31/05/2026
గాంధీభవన్, హైదరాబాద్ :-
రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారి అధ్యక్షతన నేడు ఇందిరాభవన్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ సయ్యద్ ఖాలీద్ అహ్మద్ గారు, సహ ఇంచార్జ్లు రోషిని కుషాల్ జైస్వాల్ గారు, కేఆర్ భవ్య గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శివచరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వ నీట్ పేపర్ లీకేజీ, పెట్రోల్ పెంపు వంటి అనేక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
ఇందులో భాగంగా జూన్ 3న నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ గారు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని కావున యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.