BJP4 Nagaram Municipality

BJP4 Nagaram Municipality Bjp nagaram social media

*హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో రిటైర్డ్ ఆర్మీ సైనికుడికి ఘన సన్మానం*- కార్గిల్ వీరుల స్ఫూర్తితో దేశభక్తిని పెంపొందించాలి- సై...
14/08/2026

*హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో రిటైర్డ్ ఆర్మీ సైనికుడికి ఘన సన్మానం*

- కార్గిల్ వీరుల స్ఫూర్తితో దేశభక్తిని పెంపొందించాలి

- సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి

హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం నాగారం డివిజన్ ఆర్ఎం నగర్ కాలనీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీలో ఇంజనీర్ రెజిమెంట్, 108 పుణే కిర్కీలో సేవలందించిన రిటైర్డ్ ఆర్మీ సైనికుడు సుంకరి నారాయణ గారిని *మేడ్చల్ నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి* గారు ఘనంగా సన్మానించి, శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ దేశం కోసం సైనికులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం భారత సైనికుల ధైర్యసాహసాలకు, దేశభక్తికి ప్రతీకగా నిలిచిందన్నారు.

1999 మే నుంచి జూలై వరకు భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ మద్దతుతో చొరబడిన సైనికులు కార్గిల్–ద్రాస్ ప్రాంతంలోని ఎత్తైన ప్రాంతాలను ఆక్రమించగా, వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారత సైన్యం ఆపరేషన్ విజయ్ చేపట్టిందన్నారు. భారత వాయుసేన ఆపరేషన్ సఫేద్ సాగర్ ద్వారా కీలక పాత్ర పోషించిందని తెలిపారు.

భారత సైన్యం అపారమైన ధైర్యసాహసాలతో ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుని 1999 జూలై 26న విజయాన్ని సాధించిందని, అందుకే జూలై 26ను దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నామని వివరించారు.

కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్ వంటి వీర సైనికుల త్యాగాలు, ధైర్యసాహసాలు దేశ యువతకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు కాపలా కాస్తున్నందువల్లే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని, వారి త్యాగాలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని, హర్ ఘర్ తిరంగా అభియాన్‌ను విజయవంతం చేసి దేశ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నారాయణ గారి కుమారుడు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

26/07/2026
23/07/2026

మేడ్చల్ రూరల్ జిల్లా డివిజన్ల ఇంచార్జిలను జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గారు ప్రకటించడం జరిగింది
18/07/2026

మేడ్చల్ రూరల్ జిల్లా డివిజన్ల ఇంచార్జిలను జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గారు ప్రకటించడం జరిగింది

భారతీయ జనతా పార్టీ నాగారం డివిజన్ అధ్యక్షులు కొండబోయిన నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని న...
06/07/2026

భారతీయ జనతా పార్టీ నాగారం డివిజన్ అధ్యక్షులు కొండబోయిన నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని నిర్వహించారు. అనంతరం కీసర ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేసి ఎస్‌.ఐ.ఆర్. గడువు పొడిగింపు, పారదర్శక అమలు మరియు అక్రమ విదేశీయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ కౌకుట్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ప్రతి బీజేపీ కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, దేశ సమగ్రత, సుపరిపాలనకు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు. అలాగే ఎస్‌.ఐ.ఆర్. ప్రక్రియను అధికారులు, బీ.ఎల్.ఓలు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేదా ప్రలోభాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. ఈ ప్రక్రియపై అధికారులకు, బీ.ఎల్.ఓలకు పూర్తి అవగాహన ఏర్పడేందుకు దాదాపు 15 రోజుల సమయం పట్టిందని, ఇంకా క్షేత్రస్థాయిలో కొంతమందికి పూర్తి అవగాహన లేదని తెలిపారు. అనేక ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి దరఖాస్తు ఫారాలు పంపిణీ చేయడం సక్రమంగా జరగడం లేదని తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఫారాలు అందించి ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వడానికి మరింత సమయం అవసరమని, అందువల్ల ఎస్‌.ఐ.ఆర్. గడువును కనీసం మరో రెండు నెలలు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా నాగారం డివిజన్ పరిధిలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులు ఉన్నట్లయితే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దేశ అంతర్గత భద్రత, జాతీయ సమగ్రత దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా సహకరించాలని పిలుపునిచ్చారు. "దేశం బాగుంటేనే మనం బాగుంటాం" అనే సిద్ధాంతంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, దేశ సమగ్రతను కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిదేనని పేర్కొన్నారు. అనుమానాస్పదంగా అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల గురించి సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నక్క కిషోర్ గౌడ్, మంచాల మహేందర్, నాగారం డివిజన్ ప్రధాన కార్యదర్శులు మామిడి జంగారెడ్డి, పోతంశెట్టి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు కర్ర వెంకటేశ్వర్, రామారం గిరి గౌడ్, కార్యదర్శి పొడవుల రవి, రవీందర్ రెడ్డి, సూర్వి రాజు గౌడ్, మధు గౌడ్, కీసర డివిజన్ అధ్యక్షులు కోల బాలరాజ్ యాదవ్, కొలిచెలిమి కృష్ణ, మెట్టు కృష్ణ యాదవ్, నల్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నాగారం మున్సిపల్ బీజేపీ మాజీ అధ్యక్షులు శ్రీ బుద్దవరం వేణుగోపాల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎂💐💐మీరు నిండు నూ...
25/06/2026

నాగారం మున్సిపల్ బీజేపీ మాజీ అధ్యక్షులు శ్రీ బుద్దవరం వేణుగోపాల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎂💐💐
మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ
మీ సోదరుడు మామిడి జంగారెడ్డి
నాగారం డివిజన్ ప్రధాన కార్యదర్శి 💐💐

నాగారం డివిజన్ బీజేపీ అధ్యక్షులు కొండబోయిన నాగరాజ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నాగారం డివిజన్‌ను రెండు డివిజన్లుగా విభజించాలని...
22/06/2026

నాగారం డివిజన్ బీజేపీ అధ్యక్షులు కొండబోయిన నాగరాజ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నాగారం డివిజన్‌ను రెండు డివిజన్లుగా విభజించాలని కోరుతూ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ జడ్పీటీసీ మునుగంటి సురేష్ గారు మాట్లాడుతూ, నాగారం డివిజన్ నంబర్–5 లో సుమారు 70 వేల నుంచి 80 వేల వరకు ఓటర్లు ఉండటంతో పాటు డివిజన్ విస్తీర్ణం 10 నుంచి 15 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపారు. నాగారం, రాంపల్లి, కరీంగూడ, గోధుమకుంట, రాంపల్లి దాయరా, బోగారం గ్రామాలు మరియు రెండు హామ్లెట్లు ఈ డివిజన్ పరిధిలో ఉండటంతో పరిపాలనా పరంగా, అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రాంపల్లిని కేంద్రంగా చేసుకుని రాంపల్లి, కరీంగూడ, గోధుమకుంట, రాంపల్లి దాయరా, బోగారం గ్రామాలను కలిపి ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేసి రాంపల్లిని ప్రత్యేక డివిజన్‌గా ప్రకటిస్తే పరిపాలన మరింత సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, శ్రీరాములవారి పాదాలు నిలిచిన పవిత్ర క్షేత్రంగా రాంపల్లి ప్రాంతం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉందని పేర్కొంటూ, ఆ విశిష్టతను పరిరక్షించే విధంగా “రాంపల్లి డివిజన్”ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ ప్రతిపాదనను ప్రభుత్వం, సంబంధిత అధికారులు సానుకూలంగా పరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బుధవరం లక్ష్మి, మాజీ అధ్యక్షులు బుధవరం వేణుగోపాల్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు మామిడి జంగా రెడ్డి, పోతంశెట్టి వెంకటేశ్వరరావు, ఏనుగు మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎలసాని నాగరాజ్ యాదవ్, కార్యదర్శి సురేందర్ రెడ్డి, జెమ్మల్ల మధు గౌడ్, విజయలక్ష్మి, చందు తదితరులు పాల్గొన్నారు.
Kondaboina Nagaraj Yadav
Elasani Nagaraj Yadav
BJP4Medchal Assembly

Address

Hyderabad
501302

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP4 Nagaram Municipality posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share