ITDP Telangana

ITDP Telangana iTDP Telangana

టీడీపీ సీనియర్ నేత, మాజీ MPTC, మేడిపల్లి మాజీ సర్పంచ్ శ్రీ కుతాడి నరసింహ గారు ఈరోజు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమప...
29/07/2026

టీడీపీ సీనియర్ నేత, మాజీ MPTC, మేడిపల్లి మాజీ సర్పంచ్ శ్రీ కుతాడి నరసింహ గారు ఈరోజు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమపదించారు.

బాబు గారి అక్రమ అరెస్టు సమయంలో జరిగిన ఉద్యమాల్లో, ధర్నాల్లో ముందుండి పాల్గొని మేడిపల్లి కార్యకర్తలకు అండగా నిలిచారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదులో విశేషంగా కృషి చేస్తూ, పార్టీ బలోపేతానికి తన వంతు సేవలను అంకితభావంతో అందించారు. పార్టీ పట్ల వారి నిబద్ధత, కార్యకర్తల పట్ల వారి ఆప్యాయత, ప్రజాసేవ పట్ల వారి అంకితభావం ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.

శ్రీ కుతాడి నరసింహ గారి మృతి పార్టీకి తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము.

ఓం శాంతిః 💐🙏

29/07/2026

చుట్టం చూపుగా వచ్చిపోతున్న వానలకే ఇలా ఉంటే... భారీ వర్షాలు పడితే హైదరాబాద్ లో అంతే సంగతులు.

సికింద్రాబాద్ పార్లమెంట్ ముఖ్య నాయకులతో కలసి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన ప్రజా పదం  కార్యక్రమాలన...
28/07/2026

సికింద్రాబాద్ పార్లమెంట్ ముఖ్య నాయకులతో కలసి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన ప్రజా పదం కార్యక్రమాలను గౌరవనీయులు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సెక్రటేరియట్ లో కలసి వివరిస్తున్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అరవింద్ కుమార్ గౌడ్ గారు, కోఆర్డినేటర్ శ్రీ నల్లెల కిషోర్ గారు, రాష్ట్ర బీసీ విభాగం మాజీ అధ్యక్షులు, కాణిపాకం దేవస్థానం బోర్డు సభ్యులు శ్రీ శ్రీపతి సతీష్ కుమార్ గారు, రాష్ట్ర ఎస్సీ విభాగం మాజీ అధ్యక్షులు శ్రీ పోలంపల్లి అశోక్ గారు, వినోద్ నేత, శ్యాం సుందర్, సుదర్శన్ రెడ్డి, కిరణ్ కుమార్, భాను ప్రకాశ్, ప్రదీప్ గౌడ్.

తెలుగుదేశం పార్టీ – తెలంగాణప్రజా పాదం కార్యక్రమానికి ఆహ్వానంరేపు జూలై 29, బుధవారం ఉదయం 11:00 గంటలకు జరిగే "ప్రజా పాదం" క...
28/07/2026

తెలుగుదేశం పార్టీ – తెలంగాణ

ప్రజా పాదం కార్యక్రమానికి ఆహ్వానం

రేపు జూలై 29, బుధవారం ఉదయం 11:00 గంటలకు జరిగే "ప్రజా పాదం" కార్యక్రమానికి తప్పకుండా విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా మనవి.

వేదిక:
శ్రీ ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా, RBI క్వార్టర్స్, ఎల్లారెడ్డిగూడ, శ్రీనగర్ కాలనీ డివిజన్.

ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై ఘనవిజయం చేకూర్చగలరు.

– జి.వి.జి. నాయుడు
ఇన్‌చార్జ్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం
తెలుగుదేశం పార్టీ – తెలంగాణ

https://maps.app.goo.gl/5Yfbyp77wAwou82n6?g_st=ac

ఈరోజు తెలుగుదేశం పార్టీ నాంపల్లి నియోజకవర్గం లో నిర్వహించిన *ప్రజా పదం* కార్యక్రమం లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్...
26/07/2026

ఈరోజు తెలుగుదేశం పార్టీ నాంపల్లి నియోజకవర్గం లో నిర్వహించిన *ప్రజా పదం* కార్యక్రమం లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, నియోజవర్గ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

తెలంగాణలో క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలన్న అధిష్టానం ఆదేశాలతో ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్...
26/07/2026

తెలంగాణలో క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలన్న అధిష్టానం ఆదేశాలతో ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి శ్రీమతి సూర్యదేవర లత గారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 'ప్రజాపథం'కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగినది.

*షాద్‌నగర్‌లోని పరిశ్రమలను జనసంచారం లేని ప్రాంతాలకు తరలించాలి**దివ్య శక్తి పేపర్ మిల్లు నుండి వెలబడుతున్న కలుషిత నీరు..*...
25/07/2026

*షాద్‌నగర్‌లోని పరిశ్రమలను జనసంచారం లేని ప్రాంతాలకు తరలించాలి*

*దివ్య శక్తి పేపర్ మిల్లు నుండి వెలబడుతున్న కలుషిత నీరు..*

*పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్య పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు*

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని పరిశ్రమలను దశలవారీగా తొలగించి,జనసంచారం లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ప్రభుత్వాన్ని కోరారు.షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందరు గ్రామ సమీపం లో వెలసిన దివ్య శక్తి పేపర్ మిల్లు ద్వారా కలుషిత నీరు దండాది కాలువలోకి వదలడంతో పరిసరా ప్రాంత రైతుల పొలాలు కాలుష్యంతో పేరుకుపోయిన దృశ్యాలు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్య నీరు భూగర్భ జలాలు,చెరువులు, వ్యవసాయ భూములను తీవ్రంగా కలుషితం చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.కాలుష్యం కారణంగా పంట భూములు సాగుకు అనువుగా లేకుండా పోతున్నాయని,రైతులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.పరిశ్రమల వ్యర్థాలను శుద్ధి చేయకుండా విడుదల చేయడం వల్ల ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని అన్నారు.పరిశ్రమల వల్ల ఉపాధి అవకాశాలు పెరగడం స్వాగతించదగిన విషయమే అయినప్పటికీ,ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.కాలుష్య నియంత్రణ నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు,నివాస ప్రాంతాలకు దూరంగా పరిశ్రమలను తరలించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బక్కని నరసింహులు డిమాండ్ చేశారు.

"ప్రజా పదం" కార్యక్రమానికి ఆత్మీయ ఆహ్వానం! 👋జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో నిర్వహించ తలపెట్టిన "ప్రజ...
25/07/2026

"ప్రజా పదం" కార్యక్రమానికి ఆత్మీయ ఆహ్వానం! 👋జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో నిర్వహించ తలపెట్టిన "ప్రజా పదం" కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము.

🗓️ఎప్పుడు?: జూలై 26 (ఆదివారం) ఉదయం 10:00 గంటలకు.

📍ఎక్కడ?: ఎల్లారెడ్డిగూడ ఎన్టీఆర్ విగ్రహం వద్ద (RBI క్వార్టర్స్ ఎదురుగా).

ప్రత్యేకత: ఉదయం 10 గంటల నుండి అల్పాహార ఏర్పాట్లు ఉంటాయి.

నిర్వాహకులు:శ్రీమతి సూర్యదేవర లత (రాష్ట్ర పార్టీ మాజీ అధికార ప్రతినిధి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం).

Address

NTR TRUST BHAVAN, BANJARAHILLS
Hyderabad
500096

Telephone

04030699999

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share