06/08/2026
ఫీజులు చెల్లించలేక విద్యార్థులు ఇబ్బందుల్లో... ప్రభుత్వం వెంటనే స్పందించాలి!
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలలో జాప్యం కారణంగా వేలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్య హక్కును పరిరక్షించాలంటే పెండింగ్లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం అత్యవసరంగా విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు, ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.