28/07/2026
పత్రిక ప్రకటన 28.07.2026
వికలాంగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి
పెన్షన్స్ పెంచే వరకు ఉద్యమం
NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) హవెలి ఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామంలో వికలాంగుల సమావేశం మండల అధ్యక్షురాలు స్వరూప అధ్యక్షతన జరిగింది. *సమావేశానికి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ* ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ పథకాలు వికలాంగులకు దక్కడం లేదని అన్నారు.చేయూత పెన్షన్స్ పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు. పెన్షన్ పెంంపు కోసం వికలాంగులతో పాటు చేయూత లబ్ధిదారులు ఎదురుచూస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. జూన్ 2 నాడు 2 లక్షల మందికి కొత్తగా చేయూత పెన్షన్స్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మళ్ళీ ఆగష్టు 15 నాడు కొత్త పెన్షన్స్ మంజూరు చేస్తామని ప్రకటించడం అంటే చేయూత లబ్ధిదారులను మోసం చేయడమే అవుతుందని అన్నారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు
ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కే మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు టి యాదగిరి, హవెలి ఘనపూర్ మండల అధ్యక్షులు స్వరూప, గ్రామ నాయకులు సత్యమ్మ, షరీఫ్, కుమార్, బాబు, కిష్టయ్య, పోచయ్య, లలిత తదితరులు పాల్గొన్నారు.
స్వరూప
మండల అధ్యక్షులు
NPRD హవెలి ఘనపూర్ మండల కమిటీ