10/04/2026
*వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటు పడదాం*
*42% బీసీ రిజర్వేషన్ల అమలుకోసం ఐక్యంగా పోరాడుదాం*
*ఆదార్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు*
*ఉప్పెన / ఖమ్మం* : పేదల అభ్యున్నతకై పాటుపడదామని, 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం అన్ని సంఘాలతో ఐక్యంగా పోరాడుదాం అని గౌడ సంఘం జెఎసీ రాష్ట్ర నాయకులు అమరగాని వెంకన్న గౌడ్, ఆదార్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంబోజి బుడ్డయ్య, బీసీ ఐక్యవేదిక నాయకులు పొడగంటి రాంబాబు లు అన్నారు. గురువారం నగరంలోని జ్యోతిరావు పూలే ఐక్యవేదిక కార్యాలయంలో ఆదార్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుక్కల నాగేశ్వరరావు గౌడ్ ఆధ్వర్యంలో బూర సైదారావు గౌడ్,నక్క అజయ్ పద్మశాలి ల అధ్యక్షతన జరిగిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ పాలకులు ఎస్సీ, ఎస్టీ,బీసీ లును కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగా వాడుకున్నారని, ఏలాంటి రాజ్యాంగబద్ధమైన పదవులు ఇవ్వలేదని, తమకు అన్యాయం జరిగిందని, కేవలం తమ స్వప్రయోజనాల కోసం తమ పదవుల కోసమే తమను వాడుకొని విస్మరించారని, అణగారిన వర్గాల హక్కుల సాధనకు జ్యోతిరావు పూలే, అంబేద్కర్ ల స్ఫూర్తితో పనిచేయాలన్నారు
పార్టీలన్నీ కుటుంబ పాలనకే ప్రాధాన్యమిస్తున్న తరుణంలో వాటిని నిరోధించేదుకు అందరం ఐక్యం కావాలని వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల అమలులో అందరికీ న్యాయం జరిగేలా, నిజమైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందేలా మనం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొవాలన్నారు. పేదలకు అన్యాయం జరిగినప్పుడు పార్టీలకతీతంగా బీసీ,ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు అండగా నిలిచేందుకు సమిష్టిగా పయనం చేద్దామని వారు పిలుపునిచ్చారు. అనంతరం చదువుతోపాటు వివిధ రంగాల్లో ప్రావీణము కనబరిచిన సాధనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదార్ పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ చైర్మన్ అలెం వెంకటేశ్వర్లు, ఆదార్ పార్టీ రాష్ట్ర నాయకులు తల్లాడ వెంకన్న,ఆదార్ పార్టీ కొత్తగూడెం ఇంచార్జ్ ప్రేమ్ దయ్యాల్, జాగృతి జిల్లా అధ్యక్షురాలు గట్టు కరుణ, పెరుగు వెంకటరమణ యాదవ్, తీరాల సాధన, అపర మేధావి గుగ్గిల దివ్యమూర్తి, బహుజన ముక్తి పార్టీ అధ్యక్షులు మట్టి ప్రసాద్, అడ్వకేట్ నరేందర్, లెనిన్ ముదిరాజ్, దుర్గాప్రసాద్,సునీల్, మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు