22/07/2026
🌾 తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వ భారీ ఊరట – హృదయపూర్వక కృతజ్ఞతలు! 🇮🇳
2025–26 రబీ సీజన్లో తెలంగాణ నుంచి బియ్యం సేకరణను 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు (అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నులు) పెంచిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ రైతులకు ఎంతో ప్రయోజనకరమైనది.
ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి గారికి, అలాగే ఈ విషయంలో కీలకంగా కృషి చేసిన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
జూలై 8న కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, తెలంగాణ కిసాన్ మోర్చా నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మరియు బీజేపీ ప్రతినిధులతో కలిసి ఢిల్లీలో శ్రీ ప్రహ్లాద్ జోషి గారిని కలిసి, తెలంగాణ రైతుల ప్రయోజనాల దృష్ట్యా బియ్యం సేకరణ పెంచాలని విజ్ఞప్తి చేశాము. రైతుల పక్షాన చేసిన మా విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషకరం.
ఈ నిర్ణయం ద్వారా అదనంగా 12 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలుకు అవకాశం లభించడం వల్ల తెలంగాణ రైతులకు మరింత మేలు జరుగుతుంది.
అలాగే, రైతుల ప్రయోజనాలు మరియు ప్రజా పంపిణీ వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని, గత సేకరణ సీజన్లకు సంబంధించిన పెండింగ్ బియ్యం పరిమాణాన్ని తెలంగాణ ప్రభుత్వం వీలైనంత త్వరగా FCIకి అప్పగించి తన బాధ్యతలను నెరవేర్చాలని కోరుతున్నాను.
రైతు సంక్షేమమే మా లక్ష్యం –
బీజేపీ కిసాన్ మోర్చా – తెలంగాణ