15/02/2025
తాళం వేసి ఉన్న ఇళ్లు, మోటార్ సైకిళ్లు, వ్యవసాయ కరెంటు మోటార్ల దొంగతనాలు చేసే ముగ్గురు నిందితులు గల ముఠా అరెస్ట్.
6 లక్షలు విలువగల ( ఒక మోటార్ సైకిల్, 30 కిలోల కాపర్ వైర్ మరియు 30 వ్యవసాయ కరెంటు మోటార్లు. రూ.5,000) స్వాదినం
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు....
మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల జరిగిన దొంగతనాల కేసులలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు తెలిపారు. తాళం వేసి ఉన్న ఇళ్లు, మోటార్ సైకిళ్లు, వ్యవసాయ కరెంటు మోటార్ల దొంగతనాలు ప్రత్యేక నిఘ ఏర్పాటు చేసి మెట్పల్లి డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో, మెట్పల్లి సీఐ నీరంజన్ రెడ్డి నేతృత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బృందo సీసీటీవీ ఫుటేజీలు మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఈ రోజు ఉదయం ఇబ్రహీంపట్నం ఎక్స్ రోడ్డు వద్ద ఇబ్రహీంపట్నం ఎస్సై. అనిల్ తన సిబ్బంది కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిని విచారించగా వారు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వీరు మెట్పల్లికి చెందిన స్క్రాప్ వ్యాపారితో కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలింది. నిందితులు మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్ పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగిలించిన వస్తువులను స్క్రాప్ వ్యాపారికి విక్రయించి, డబ్బులు పంచుకునేవారు.
నిందితుల వివరాలు మరియు వారి నేపథ్యం:
A-1: కుంచేపు వెంకటేష్,తండ్రి పేరు: మైసయ్య, వయస్సు: 28 సం.,డి.డి. నగర్, మెట్పల్లి ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తూ జీవించేవాడు. వచ్చిన డబ్బులు అతని కుటుంబాలకు మరియు జల్సాలకు సరిపోకపోవడంతో ఏదైనా దొంగతనం చేయాలని నిర్ణయించుకొని గతంలో కూడా కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిదిలో (6) మరియు మెట్పల్లి పోలీస్ స్టేషన్ (2) వివిధ దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి తిరిగి వచ్చినారు కూడా ఈజీగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో మళ్లీ దొంగతనాలు చేస్తున్నాడు ఇతడు మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఒక గ్యాంగ్ రేప్ కేసులో కూడా ముఖ్యమైన నిందితుడు.
A-2: సూర్యవంశీ సాయికుమార్, తండ్రి పేరు: శ్యాం రావు, వయస్సు: 28 సం., కులం: SC-మాల స్వస్థలం: ARP క్యాంపు, ఎడపల్లి, నిజామాబాదు జిల్లా ప్రస్తుత చిరునామా: రాఘవపేట గ్రా., మల్లాపూర్ మం. ట్రాక్టర్ డ్రైవర్ పనిచేసుకుంటూ జీవిస్తు ఉన్నాడు. ఇతడు కూడా ట్రాక్టర్ వచ్చే డబ్బులు అతని కుటుంబ అవసరాలకు మరియు అతని జల్సా లకు సరిపోక ఈ క్రమంలో పరిచయమైన మొదటి నిందితుడు కొంచెం వెంకటేష్ తో కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
A-3: అబ్దుల్ బారి, తండ్రి పేరు: అబ్దుల్ ఖాదర్, వయస్సు: 61 సం., ముస్లిం, చిరునామా: రెడ్డి కాలనీ, మెట్పల్లి. గత కొంత కాలం నుంచి మెట్పల్లి పట్టణంలో స్క్రాప్ బిజినెస్ పేరుతో వ్యాపారం నిర్వహించేవాడు. ఇతను దొంగిలించిన సొత్తును కొనేవాడు.
ఇట్టి ముగ్గురు కలిసి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యం తో ఒక వ్యవస్థి కృత నేరానికి తేరాలేపినారు.
కేసుల వివరాలు మరియు స్వాధీనం చేసుకున్న సొత్తు:
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్:
ఒక ఇల్లు దొంగతనం కేసు: స్వాధీనం చేసుకున్న సొత్తు: రూ.5,000.
ఆరు వ్యవసాయ కరెంటు మోటార్ దొంగతనం కేసులు: 11 కరెంటు మోటార్లు.
మెట్పల్లి పోలీస్ స్టేషన్:
ఒక మోటార్ సైకిల్ దొంగతనం కేసు.
మూడు వ్యవసాయ కరెంటు మోటార్ దొంగతనం కేసులు: 8 కరెంటు మోటార్లు.
మల్లాపూర్ పోలీస్ స్టేషన్:
ఒక కాపర్ వైర్ దొంగతనం కేసు.
రెండు వ్యవసాయ కరెంటు మోటార్ దొంగతనం కేసులు: 10 కరెంటు మోటార్లు.
కథలాపూర్ పోలీస్ స్టేషన్:
ఒక వ్యవసాయ కరెంటు మోటార్ దొంగతనం కేసులు: 1కరెంటు మోటార్లు.
స్వాధీనం చేసుకున్న సొత్తు
6 లక్షలు విలువగల ( ఒక మోటార్ సైకిల్, 30 కిలోల కాపర్ వైర్ మరియు 30 వ్యవసాయ కరెంటు మోటార్లు. రూ.5,000) స్వాదినం
ఈ కేసును తక్కువ సమయంలో ఛేదించిన డీఎస్పీ రాములు, సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై అనిల్, ఎస్సై కిరణ్, ఎస్సై రాజు, సిబ్బంది చైతన్య, కిరణ్, అనిల్, సాధు నాయక్ మరియు మారుతీ లను జిల్లా శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ ఎస్పీ అభినందించారు.
Telangana State Police