29/07/2026
టీడీపీ సీనియర్ నేత, మాజీ MPTC, మేడిపల్లి మాజీ సర్పంచ్ శ్రీ కుతాడి నరసింహ గారు ఈరోజు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమపదించారు.
బాబు గారి అక్రమ అరెస్టు సమయంలో జరిగిన ఉద్యమాల్లో, ధర్నాల్లో ముందుండి పాల్గొని మేడిపల్లి కార్యకర్తలకు అండగా నిలిచారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదులో విశేషంగా కృషి చేస్తూ, పార్టీ బలోపేతానికి తన వంతు సేవలను అంకితభావంతో అందించారు. పార్టీ పట్ల వారి నిబద్ధత, కార్యకర్తల పట్ల వారి ఆప్యాయత, ప్రజాసేవ పట్ల వారి అంకితభావం ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
శ్రీ కుతాడి నరసింహ గారి మృతి పార్టీకి తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము.
ఓం శాంతిః 💐🙏