Charminar Police Station, Hyderabad City, Telangana State

Charminar Police Station, Hyderabad City, Telangana State Post your Grievances, Suggestions, Feedback and Participation interest in various initiatives of Hyderabad Police. if you see criminal activity, call 100.

PS Charminar - Look out Notice in Cr.No. 172/2026 U/s 194 BNSS.
22/08/2026

PS Charminar - Look out Notice in Cr.No. 172/2026 U/s 194 BNSS.

Look Out Notice In Cr.No 164/2026 U/s 137(2) BNS of PS charminar,Hyderabad
13/08/2026

Look Out Notice In Cr.No 164/2026 U/s 137(2) BNS of PS charminar,Hyderabad

PS Charminar - Look out Notice in Cr.No. 162/2026 U/h Man Missing
08/08/2026

PS Charminar - Look out Notice in Cr.No. 162/2026 U/h Man Missing

PS Charminar - Look out Notice in Cr.No. 157-2026 U/h Man Missing
25/07/2026

PS Charminar - Look out Notice in Cr.No. 157-2026 U/h Man Missing

04/07/2026

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!
100 రోజుల్లో 185 కేసులు.. 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాల స్వాధీనం

తినే అన్నంలో కల్తీలు.. తాగే పాలలో రసాయనాలు.. చివరకు పసిబిడ్డలకు పట్టే పాలపొడిలోనూ ప్రాణాంతక పదార్థాలు! కేవలం లాభార్జనే పరమావధిగా సాగుతున్న నిశ్శబ్ద ముప్పుపై హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ ఉక్కుపాదం మోపుతోంది. ప్రజారోగ్యాన్ని నిలువునా దెబ్బతీస్తూ నగరవాసుల ఆయుష్షును హరిస్తున్న కల్తీ ముఠాల ఆటకట్టించేందుకు రంగంలోకి దిగిన హైదరాబాద్‌ ఫుడ్‌ అడల్టరేషన్‌ సర్వైలెన్స్ టీమ్‌ (హెచ్-ఫాస్ట్) ఏర్పాటై 100 రోజులను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది మార్చి 19న శంఖారావం పూరించిన ఈ ప్రత్యేక విభాగం.. జీహెచ్‌ఎంసీ, ఫుడ్‌ సేఫ్టీ, వెటర్నరీ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతర దాడులు, ఆకస్మిక తనిఖీలతో నగరంలో ఆహార కల్తీపై రాజీలేని సమరం సాగిస్తోంది.

ఆరోగ్యానికి గొడ్డలిపెట్టు.. ఆహార కల్తీ

ఆహార కల్తీ అనేది కేవలం ఒక చట్టపరమైన నేరమో, వ్యాపార మోసమో కాదు.. అది యావత్ సమాజంపై జరుగుతున్న నిశ్శబ్ద దాడి. పూర్వీకులు స్వచ్ఛమైన ఆహారంతో నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తే, నేడు కల్తీ విషం వల్ల సగటు ఆయుష్షు సగానికి పడిపోతోంది. రసాయనాలు, నాణ్యత లేని నిల్వ పదార్థాల వాడకం వల్ల పసిబిడ్డల ఎదుగుదల దెబ్బతింటోంది. యువత, వృద్ధులు క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులు, గుండె జబ్బుల బారిన పడుతున్నారు. దేశానికి వెన్నెముక లాంటి యువశక్తి రోగాల బారిన పడితే మానవ వనరుల ఉత్పాదకత తగ్గిపోతుంది. ఇది కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడమే కాకుండా, దేశ ప్రగతిని దశాబ్దాలు వెనక్కి నెడుతుంది. కల్తీ ఆహారం వల్ల చికిత్సల రూపంలో, ఉత్పాదకత తగ్గడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 310 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అంచనా. అందుకే కల్తీ లేని స్వచ్ఛమైన ఆహారం పొందడం ప్రతి పౌరుడి హక్కు. ఆ హక్కును కాపాడుతూ భావితరాలకు సురక్షితమైన భవిష్యత్తును అందించడమే హెచ్-ఫాస్ట్ నిఘా పరమావధి.

వంద రోజుల సమరంలో విస్తుపోయే నిజాలు

టాస్క్ ఫోర్స్ డీసీపీ నేతృత్వంలో 36 మంది సుశిక్షితులైన అధికారులు, సిబ్బందితో నిరంతరం పనిచేస్తున్న హెచ్‌-ఫాస్ట్‌ విభాగం.. క్షేత్రస్థాయిలో కల్తీ రక్కసిని కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఈ వంద రోజుల్లో నగరవ్యాప్తంగా వివిధ జోన్ల పరిధిలో మొత్తం 185 కేసులు నమోదు చేసి, సుమారు 121.87 టన్నుల ప్రమాదకరమైన కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. జోన్ల వారీగా వివరాలు పరిశీలిస్తే.. అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్‌లో 55 కేసులు నమోదు కాగా, గోల్కొండ జోన్‌లో 44, సికింద్రాబాద్ జోన్‌లో 35, చార్మినార్ జోన్‌లో 21, శంషాబాద్ జోన్‌లో 13, జూబ్లీహిల్స్ జోన్‌లో 12, ఖైరతాబాద్ జోన్‌లో 5 కేసులు నమోదయ్యాయి.

స్వార్థపరులు ప్రజల ప్రాణాలతో ఏ విధంగా ఆడుకుంటున్నారో స్వాధీనం చేసుకున్న పదార్థాల వివరాలే స్పష్టం చేస్తున్నాయి. నిత్యం వాడే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌కు సంబంధించి 27 కేసుల్లో ఏకంగా 27,024.7 కేజీల నకిలీ నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. కృత్రిమ రసాయనాలతో పండ్లను మగ్గబెట్టే 16 ముఠాల గుట్టురట్టు చేసి 25,845 కేజీల పండ్లను సీజ్ చేశారు. చికెన్ వ్యర్థాల విక్రయాలకు సంబంధించిన 6 కేసుల్లో ఏకంగా 60 టన్నుల కంటే ఎక్కువ చికెన్‌ను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. వీటితో పాటు 3 కేసుల్లో 9,260 కేజీల నిల్వ పచ్చళ్లు, 4 కేసుల్లో 4,030 కేజీల కల్తీ కోవా, 7 కేసుల్లో 3,897 కేజీల నకిలీ టీ పొడి, సుమారు 15 టన్నుల నాణ్యత లేని చికెన్/మాంసం (12 కేసులు), 3,260 కేజీల కల్తీ క్రీమ్, 530 కేజీల కల్తీ నెయ్యి (1 కేసు), సుమారు 2,706 కేజీల నాణ్యత లేని డ్రై ఫ్రూట్స్/ఖర్జూరం (2 కేసులు), 2,500 కేజీల కల్తీ పెరుగు (1 కేసు), 1,514 కేజీల కల్తీ పనీర్ (5 కేసులు), ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో 120 కేజీల నాణ్యత లేని ఫ్రైడ్ చికెన్ (2 కేసులు) స్వాధీనం చేసుకున్నారు. ఐస్ క్రీములు, బిస్కెట్లు, ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, జంక్ ఫుడ్స్ వంటి ఇతర విభాగాల్లో 34 కేసులు నమోదయ్యాయి.

మరో 247 కేసులు జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి బదిలీ

పోలీసు చర్యలతో పాటు జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్(ఎఫ్ఎస్ఓ)లకు తదుపరి చర్యల నిమిత్తం 247 కేసులు అప్పగించారు. ఇందులో అత్యధికంగా పనీర్ అవుట్‌లెట్లపై 70 కేసులు, ప్రజల నుంచి నేరుగా వచ్చిన ఫిర్యాదులపై 90 కేసులు నమోదు చేశారు. అలాగే సమోసా తయారీ కేంద్రాలపై 11, వాటర్ ప్యాకింగ్ ప్లాంట్లపై 9, మసాలాలు/స్పైసెస్ పై 7, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై చెరో 6 కేసులు, జెప్టోపై 5, హాస్టళ్లు, మాంసం దుకాణాలపై చెరో 4 కేసులు, ఐస్ తయారీ కేంద్రాలపై 3, చికెన్ వేస్ట్/సీ ఫుడ్‌పై 3 కేసులు దాఖలయ్యాయి.

విభాగాల సమన్వయంతోనే కల్తీకి చెక్!

ఆహార కల్తీ నివారణ అనేది కేవలం ఒకే విభాగానికి పరిమితమైన అంశం కాదని, బహుళ ప్రభుత్వ విభాగాల ఉమ్మడి బాధ్యత అని పోలీస్ ఉన్నతాధికారులు గుర్తించారు. అందుకే హెచ్‌-ఫాస్ట్‌ విభాగం.. జీహెచ్‌ఎంసీ, ఫుడ్‌ సేఫ్టీ, వెటర్నరీ విభాగాల అధికారులతో సంపూర్ణ సమన్వయంతో క్షేత్రస్థాయిలో పని చేస్తోంది. కల్తీ మూలాలను తుడిచిపెట్టడానికి ఆయా భాగస్వామ్య విభాగాల ఉన్నతాధికారులతో పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ చర్యలు తీసుకుంటున్నారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం, కల్తీ నమూనాల సేకరణ వేగవంతం చేయడం, ఆకస్మిక తనిఖీలలో ఎదురయ్యే న్యాయ, క్షేత్రస్థాయి సవాళ్లను అధిగమించడంలో పరస్పర సహకారం లభిస్తోంది. ఈ బహుళ విభాగాల ఉమ్మడి సమన్వయం వల్లే నగరంలో కల్తీ దందాను విజయవంతంగా అడ్డుకోవడం సాధ్యపడుతోంది.

వ్యాపారులకు స్పష్టమైన ఆదేశాలు

కల్తీ నియంత్రణతో పాటు నివారణ చర్యలపై కూడా పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, తదితర తయారీ కేంద్రాలకు చెందిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వ్యాపారం పేరిట ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే పద్ధతులను ఏమాత్రం సహించబోమని వారికి నిర్మొహమాటంగా స్పష్టం చేస్తూ, కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ మార్గదర్శకాలను ప్రత్య‌క్షంగా కానీ, ప‌రోక్షంగా గానీ ఫుడ్ బిజినెస్ తో సంబంధం ఉన్న ప్ర‌తి ఒక్క‌రు విధిగా పాటించాల‌ని స్ప‌ష్టం చేశారు.

కల్తీ నిరోధంలో భాగంగా వ్యాపారులు తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సిబ్బంది గ్లౌజులు, మాస్కులు ధరించడం, నిల్వల్లో పాత నిల్వలను కొత్త నిల్వలను కలపకుండా 'ఫిఫో' (FIFO - First In, First Out) పద్ధతిని పాటించడం, హోటళ్లలో వాడిన నూనెను పదే పదే వాడకుండా జాగ్రత్తపడడం వంటి నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

హెచ్-ఫాస్ట్ ప్రారంభించిన తక్కువ రోజుల్లోనే ఈ విభాగం సిబ్బంది క్షేత్రస్థాయిలో అత్యంత సమర్థవంతంగా పనిచేసి ఆశించిన ఫలితాలను సాధించడం అభినందనీయమని హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు. జీహెచ్‌ఎంసీ, ఫుడ్‌ సేఫ్టీ, వెటర్నరీ విభాగాల స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తూ ఈ బృందం దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని, ఆహార కల్తీ నియంత్రణకు హెచ్-ఫాస్ట్ కు సహకరిస్తోన్న ఆయా ప్రభుత్వ విభాగాల అధికారులకు, ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. హెచ్-ఫాస్ట్ కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రతి రోజు సగటున 15 వరకు కల్తీ ఆహార సమాచారాన్ని అందిస్తున్నారని తెలిపారు.

“సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఆహార కల్తీ. ప్రజల కిడ్నీలను పాడుచేస్తూ, క్యాన్సర్, గుండె జబ్బుల వంటి తీవ్రమైన వ్యాధులను పంచుతూ సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ విషపూరిత రసాయనాల వాడకం వల్ల చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదల పూర్తిగా దెబ్బతింటోంది. శారీరక సామర్థ్యం దెబ్బతింటే మానవ వనరుల ఉత్పాదకత తగ్గి, దేశ ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నమవుతుంది. అందుకే ఈ దందాను మేము కేవలం ఒక చిన్నపాటి వ్యాపార మోసంగానో లేదా నిబంధనల ఉల్లంఘనగానో చూడటం లేదు; ఇది ప్రజల ఆరోగ్యంతో, అమాయకుల ప్రాణాలతో ఆడుకునే ఒక ఘోరమైన హత్యాయత్నం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ వారి ప్రాణాలను హరించే కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనుకాడబోం." అని హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు.

ఆహార కల్తీ మహమ్మారిని అరికట్టడంలో పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన పిలుపునిచ్చారు. పరిసరాల్లో ఎక్కడైనా ఆహార పదార్థాల కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వచ్చినా, లేదా అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేస్తున్నట్లు తెలిసినా ఏమాత్రం సంకోచించకుండా వెంటనే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ నంబర్ 8712661212కు వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. సురక్షిత, ఆరోగ్యవంతమైన హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

పీఆర్వో
హైద‌రాబాద్ సిటీ పోలీస్

27/06/2026

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

ఏడేళ్ల బాలికను లైంగిక దాడి నుంచి సమయస్ఫూర్తితో రక్షించిన దంపతులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు అభినందించారు. బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయంలో శనివారం కొల్లాటి రమేష్, మువ్వాలమ్మ దంపతులను ఆయన శాలువాతో సత్కరించి, నగదు పురస్కారాన్ని అందజేశారు.

ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆడుకుంటున్న ఓ ఏడేళ్ల చిన్నారికి రూ.20 ఇస్తానని ఆశ చూపి, మహ్మద్ శంషుద్దీన్ (60) అనే రిక్షా కార్మికుడు తన రిక్షాపై ఎక్కించుకొని వెళ్లాడు. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ క్రమంలో స్థానికంగా నివసించే రమేష్, మువ్వాలమ్మ దంపతులు నిందితుడి దుశ్చర్యను గమనించి తక్షణమే స్పందించారు. నిందితుడి బారి నుంచి బాలికను సురక్షితంగా రక్షించడమే కాకుండా, డ‌య‌ల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు మహ్మద్ శంషుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ.. సమాజంలో నేరాల నియంత్రణకు పౌరుల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ఇటువంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే పోలీసుల నిఘాతో పాటు పౌరుల అప్రమత్తత కూడా అంతే ముఖ్యమ‌న్నారు. ''మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తూ ప్రతి పౌరుడూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాధారణ పరిస్థితులు కనిపిస్తే తక్షణమే డ‌య‌ల్ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలి. ఆపదలో ఉన్న చిన్నారిని కాపాడటంలో రమేష్, మువ్వాలమ్మ దంపతులు చూపిన చొరవ, సమయస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలి" అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ డీసీపీ రమణా రెడ్డి, బోరబండ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ సురేందర్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

పీఆర్వో,
హైద‌రాబాద్ సిటీ పోలీస్

24/06/2026

𝐂𝐘𝐁𝐄𝐑 𝐂𝐑𝐈𝐌𝐄 𝐏𝐎𝐋𝐈𝐂𝐄, 𝐇𝐘𝐃𝐄𝐑𝐀𝐁𝐀𝐃 𝐁𝐔𝐒𝐓𝐄𝐃 ₹𝟏.𝟐𝟐 𝐂𝐑𝐎𝐑𝐄 𝐈𝐍𝐕𝐄𝐒𝐓𝐌𝐄𝐍𝐓 𝐓𝐑𝐀𝐃𝐈𝐍𝐆 𝐅𝐑𝐀𝐔𝐃 – 𝐓𝐖𝐎 𝐊𝐄𝐘 𝐀𝐂𝐂𝐔𝐒𝐄𝐃 𝐀𝐑𝐑𝐄𝐒𝐓𝐄𝐃 𝐅𝐎𝐑 𝐎𝐏𝐄𝐑𝐀𝐓𝐈𝐍𝐆 𝐌𝐔𝐋𝐄 𝐁𝐀𝐍𝐊 𝐀𝐂𝐂𝐎𝐔𝐍𝐓𝐒

The Cyber Crime Police, Hyderabad City, arrested two individuals in connection with a ₹1.22 crore investment trading fraud. Investigations revealed the operation of a network of mule bank accounts used to route cybercrime proceeds. The accounts were allegedly utilized for online Trading and money laundering activities. The arrests mark a significant step in disrupting financial networks supporting cyber fraud.
Accused:
A1 resident of Begumpet, Hyderabad.
A3 resident of Wanparthey, Telangana State.
A4 resident of Ananthapur, Andhra Pradesh.
A5 resident of Champapet, Telangana State.
A6 resident of Parbhani, Maharashtra State.
A9 resident of Parbhani, Maharashtra State.

CASE FACTS:
In the month of January-2026, Victim R/o Hyderabad was induced through a WhatsApp investment group named '282 BARCLAYS India High-Quality Stock Trading Research Group'. He invested through fake platforms http://BarclaysDailyTrading.com and http://app.bulishmark.com after being promised high returns and IPO allotments. Initially he was allowed to withdraw ₹1,05,000 to gain confidence. Thereafter he invested ₹1,22,18,029.50 in 19 transactions. The fraudsters falsely displayed profits of ₹15.69 Crores and demanded an additional ₹35 Lakhs for release of IPOs.

MODUS OPERANDI OF ACCUSED:
Investigation revealed that one of the key accused established a company with the objective of opening high-value current bank accounts and subsequently sharing internet banking credentials with third parties. These accounts were utilized for routing proceeds of cybercrime and collections generated through online Trading platforms. The investigation further disclosed that genuine business accounts were procured through commission-based arrangements, while additional accounts were activated by employing remote access mechanisms and manipulation of OTPs. The accused persons allegedly earned commissions for facilitating, procuring, and supplying such bank accounts to various entities involved in illegal activities. It was further found that a YES Bank account supplied by Accused A5 was linked to a total of 26 cases across India, including 4 cases registered in the State of Telangana. Analysis of the account transactions revealed credits and debits amounting to ₹1,10,86,009/- through the said account. Similarly, a Central Bank of India account supplied by Accused A6 & A9 was found to be linked to 18 cases across India, including 2 cases registered in the State of Telangana. Transaction analysis revealed that a total amount of ₹3,37,00,000/- was routed through the said account. The account was allegedly utilized for trading platforms. The findings indicate the active involvement of the accused persons in facilitating and providing bank accounts that were subsequently used for laundering and transferring proceeds derived from cybercrime and other unlawful online activities.

SEIZURE:
1. Three mobile phones
2. Four ATM/Debit Cards
3. Two cheque books
4. Two bank passbooks
5. Three Airtel SIM cards

Under the guidance of DCP Cyber Crimes, Sri. V. Arvind Babu, and the supervision of ACP Sri Siva Maruthi, the Cybercrime Police Station team, led by Inspector Y. Gowri Naidu, along with SI K. Hima Reddy, supporting HC Ch. Sunil, PCs P. Ashok, P. Sainath, M. Rajender, WPC D. Meena played a crucial role in apprehending the accused and recovering material objects. Their commendable efforts, which dismantled a sophisticated cybercrime network worth rewarding.

ADVISORY:
To protect yourself from cybercrime and financial fraud:
Refrain from receiving or attending calls from unknown numbers.

Remain calm if you receive threatening video calls claiming to be from government agencies, such as CBI, RBI, ED, Customs, Judges, Cyber-Crimes Police, Narcotics, FedEx, BSNL, Telecom Dept., or TRAI.

If a call raises suspicion, immediately end the call without engaging further. Report the incident to the nearest police station if you have concerns.

Be aware that government agencies and law enforcement officials will not make Skype calls or demand money to resolve issues.

Note that there is no such thing as "digital arrest" or "online enquiry" in the system.

Be cautious of scammers using psychological tactics to manipulate emotions and decision-making. Never deposit money into unknown bank accounts based on false promises from unknown individuals.

If you are a victim of cybercrime fraud:
•Immediately dial 1930 (or) Visit https://cybercrime.gov.in for assistance

A Cyber Awareness Programme was conducted to educate the public about increasing cyber crimes and methods to stay safe o...
20/06/2026

A Cyber Awareness Programme was conducted to educate the public about increasing cyber crimes and methods to stay safe online. During the programme, participants were informed about common cyber frauds such as online payment scams, OTP frauds, fake loan apps, social media hacking, and phishing messages. The public were advised not to share OTPs, bank details, ATM PINs, or passwords with anyone and to be cautious while clicking unknown links or downloading suspicious applications. They were also informed about fraudsters impersonating bank officials, police officers, or government authorities.

Traced 18-year-old boy Shahad Khan and safely handed over to his mother, Taranum. Timely action and coordinated efforts ...
20/12/2025

Traced 18-year-old boy Shahad Khan and safely handed over to his mother, Taranum. Timely action and coordinated efforts by the police team ensured the child’s safe return. We appreciate the cooperation of the public in helping reunite families. Hyderabad City Police Telangana State Police

Missing Purse traced within one hour:A complainant by name Saad approached the police station reporting that his purse w...
19/12/2025

Missing Purse traced within one hour:
A complainant by name Saad approached the police station reporting that his purse was missing from his pocket while travelling in an auto. He stated that he had accidentally left the purse in the auto.

Immediately, the Charminar police station team reviewed CCTV footage from nearby shops and traced the auto driver. The auto was a private one (not registered under Uber/Ola). The complainant did not have the auto details, as he had paid the fare via scanner and could not note the auto number while alighting.

The police team successfully contacted the auto driver and recovered the purse, which contained the complainant’s original passport and other important documents. The complainant had an international flight scheduled the next morning.

The purse was safely handed over to the complainant, who appreciated the prompt and efficient action of the police team. Hyderabad City Police Telangana State Police

Address

9F3G+JRF, Charminar (Old City), Hari Bowli, Telangana
Hyderabad
500065

Alerts

Be the first to know and let us send you an email when Charminar Police Station, Hyderabad City, Telangana State posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Charminar Police Station, Hyderabad City, Telangana State:

Shortcuts

Share