29/03/2026
ఈరోజు జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరిన శివశక్తి (ఆధ్యాత్మిక చైతన్య వేదిక) సమన్వయకర్త శ్రీ జి.సాయికుమార్ గౌడ్ గారు.
ధర్మ రక్షణకై ఎన్నో చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన శివశక్తి ఫౌండేషన్ లో ముఖ్యులు శ్రీ జి. సాయికుమార్ గౌడ్ గారు. సనాతన ధర్మ రక్షణ కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషికి ఆకర్షితులై ఆయన జనసేన పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువజన నాయకులు శ్రీ గోకుల రవీందర్ రెడ్డి గారు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జి డా.మాధవరెడ్డి గారు పాల్గొని, నూతనంగా పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానించారు.