16/08/2025
నిన్న గాంధీ భవన్లో సంవిధాన్ బచావో కమిటీ చైర్మన్ డాక్టర్ వినయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో సంవిధాన్ బచావో కమిటీ సభ్యులతో మరియు వివిధ సివిల్ సొసైటీ సభ్యులతో కలిసి నిన్న గాంధీ భవన్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో సంవిధాన్ బచావో కమిటీ భవిష్యత్తు కార్యాచరణ మరియు జిల్లా కమిటీల విస్తరణ మరియు వివిధ సివిల్ సొసైటీలతో అనుసంధానమై రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేయాలని, రాజ్యాంగ హక్కులను ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని కార్యక్రమంలో చర్చించడం జరిగింది.
అలాగే ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ కుమార్ గారు మాట్లాడుతూ రాజ్యాంగము ప్రతి విషయంలోనూ బలహీనపడుతూ, ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ విధానాలతో బలహీన పడుతూ వస్తుంది, అలాంటి మన భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసం &బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాహుల్ గాంధీ గారు ఒకవైపు బీసీల లెక్కలు దేశవ్యాప్తంగా తేల్చాలని పోరాటం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో బీసీ లెక్కలను బయట పెట్టించి, వారికి దక్కవలసిన రిజర్వేషన్లను చట్టబద్ధంగా అందించడం కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతూ, మరోవైపు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓట్ల అవకతవకలో జరుగుతున్న అక్రమాలను బయటపెడుతూ వాటిపై పోరాడుతూ రాజ్యాంగ హక్కులను కాపాడుతున్నారని మాట్లాడారు.
అలాగే డాక్టర్ వినయ్ కుమార్ గారు మాట్లాడుతూ గతంలో భారత ఎలక్షన్ కమిషన్ ని ఎన్నుకోవడానికి ఒక నిర్ణీష్టమైన వ్యవస్థ ఉండేది దానిని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మాట్లాడుతూ..గతంలో ఎలక్షన్ కమిషన్ ని ఎన్నుకోవడానికి ఒక విధానం ఉండేది దానిలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, అలాగే చీఫ్ జస్టిస్ ద్వారా ఎన్నుకునే విధానం ఉండేది కానీ దానిని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వము ఆ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ..ప్రస్తుత విధానంలో చీఫ్ జడ్జిని తొలగించి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు అలాగే కేంద్రమంత్రి ద్వారా ఎన్నుకునే నూతన విధానాన్ని తీసుకొచ్చి, బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే 2:1 రేషియోలో వారికి అనుకూలంగా ఉండే విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా భారత రాజ్యాంగం ప్రకారం న్యూట్రల్ వ్యవస్థని కేంద్ర బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు.
అలాగే గతంలో ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ వంటి వ్యవస్థలని ఏ విధంగా నిర్వీణ్యం చేసిందో అలాగే ప్రస్తుతము భారత ఎన్నికల వ్యవస్థని కూడా వారికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం బిజెపి చేస్తుందని ఆరోపించారు.
భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసము బలపరచడం కోసము కాంగ్రెస్ పార్టీ విధానాలతో, రాహుల్ గాంధీ గారి ఆలోచనలతో తెలంగాణ రాష్ట్రంలో సంవిధాన్ బచావో కమిటీ ఆధ్వర్యంలో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలను చేస్తూ ప్రజలను అవేర్నెస్ చేస్తూ నవంబర్ 26 భారత రాజ్యాంగం దినోత్సవం వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు మరియు ప్రజా సంఘాల సహకారంతో ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడతామని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఏఐసిసి నాయకులు జుబేర్ ఖాన్, సివిల్ సొసైటీ నాయకులు డాక్టర్ ఇస్మాయిల్, పురుషోత్తం రెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
P Vinay KumarTelangana CongressMeenakshi NatarajanMahesh Goud BommaDr Addanki DayakarRahul GandhiIndian National Congress