25/08/2023
జగిత్యాల జిల్లా.....
*దారి దోపిడీ చేస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్.*
*రెండు పెప్పర్ స్ప్రేలు బాటిల్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనo.*
*నిందితుల వివరాలు:*
A1) ప్రకాష్ s/o రాముతల్, వయస్సు: 26 సంవత్సరాలు,కులం:రాజ్పుత్, ఘర్పూర్ గ్రామం, బంగారుమాలు తాసిల్, ఉన్నావు జిల్లా
A2) దరోగ s/o మోజీలాల్, వయస్సు:30 సంవత్సరాలు, కులం: రాజ్ పుత్, మల్లాపూర్వ గ్రామం, బిలిగ్రామ్ తాసిల్, హర్దోయ్ జిల్లా
A3. అభిషేక్ రాజ్ పుత్ s/o రమేష్ చంద్, వయస్సు:26 సంవత్సరాలు, కులం: లోదే రాజ్పుత్, శివలామూరు గ్రామం, బిలిగ్రామ్ తాసిల్, హార్దోయ్ జిల్లా
A4. మైనర్ బాలుడు పరారీలో ఉన్నాడు.
గత కొంతకాలంగా ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టి వారి మెడలో నుంచి బంగారు చైన్లు, ఒంటిపై గల విలువైన వస్తువులను గాని దొంగిలించే దారిదోపిడి ముఠాలోని ముగ్గురు దొంగలు నిన్న సాయంత్రం మెట్ పల్లి బస్టాండ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా మెట్ పల్లి సి.ఐ, వారి సిబ్బంది వారిని పట్టుకుని అదుపులోకి తీసుకొని విచారించగా వీరు గత సంవత్సరం క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామానికి వచ్చి ఐస్ క్రీం లు అమ్ముతు జీవనోపాధి కొనసాగిస్తున్నారు, అలా వచ్చిన డబ్బులతో జల్సాలకు అలవాటు పడి డబ్బులు సరిపోనందున దొంగతనాలు, దోపిడీ చేయాలని నిర్ణయించుకుని గత సంవత్సరం తేదీ:30.10.2022 రోజున ముగ్గురు మహిళలు మెట్ పల్లి పాత బస్టాండ్ నుండి కోరుట్ల వైపుకు వెళ్తుండగా ఇట్టి ముగ్గురు దారి దోపిడీ దారులు అదే ఆటోలో ఎక్కి మెట్పల్లి నుండి కోరుట్ల వైపుకు వెళ్తున్న దారి మధ్యలో మారుతి నగర్ వద్ద ఆటోను ఆపి ముగ్గురు మహిళలు, మరియు ఆటో డ్రైవర్ పై పెప్పర్ స్ప్రే చేసి ఒక మహిళ మెడలో నుండి మూడు తులాల బంగారు చైన్ దొంగిలించికుపోయారు, అదేవిధంగా తేదీ: 21.08.2023 రోజున కూడా మేడిపల్లి గ్రామంలో ఇద్దరు భార్యాభర్తలు తమ ఆటోలో మేడిపల్లి అంగడిలో కూరగాయలు అమ్ముకొని తిరిగి కోరుట్లకు వెళుతున్న సమయంలో రాత్రి అందాజా ఎనిమిది గంటల సమయంలో పై ముగ్గురు వ్యక్తులతో పాటు మరొక మైనర్ బాలుడు, వయస్సు:14 సంవత్సరాలు మొత్తం నలుగురు కలిసి వారు ముందుగానే అనుకున్న పథకం ప్రకారం A1. ప్రకాష్ , A2. దరోగా, మైనర్ బాలుడు మేడిపల్లిలో అట్టి ఆటో ఎక్కి మేడిపల్లి శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఆటో ఆపి డ్రైవర్ తో అందులోని ప్రకాష్ అను వ్యక్తి ఆటో వెనుక సీట్లో కూర్చుంటానని చెప్పి ఆటో ఆగగానే పెప్పర్ స్ప్రే తీసి డ్రైవర్ కళ్ళలోకి కొట్టి అతడి జేబులో నుండి డబ్బులు తీసేందుకు ప్రయత్నం చేయగా ఆటో డ్రైవర్ మరియు అతని భార్య అరుపులు కేకలు వేయగా ఎవరికైన దొరికిపోతామేమో అనే భయంతో అప్పటికే అక్కడ కాపు కాస్తున్న అభిషేక రాజపుత్ తో కలిసి మొత్తం నలుగురు అక్కడి నుండి పారిపోయారు ఇట్టి సంఘటనలో ఎలాంటి డబ్బులు గానీ వస్తువులు గాని పోలేదు, ఇదే క్రమంలో నిన్న సాయంత్రం కూడా మెట్పల్లి ప్రాంతంలో ఏదైనా దోపిడీ చేద్దామని ప్రకాష్, దరొగ, అభిజిత్ రాజాపుత్ అను ముగ్గురు వ్యక్తులు రెండు పెప్పర్ స్ప్రే పట్టుకొని మెట్పల్లి బస్టాండ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా మెట్పల్లి సి.ఐ వారి సిబ్బంది వారిని పట్టుకోవడం జరిగింది, వారి నుండి రెండు పెప్పర్ స్ప్రే , మూడు సెల్ ఫోన్లు స్వాధీన పరుచుకొని ముగ్గురిని అరెస్టు చేయడం జరిగింది ముఠాలోని మైనర్ బాలుడు పరారీలో ఉన్నాడు. అతడిని కూడా త్వరలోనే పట్టుకుంటాం. ఇట్టి దారి దోపిడీ ముఠా సభ్యుల్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కోరుట్ల సి.ఐ ఎం. ప్రవీణ్ కుమార్, మెటపల్లి సి.ఐ కె. లక్ష్మీనారాయణ , కోరుట్ల ఎస్సై కిరణ్ కుమార్, మేడిపల్లి ఎస్సై చిరంజీవి మరియు మేడిపల్లి పోలీస్ సిబ్బందిని అధికారులను జిల్లా ఎస్పీ గారు అభినందించారు.