16/09/2026
సైబరాబాద్లో 11 వ విడత రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం
-సంతోషం వ్యక్తం చేసిన బాధితులు
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ గారి యొక్క ఆదేశాల మేరకు, సైబరాబాద్ పరిధిలో CEIR పోర్టల్ ద్వారా, ప్రజలు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను, 11 వ దశలో 1,218 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి యొక్క విలువ సుమారు 2,43,60,000/- ఈ రికవరీ ప్రక్రియలో సీసీఎస్ కూకట్పల్లి పోలీసులు 410, సీసీఎస్ శేరిలింగంపల్లి పరిధిలో 407 మరియు సీసీఎస్ కుత్బుల్లాపూర్ పరిధిలో 401, మొత్తం 1,218 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఇట్టి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను సంబంధిత బాధితులకు స్వయంగా అందజేశారు.
సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ గారు మాట్లాడుతూ... ప్రజలు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తిరిగి స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేస్తున్నామని తెలిపారు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ (CEIR) ద్వారా ఫోన్లను సులభంగా ట్రాక్ చేస్తున్నామని, ఫోన్ పోగొట్టుకున్న వెంటనే బాధితులు ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్ నేడు ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధికి, వ్యక్తిగత అవసరాలకు కీలక సాధనంగా మారిందని, పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి యజమానులకు అప్పగించి వారిలో మళ్లీ ఆనందాన్ని నింపడం పోలీసుల బాధ్యతగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
అనంతరం సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ హెచ్చరించారు. ముఖ్యంగా Job Fraud. Betting Apps, మొదలగునవి మరియు మీ యొక్క సెల్ నం. కూడా గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వకూడదు అని తెలియజేశారు. రద్దీ ఉన్న ప్రాంతాలలో అనగా మార్కెట్స్, బస్ స్టాప్స్, ఉత్సవాలు జరిగే ప్రదేశాలలో తమ వస్తువుల పై నిఘా ఉంచి జాగ్రతగా ఉండాలని సూచనలు ఇచ్చారు. అదేవిదంగా ఇళ్ళల్లో జరిగే దొంగతనాలు గురించి కూడా తగు సూచనలు ఇచ్చారు, ఎవరైనా దూర ప్రాంతాలకు, విహార యాత్రలకు ఇల్లు విడిచి వెళ్లినప్పుడు ఎట్టి పరిస్తితి లో కూడా Social Media లో షేర్ చేయకూడదు అని సూచించారు. ఈ సందర్భంగా ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబరిచిన CCS టీమ్ మరియు పోలీసు అధికారులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
మొబైల్ ఫోన్లు పోగొట్టుకుని తిరిగి పొందిన పలువురు బాధితులు తమ అనుభవాలను పంచుకున్నారు.
సృజన అనే మహిళా బాధితురాలు KPHB లోని టి పాయింట్ దగ్గర రెండు నెలల క్రితం Tea త్రాగడానికి వెళ్ళగా తన I Phone 17 Pro అక్కడ మర్చిపోయింది వెంటనే KPHB పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఫోన్కు కాల్ చేసినప్పుడల్లా స్విచ్ ఆఫ్ రావడంతో తిరిగి దొరుకుతుందో లేదో అని ఆందోళన చెందానని చెప్పారు. అయితే సైబరాబాద్ పోలీసులు కృషి చేసి తన ఫోన్ను తిరిగి అందజేయడంతో వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరో TCS లో పని చేస్తున్న నారాయణ చౌదరి అనే బాధితుడు తన Motorola మొబైల్ ఫోన్ కోకపేట్ లోని రెస్టారెంట్ లో పోయింది అని, తదుపరి నార్సింగి పోలీసు స్టేషన్ లో ధరఖాస్తు ఇచ్చాను అని తెలిపి, చాలా కాలం అయిపోయిందని, ఇక అది దొరకదని భావించానని తెలిపారు. అయితే పోలీసులు అకస్మాత్తుగా ఫోన్ చేసి తన ఫోన్ దొరికిందని చెప్పడంతో ఎంతో ఆనందంగా అనిపించిందని చెప్పారు.
మెదక్ కు చెందిన మహమ్మద్ ముఖిబ్ అనే బాధితుడు తాను కూకట్పల్లి లో Zomato & Swiggy లో పనిచేసుకుంటూ ఉండేవాడు అని తెలిపి, ఒక సంవత్సరం క్రితం కూకట్పల్లి లోని Alsaba హోటల్ వద్ద tea త్రాగే సమయం లో నయొక్క ఫోన్ అక్కడ మరిచిపోయాను, కొద్ది సేపటికి మరలా వచ్చి చూసే సరికి నా యొక్క ఫోన్ అక్కడ లేదు, వెంటనే ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది, ఆ సమయం లో నా దగ్గర ఒక్క రూపాయి కూడా డబ్బులు లేవు మరియు వాళ్ళ అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదు అని తెలిపాడు మరియు ఆ ఫోన్లో తన బ్యాంక్ ఖాతా వివరాలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారం ఉండటంతో ఎవరైనా దుర్వినియోగం చేస్తారేమోనని భయపడ్డామని చెప్పారు. అయితే సైబరాబాద్ పోలీసులు కృషి చేసి తన ఫోన్ను తిరిగి అందజేయడంతో సంతోషం వ్యక్తం చేశారు.
బిహార్ కు చెందిన మరో బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, Sattva Knowledge City లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న సమయం లో తన office ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు, తదుపరి నేను రాయదుర్గం పోలీసులకు దరఖాస్తు ఇవ్వగా, మీ ఫోన్ తప్పకుండ దొరుకుతుంది అని నాకు ధైర్యo చెప్పారు, అయితే CCS పోలీసులు అకస్మాత్తుగా ఫోన్ చేసి తన ఫోన్ దొరికిందని చెప్పడంతో ఎంతో ఆనందంగా అనిపించిందని చెప్పారు మరియు సైబరాబాద్ పోలీసులకు కృత్జ్ఞతలు తెలియజేశాడు.
ఈ కార్యక్రమం లో క్రైమ్స్ డీసీపీ ఎ. ముత్యం రెడ్డి, క్రైమ్స్ ఏసీపీ వై. నాగేశ్వర్ రావు మరియు S. వెంకటేష్, మరియు ఇన్స్పెక్టర్లు P. జగదీశ్వర్, సీసీఎస్ కుకట్పల్లి, G. సత్యనారాయణ, సిసిఎస్ కుత్బుల్లాపూర్, S. విజయ్. సీసీఎస్ శేరిలింగంపల్లి, G. మురలి కుమార్, సీసీఎస్ నార్సింగి, తధితరలు పాల్గొన్నారు.