బీజేపీ తెలంగాణ కిసాన్ మోర్చా

  • Home
  • India
  • Hyderabad
  • బీజేపీ తెలంగాణ కిసాన్ మోర్చా

బీజేపీ తెలంగాణ కిసాన్ మోర్చా Telangana bjp kisan morcha social media team

ధన్యవాదాలు Narendra Modi జి 🙏🙏
01/08/2026

ధన్యవాదాలు Narendra Modi జి 🙏🙏

🌕 గురుపౌర్ణిమ శుభాకాంక్షలు 🌕అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే ప్రతి గురువుకూ నా హృదయపూర్వక ప్రణామాలు. 🙏...
29/07/2026

🌕 గురుపౌర్ణిమ శుభాకాంక్షలు 🌕

అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే ప్రతి గురువుకూ నా హృదయపూర్వక ప్రణామాలు. 🙏

“గురు బ్రహ్మా గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.”

మన జీవితానికి దిశానిర్దేశం చేసి, విలువలు, విజ్ఞానం, సంస్కారం నేర్పిన గురువుల సేవలను ఎప్పటికీ మరువలేము.

ఈ పవిత్ర గురుపౌర్ణిమ సందర్భంగా నా గురువులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

గురువుల ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితం జ్ఞానం, ధర్మం, విజయాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా  అధ్యక్షులు మల్లేపల్లి రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫస...
25/07/2026

సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లేపల్లి రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులు బసవ లక్ష్మయ్య గారి ఆదేశాలతో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గోదావరి అంజి రెడ్డి గారి సూచన మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో AO గారికి వినతి పత్రం ఇవ్వడం అయినది ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2016లో అమలులోకి తెచ్చింది దాన్ని మన దేశంలో 23 రాష్ట్రాలు అమలు పరుస్తున్న కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా అమలు చేస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో అమలుకు నోచుకోని పథకం ఫసల్ బీమా యోజన పథకం ఈ పథకం వలన రైతులకు పకృతి వైపరీత్యాల వల్ల అతివృష్టి అనావృష్టి వచ్చిన ఈ పథకం ద్వారా రైతులు వేసుకున్న పంటలకు ఇన్సూరెన్స్ బీమా అందుతుంది కాబట్టి రైతులకు మేలు చేసిన వారవుతారు రైతులకు పంట నష్టాల వల్ల రక్షణ కల్పించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం అయినది అందువలన పసల బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని రైతులను ఆదుకోవాలని మనవి చేయుచున్నాము ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వి రాజిరెడ్డి శివకుమార్ చంద్రశేఖర్ రెడ్డి వీరన్న శంకర్ రెడ్డి సుధాకర్ మోహన్ రెడ్డి వీర కృష్ణారెడ్డి మల్లేశం మోహన్ రెడ్డి పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

23/07/2026
23/07/2026
23/07/2026
23/07/2026
🌾 తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వ భారీ ఊరట – హృదయపూర్వక కృతజ్ఞతలు! 🇮🇳2025–26 రబీ సీజన్‌లో తెలంగాణ నుంచి బియ్యం సేకరణను 3...
22/07/2026

🌾 తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వ భారీ ఊరట – హృదయపూర్వక కృతజ్ఞతలు! 🇮🇳

2025–26 రబీ సీజన్‌లో తెలంగాణ నుంచి బియ్యం సేకరణను 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు (అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నులు) పెంచిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ రైతులకు ఎంతో ప్రయోజనకరమైనది.

ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి గారికి, అలాగే ఈ విషయంలో కీలకంగా కృషి చేసిన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

జూలై 8న కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, తెలంగాణ కిసాన్ మోర్చా నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మరియు బీజేపీ ప్రతినిధులతో కలిసి ఢిల్లీలో శ్రీ ప్రహ్లాద్ జోషి గారిని కలిసి, తెలంగాణ రైతుల ప్రయోజనాల దృష్ట్యా బియ్యం సేకరణ పెంచాలని విజ్ఞప్తి చేశాము. రైతుల పక్షాన చేసిన మా విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషకరం.

ఈ నిర్ణయం ద్వారా అదనంగా 12 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలుకు అవకాశం లభించడం వల్ల తెలంగాణ రైతులకు మరింత మేలు జరుగుతుంది.

అలాగే, రైతుల ప్రయోజనాలు మరియు ప్రజా పంపిణీ వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని, గత సేకరణ సీజన్‌లకు సంబంధించిన పెండింగ్ బియ్యం పరిమాణాన్ని తెలంగాణ ప్రభుత్వం వీలైనంత త్వరగా FCIకి అప్పగించి తన బాధ్యతలను నెరవేర్చాలని కోరుతున్నాను.

రైతు సంక్షేమమే మా లక్ష్యం –
బీజేపీ కిసాన్ మోర్చా – తెలంగాణ


ఫసల్ భీమా యోజన పథకాన్ని తెలంగాణాలో అములుచేయాలనీ కోరుతూ  రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు పిలిపు మేరకు జిల్లా కిసానుమోర్చ...
22/07/2026

ఫసల్ భీమా యోజన పథకాన్ని తెలంగాణాలో అములుచేయాలనీ కోరుతూ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు పిలిపు మేరకు జిల్లా కిసానుమోర్చా అధ్యక్షులు నరుకుళ్ళ. వెంకటేశ్వరరావు అడ్వర్యంలో ఖమ్మం కలెక్టర్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా పార్టీ అధ్యక్షులు నెల్లూరి. కోటేశ్వరరావు గారు, రాష్ట్ర కిసానుమోర్చా కార్యవర్గ సభ్యులు. చావా. కిరణ్ గారు, ఎల్లారావు గౌడ్ గారు, సీనియర్ నాయకులు మందనపు. సుబ్బారావు గారు మరియు జిల్లా కిసాన్ మోర్చా జిల్లా నాయకులు మండేపూడి వీరానాగేశ్వర్రావు, బుర్రా శ్రీను, చింతనిప్పు. రామారావు, కొండా. వెంకన్న, బిచ్చు నాయక్, సింగరేణి మండల అధ్యక్షులు మల్లేష్ ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది..

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when బీజేపీ తెలంగాణ కిసాన్ మోర్చా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share