01/08/2015
నీర్మాల గ్రామమంత ఎర్ర జెండాలతో నిండిపోయింది. ఎటు వైపు చూసినా CPI(M) తోరణాలతో రోడ్లన్నీ ఎరుపెక్కాయి. ఈ రోజు (01-08-2015) మా నీర్మాల గ్రామానికి ఒక ప్రత్యేక రోజుగా చెప్పవచ్చు. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట యోధుడు రాష్ట్రపతి అవార్డు గ్రహీత భారత మాత ముద్దుబిడ్డ అమరజీవి కా,, కాసం కృష్ణమూర్తి గారి 9వ వర్ధంతి బహిరంగ సభను నీర్మాల కచ్చీరు దగ్గర రాత్రి 8గం,, ఘనంగా ప్రారంభించబోతున్నారు.
కా,, కాసం కృష్ణమూర్తి గారు స్వాతంత్య్ర పోరాటంలో నైజాం రజాకారుల వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ పోరాటంలో భారతదేశం గర్వించదగ్గ పాత్ర నిర్వహించారు. అంటరానితనానికి వ్యతిరేకంగా ఆనాడు "నీర్మాల గ్రామము " లో కాసం యశోదమ్మ - రామచంద్రయ్య అనే దంపతుల బిడ్డ నేటి నిస్వార్థ త్యాగమూర్తి అమరజీవి కాసం కృష్ణమూర్తి పోరాటం సాగించారు. గ్రామగ్రామాన తెలంగాణ సాయుధ పోరాటం గావిస్తు ప్రజలను చైతన్య పరుస్తూ, నీర్మాల గ్రామం నుండి మరిపడిగ, సీతారాంపురం, జనగామ, మోత్కురు, మూలరేగడి, మీనామ్ కుంటలలో భూపోరాటాలు నిర్వహించారు. మోత్కురు లో కచ్చీరు (పోలిస్ స్టేషన్) పెట్టుకోని, రజాకార్ల ప్రోద్బలలతో ప్రజలపైన తన ఇష్టమొచ్చినట్టు గా "గడ్డం అమీన్ " స్త్రీల మానభంగాలు, గృహదహనాలు, దౌర్జన్యాలు గావిస్తుండే గడ్డం అమీన్ పై ఉగ్రరూపం దాల్చిన కాసం కృష్ణమూర్తి గారు, మూలరేగడి వద్ద పొంచి సాయుధడై తొలిసారిగా రజాకార్ల పై స్టెన్ గన్ పేల్చితే అక్కడికక్కడే 3రజాకార్లు, 3గుర్రాలు మరణించి, ఎడుగురు గాయపడ్డారనే వార్త విన్న గడ్డం అమీన్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తి, " అరే అల్లా మరగమారి " మూర్తి బచవ్, మేరు భాయ్ అంటూనే మూర్తి గారిపై కక్షకట్టి రజాకర్ల సైన్యంతో నీర్మాల గ్రామాన్ని చుట్టుముట్టి ప్రజలపై దాడిచేసి, చిత్రహింసలు పెట్టి, మూర్తి గారి కుటుంబానికి నిలువ నీడైన ఇల్లును కాలబెట్టారు.
ఎన్ని ఇబ్బందులు వచ్చిన గుండె నిబ్బరంతో పట్టు వదలక తన సాయుధ దళాలతో విస్నూర్ దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి కి వ్యతిరేకంగా దేవరుప్పులలో సాగిన దాడిలో తొలి వీరుడు దొడ్డి కొమురయ్య నేలకొరిగిన గ్రామం కడవెండి గడ్డ పై దాడి, కామారెడ్డి గూడెం బందగి, పాలకుర్తి చాకలి అయిలమ్మ భూపోరాటం, వెట్టిచాకిరి విముక్తికై సాయుధుడై నిర్వహించిన అలుపెరుగని పోరాట యోధుడిగా రాష్ట్రపతి గౌరవనీయులైన శ్రీ ఎ.పి.జె.అబ్దుల్ కలాం గారి చేతులు మీదుగా ఉత్తమ స్వాతంత్య్ర సమర యోధుడిగా రాష్ట్రపతి అవార్డు అందుకున్న కా,, కాసం కృష్ణమూర్తి గారు అనారోగ్యంతో 01-08-2006న మరణించడం జరిగింది. దీనికి యావత్తు ప్రజానీకం నివాళులు అర్పిస్తుంది.
ఇంత గొప్ప వ్యక్తి కా,, కాసం కృష్ణమూర్తి మన నీర్మాల గ్రామంలో పుట్టినందుకు మనమంతా గర్వపడుదాం ..
---- ప్రవీణ్ జిల్లెల (PJ).