిలోని అన్నోజీ గూడ లోని తుల్లిప్ హోటల్లో జరిగిన పోచారం, ఘట్కేసర్, ఎదులాబాద్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించబడింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా * *మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ &*మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి గారు*BRS పార్టీ నాయకుడు చామాకురా మహేందర్ రెడ్డి గారు* హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా *రాగిడి లక్ష్మారెడ్డి గారు*
మాట్లాడుతూ, పార్టీ కష్టకాలంలో సైతం మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేస్తూ, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలిపారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, వారి సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు.
ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయడం, అలాగే SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సమిష్టిగా ముందుకు సాగాలని *రాగిడి లక్ష్మారెడ్డి గారు* నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్/ డివిజన్/వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, యువజన విభాగం నాయకులు - సభ్యులు, పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు - సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు