Nallakunta Police Station, Hyderabad City, Telangana State

Nallakunta Police Station, Hyderabad City, Telangana State This site is not for reporting crime - if you see suspicious or criminal activity, call 100 or 040-27853580 or 9490616373.

Welcome to this Facebook site - one way we're helping Hyderabad City people to be safe and feel safe.

25/07/2026

𝐓𝐡𝐞 𝐈𝐧𝐭𝐞𝐫𝐧𝐞𝐭 𝐍𝐞𝐯𝐞𝐫 𝐅𝐨𝐫𝐠𝐞𝐭𝐬.
𝐏𝐫𝐨𝐭𝐞𝐜𝐭 𝐘𝐨𝐮𝐫 𝐏𝐫𝐢𝐯𝐚𝐜𝐲—𝐒𝐡𝐚𝐫𝐞 𝐖𝐢𝐬𝐞𝐥𝐲.

Your photos, personal details, and location updates can be misused by cybercriminals for identity theft, impersonation, phishing, and fraud.

✔️ Think before you post.
✔️ Verify before you trust.
✔️ Protect your digital footprint.
Stay Alert. Stay Secure. Stay Cyber Safe.

25/07/2026
29/06/2026

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

ఏడేళ్ల బాలికను లైంగిక దాడి నుంచి సమయస్ఫూర్తితో రక్షించిన దంపతులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు అభినందించారు. బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయంలో శనివారం కొల్లాటి రమేష్, మువ్వాలమ్మ దంపతులను ఆయన శాలువాతో సత్కరించి, నగదు పురస్కారాన్ని అందజేశారు.

ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆడుకుంటున్న ఓ ఏడేళ్ల చిన్నారికి రూ.20 ఇస్తానని ఆశ చూపి, మహ్మద్ శంషుద్దీన్ (60) అనే రిక్షా కార్మికుడు తన రిక్షాపై ఎక్కించుకొని వెళ్లాడు. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ క్రమంలో స్థానికంగా నివసించే రమేష్, మువ్వాలమ్మ దంపతులు నిందితుడి దుశ్చర్యను గమనించి తక్షణమే స్పందించారు. నిందితుడి బారి నుంచి బాలికను సురక్షితంగా రక్షించడమే కాకుండా, డ‌య‌ల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు మహ్మద్ శంషుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ.. సమాజంలో నేరాల నియంత్రణకు పౌరుల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ఇటువంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే పోలీసుల నిఘాతో పాటు పౌరుల అప్రమత్తత కూడా అంతే ముఖ్యమ‌న్నారు. ''మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తూ ప్రతి పౌరుడూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాధారణ పరిస్థితులు కనిపిస్తే తక్షణమే డ‌య‌ల్ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలి. ఆపదలో ఉన్న చిన్నారిని కాపాడటంలో రమేష్, మువ్వాలమ్మ దంపతులు చూపిన చొరవ, సమయస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలి" అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ డీసీపీ రమణా రెడ్డి, బోరబండ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ సురేందర్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

పీఆర్వో,
హైద‌రాబాద్ సిటీ పోలీస్

29/06/2026

➡️ఆన్‌లైన్ ఆటల ఉచ్చులో బాల్యం!!

➡️తల్లిదండ్రుల నిఘా లోపమే ప్రధాన కారణం

‌➡️చిన్నారుల గేమింగ్ ప్రమాదాలపై హైదరాబాద్ సీపీ సజ్జనర్ కీలక అడ్వైజరీ

✳️'ఫ్రీ ఫైర్', 'ఫ్రీ ఫైర్ మ్యాక్స్' వంటి ఆన్‌లైన్ మల్టీప్లేయర్ ఆటల ఉచ్చులో పడి చిన్నారులు ఆర్థికంగా, మానసికంగా నష్టపోకుండా ఉండేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఒక కీలకమైన అడ్వైజరీ జారీ చేశారు. ఇటీవల సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వస్తున్న అనేక ఫిర్యాదులు బయటకు కేవలం ఆర్థిక మోసాలుగా కనిపిస్తున్నప్పటికీ.. వాటి వెనుక ముఖ్యంగా ఈ ఆన్ లైన్ గేములకు పిల్లలు బానిస కావడం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడమే ప్రధాన కారణాలని ఆయన స్పష్టం చేశారు. చిన్నారుల భవిష్యత్తును నాశనం చేస్తున్న ఇలాంటి గేమింగ్ యాప్‌ల అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని, వీటి నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకునేలా గూగుల్ వంటి అంతర్జాతీయ సాంకేతిక సంస్థలకు సైతం లేఖలు రాస్తామని పేర్కొన్నారు.

✳️హ్యాకింగ్ కాదు.. సొంత బిడ్డల పనే!

మొబైల్‌కు వరుసగా డెబిట్ మెసేజ్‌లు రావడంతో తమ బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని ఆందోళన చెందుతూ చాలామంది బాధితులు ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు దర్యాప్తు చేశాక బయటపడే నిజం తల్లిదండ్రులకు పెద్ద షాక్ ఇస్తోంది. అక్కడ ఎలాంటి హ్యాకింగ్ లేదా మోసపూరిత లింకులు లేవని, పిల్లలే 'ఫ్రీ ఫైర్', 'ఫ్రీ ఫైర్ మ్యాక్స్' వంటి ఆన్‌లైన్ మల్టీప్లేయర్ ఆటల్లో వర్చువల్ కాయిన్స్, డైమండ్స్ కొనుగోలు చేయడానికి ఫోన్‌లో సేవ్ చేసిన కార్డ్స్ లేదా యూపీఐ వివరాలను వాడేశారని తేలుతోంది. ముఖ్యంగా, తాతయ్యలు, నానమ్మల ఫోన్లలో యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయి ఉండటంతో పిల్లలు సులభంగా వేల రూపాయల లావాదేవీలు చేసేస్తున్నారు. ఇది సాంకేతికంగా నేరం కానప్పటికీ, కేవలం ఇంట్లో పర్యవేక్షణ లోపం వల్ల జరుగుతోంది. ఇటువంటి అజాగ్రత్తల వల్ల అసలైన సైబర్ నేరస్థులను పట్టుకోవాల్సిన పోలీసుల విలువైన సమయం వృథా అవుతోంది.

✳️గేమ్ పరిచయం.. పక్క రాష్ట్రానికి పరుగు!

ఇటీవల జరిగిన మైనర్ బాలికల అదృశ్యం ఉదంతం.. ఆన్‌లైన్ ఆటలు, సోషల్ మీడియాతో పొంచి ఉన్న ప్రమాదాలను మరోసారి కళ్లకు కట్టింది. 'ఫ్రీ ఫైర్' గేమ్ ద్వారా కొందరు అపరిచిత వ్యక్తులతో పరిచయం పెంచుకున్న బాలికలు, ఆ తర్వాత సోషల్ మీడియా యాప్స్ ద్వారా వారితో చాటింగ్ కొనసాగించారు. ఆన్‌లైన్ మాయలో పడిపోయి.. కేవలం ఇంటర్నెట్‌లో మాత్రమే పరిచయమైన ఆ వ్యక్తులను నేరుగా కలవడానికి తమ ఇళ్లను వదిలి, పక్క రాష్ట్రానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అయితే, పోలీసులు సకాలంలో స్పందించి ఆ బాలికలను సురక్షితంగా కాపాడి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. పిల్లలు ఫోన్లలో ఏం చేస్తున్నారో గమనించడం, వారికి డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడం ఎంత అత్యవసరమో ఈ సంఘటన తెలియజేస్తోంది.

✳️'స్టేటస్' కోసం దొంగచాటు ఖర్చులు!

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 10 నుంచి 17 ఏళ్ల లోపు విద్యార్థులు నేడు క్లాస్‌రూమ్‌ల కంటే 'ఫ్రీ ఫైర్, మ్యాక్స్' వంటి గేమింగ్ వర్చువల్ యుద్ధభూమిలోనే ఎక్కువగా గడుపుతున్నారు. స్నేహితుల మధ్య తమ స్టేటస్ కోల్పోకూడదనే తాపత్రయమే దీనికి కారణం. ఆటలో రేర్ ఐటమ్స్, రకరకాల ఆయుధాలు, 'ఎలైట్ పాస్' ఉన్నవారినే స్నేహితులు హీరోలుగా చూడటం, అవి లేని వారిని తక్కువ చేసి మాట్లాడటంతో.. ఆ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు దొంగచాటుగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఒకప్పుడు ఆన్‌లైన్ క్లాసుల పేరుతో చేతికి వచ్చిన ఫోన్లు, నేడు అర్ధరాత్రి వరకు సాగే గేమింగ్ సెషన్లుగా మారిపోతున్నాయి. తల్లిదండ్రులు బిజీగా ఉండటం, టెక్నాలజీపై వారికి తగినంత అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

✳️పసిమనస్సులను కబళిస్తున్న 'గేమింగ్ డిజార్డర్స్

అతిగా ఆన్‌లైన్ ఆటలు ఆడటం కేవలం అలవాటు మాత్రమే కాదు, ఒక భయంకరమైన మానసిక రుగ్మత అని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లోనే గుర్తించి దీనికి 'గేమింగ్ డిజార్డర్' అని నామకరణం చేసింది. ఆటలపై నియంత్రణ కోల్పోవడం, చదువు, నిద్ర, కుటుంబ సభ్యుల కంటే ఆటలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, నష్టాలు జరుగుతున్నా ఆట మానలేకపోవడం ఈ రుగ్మత ప్రధాన లక్షణాలు. దీనివల్ల పిల్లల్లో తీవ్ర కోపం, దూకుడు ప్రవర్తన, చదువులో వెనుకబాటుతనం, నిద్రలేమి, కంటి సమస్యలు, సామాజిక దూరం పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, ఆటలను కఠినంగా నిషేధించడం దీనికి సరైన పరిష్కారం కాకపోవచ్చు. అది వారిలో మరింత ఉత్సుకతను పెంచి దొంగచాటుగా ఆడేందుకు దారితీస్తుంది. కాబట్టి పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడటం, వారిని అర్థం చేసుకోవడం, ఆటల సమయాన్ని క్రమబద్ధీకరించడమే దీనికి అసలైన పరిష్కారం.

దేశ భద్రతా కారణాల దృష్ట్యా 2022లోనే కేంద్ర ప్రభుత్వం అసలైన 'ఫ్రీ ఫైర్' గేమ్‌ను భారతదేశంలో నిషేధించింది. అయినప్పటికీ, సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు చిన్నారులు వీపీఎన్ ల ద్వారా దొంగచాటుగా ఈ నిషేధిత గేమ్‌ను ఇంకా ఆడుతూనే ఉన్నారు. మరోవైపు, ఈ గేమ్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా వచ్చిన 'ఫ్రీ ఫైర్ మ్యాక్స్' ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో యథేచ్ఛగా లభిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. నిషేధిత గేమ్‌కు ప్రత్యామ్నాయంగా మారిన ఈ వెర్షన్‌కు చిన్నారులు అత్యంత వేగంగా ఆకర్షితులవుతూ, తీవ్ర వ్యసనానికి లోనవుతున్నారు.

✳️ఇప్పుడైనా కళ్లు తెరవండి.. పిల్లలను కాపాడుకోండి

చిన్నారులను ఆన్‌లైన్ ఆటల ముప్పు నుంచి కాపాడుకునేందుకు తల్లిదండ్రులు తక్షణమే కొన్ని కీలక రక్షణ చర్యలు చేపట్టాలి. మొదటగా, పిల్లలు వాడే ఫోన్ల నుంచి సేవ్ చేసిన బ్యాంక్ కార్డులు, యూపీఐ ఆటోఫిల్ వివరాలను తొలగించి, ప్రతి లావాదేవీకి పిన్ లేదా బయోమెట్రిక్ లాక్ తప్పనిసరి చేయాలి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లలో 'పేరంటల్ కంట్రోల్స్', 'పర్చేజ్ అప్రూవల్స్' ఆన్ చేసుకోవాలి. బ్యాంక్ అలర్ట్ మెసేజ్‌లను నిరంతరం గమనిస్తూ, వాటి ప్రాముఖ్యతను ఇంట్లోని వృద్ధులు, పెద్దవారికి కూడా వివరించాలి. అవసరమైతే పిల్లలకు పరిమిత బ్యాలెన్స్ ఉండే ప్రీపెయిడ్ కార్డులు మాత్రమే ఇవ్వాలి. ఇంట్లో ఎవరి మొబైల్ వాడినా సరే, రోజువారీ ఫోన్ వాడకంపై కచ్చితమైన సమయ పరిమితి విధించాలి. పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూ వారు ఆడే ఆటల గురించి అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ వారిలో తీవ్ర కోపం, నిద్రలేమి, మార్కులు తగ్గడం, ఫోన్‌ను దొంగచాటుగా దాచడం వంటి మార్పులు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై చైల్డ్ సైకాలజిస్ట్‌ లేదా కౌన్సిలర్ సహాయం తీసుకోవాలి.

"ఈ అడ్వైజరీ ఆన్‌లైన్ ఆటలను లేదా గేమింగ్‌ను పూర్తిగా వ్యతిరేకించడానికి ఉద్దేశించింది కాదు. ఆన్‌లైన్ ఆటలను కేవలం వినోదం కోసమే, అదీ పరిమిత పరిధుల్లోనే ఆడాలి. మితిమీరిన గేమింగ్, నియంత్రణ లేని సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లల చదువు, ఆరోగ్యం, ప్రవర్తనతో పాటు వారి సమగ్ర వికాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా 'పర్యవేక్షణ (Monitor), మార్గదర్శకత్వం (Mentor), ప్రోత్సాహం (Motivate)' అనే త్రిసూత్రాన్ని పాటించాలి. అలాగే, విద్యార్థులు లేదా చిన్నారులు ఆటల్లోనైనా సరే.. 'క్లిక్ చేసే ముందు ఆలోచించండి' (Think Before You Click, Even While You Play) అనే నినాదాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఉపాధ్యాయులు, సంరక్షకులు కూడా చిన్నారుల ఆన్‌లైన్ కార్యకలాపాలను చురుగ్గా పర్యవేక్షించాలి. వారిలో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందిస్తూ, డిజిటల్ ప్రపంచానికి, నిజ జీవిత కార్యకలాపాలకు మధ్య సరైన సమతుల్యత ఉండేలా ప్రోత్సహించాలి. సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించడమే పిల్లల భద్రతకు, వారి శ్రేయస్సుకు అత్యంత కీలకం. పర్యవేక్షణ లేని ఇంటర్నెట్ వల చిన్నారుల భవిష్యత్తును ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీయకుండా, అలాగే ఆన్‌లైన్ వేధింపుల బారిన పడకుండా కాపాడుకోవడానికే ఈ మార్గదర్శకాలను విడుదల చేశాం. డిజిటల్ భద్రతపై తల్లిదండ్రులకు, పాఠశాలలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు తీసుకుంటోంది."అని సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ సిటీ పోలీస్

Address

Adikmet Main Road, Adikmet Flyover, Vidyanagar, Telangana 500044
Hyderabad
500029

Alerts

Be the first to know and let us send you an email when Nallakunta Police Station, Hyderabad City, Telangana State posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Nallakunta Police Station, Hyderabad City, Telangana State:

Shortcuts

Share