31/05/2026
*బద్వేల్ నియోజకవర్గం శ్రీ అవధూత కాశినాయన మండలంలోని కొట్టాలపల్లి గ్రామంలో శ్రీశ్రీ పోలేరమ్మ & పోతురాజు విగ్రహ ప్రతిష్ట పూర్తై 41 రోజులు పూర్తి అయిన సందర్భంగా గ్రామంలో ఘనంగా విందు కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గారు, నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి గారు, నియోజకవర్గ బూత్ కన్వీనర్లు సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి గారు, వైఎస్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం సంయుక్త కార్యదర్శి చాపాటి లక్ష్మి నారాయణ రెడ్డి గారు నియోజకవర్గ మండల నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పోలేరమ్మ గుడిని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.*