District Collector, YSR Kadapa District

District Collector, YSR Kadapa District District Collector, Kadapa has opened this account for taking the suggestions from the public

యర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని జిల్ల...
03/09/2026

యర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్‌ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారి అధ్యక్షతన యర్రగుంట్ల మున్సిపాలిటీ అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ గారితో పాటు ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా గారు హాజరయ్యారు.

మున్సిపాలిటీలో పన్ను వసూళ్లను వంద శాతానికి పెంచాలని, పెండింగ్‌ బకాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ గారు సూచించారు. పట్టణంలో గుర్తించిన గుంతలను వెంటనే పూడ్చి గుంతలు లేని రహదారులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏఐఐబీ తాగునీటి పథకం, టిడ్కో గృహాలు, ఎన్టీఆర్‌ గృహ నిర్మాణాలు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

పట్టణంలో రోజువారీగా ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని, డంప్‌యార్డులో పేరుకుపోయిన పాత వ్యర్థాల తొలగింపు పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌ పెండింగ్‌ దరఖాస్తులను నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

మున్సిపాలిటీ పరిధితో పాటు సమీప గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం తదితర అన్ని రకాల మౌలిక వసతులను సమకూర్చేందుకు సమగ్ర ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణకు అనుగుణంగా ప్రస్తుత వసతులను బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

జమ్మలమడుగు పట్టణాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ, ప్...
03/09/2026

జమ్మలమడుగు పట్టణాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్‌ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారి అధ్యక్షతన జమ్మలమడుగు మున్సిపాలిటీ అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ గారితో పాటు ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ... జమ్మలమడుగు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులకు సూచించారు.

పట్టణ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పట్టణ ప్రణాళికలో భాగంగా మాస్టర్‌ ప్లాన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ, భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పెండింగ్‌ లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటాలని, ప్రతి మొక్కకు కుడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించాలన్నారు.

పట్టణ విద్యుత్‌ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతిపాదించిన రూ.60 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు, వీధి వ్యాపారులకు అవసరమైన సహకారం అందేలా మెప్మా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.

పట్టణంలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు, గృహ నిర్మాణం, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్యం, విద్యుత్‌ తదితర మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించి, పెండింగ్‌ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. పట్టణ అభివృద్ధి పనులన్నింటికీ స్పష్టమైన కార్యాచరణ రూపొందించి, శాఖల మధ్య సమన్వయంతో నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు అధికారులను ఆదేశించారు.

మున్సిపాలిటీ పరిధితో పాటు సమీప గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం తదితర అన్ని రకాల మౌలిక వసతులను సమకూర్చేందుకు సమగ్ర ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు అధికారులను ఆదేశించారు.

జిల్లాలో తల్లి మరణాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జ...
02/09/2026

జిల్లాలో తల్లి మరణాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్‌లోని పిజిఆర్‌ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన తల్లి మరణాల పర్యవేక్షణ మరియు స్పందన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదైన తల్లి మరణాల వివరాలు, వాటికి దారితీసిన కారణాలు, గర్భిణులకు అందుతున్న వైద్య సేవలు, హైరిస్క్ గర్భిణుల గుర్తింపు, వారికి అందిస్తున్న చికిత్స తదితర అంశాలతో పాటు, గత ఐదు నెలల్లో జిల్లాలో సంభవించిన మాతృ మరణాలపై సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, ప్రతి గర్భిణి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ముఖ్యంగా హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గర్భిణులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులను గుర్తించి, ప్రసవానికి ముందస్తు ప్రణాళిక రూపొందించి, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఉన్నత వైద్య సేవలకు తరలించేలా పటిష్టమైన రిఫరల్ వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించారు.

జిల్లాలో జాతీయ కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే ప్రచార కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి, వ్యాధి నియంత్రణ చర్యలను క...
02/09/2026

జిల్లాలో జాతీయ కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే ప్రచార కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి, వ్యాధి నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు సంబంధిత వైద్య, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సెప్టెంబరు 11 నుండి సెప్టెంబరు 24 వరకు 14 రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమం సన్నద్ధతపై సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జాతీయ కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమం సన్నద్ధతపై ప్రచురించిన వాల్ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలకు వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలపై ఈ 14 రోజుల పాటు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో కుష్టు వ్యాధి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో జిల్లాను కుష్టు వ్యాధి రహితంగా మార్చడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు.

మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడంతో పాటు ఆరోగ్యం, విద్య, భద్రత, సామాజిక అంశాలపై అవగాహన పెంచుకున్నప్పుడే కుటుంబం, గ్రామ...
02/09/2026

మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడంతో పాటు ఆరోగ్యం, విద్య, భద్రత, సామాజిక అంశాలపై అవగాహన పెంచుకున్నప్పుడే కుటుంబం, గ్రామం, సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు అన్నారు.

బుధవారం జమ్మలమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో డీఆర్డీఏ, మెప్మా, ఐసీడీఎస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మహిళా బాగు-సంభాషణ’ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే సి. ఆదినారాయణరెడ్డి గారితో కలిసి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహిళలతో ముఖాముఖి సంభాషించిన జిల్లా కలెక్టర్ గారు.. మహిళా ఆరోగ్యం, పోషకాహారం, బాలికల విద్య, బాల్య వివాహాల నివారణ, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు రుణాలు, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై విస్తృతంగా మాట్లాడారు.

మహిళల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలను అర్హులైన ప్రతి మహిళకు చేరువ చేయడం, వాటిని సక్రమంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించడమే ‘మహిళా బాగు-సంభాషణ’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ గారు అన్నారు.

కార్యక్రమం ముగింపులో జమ్మలమడుగు పరిధిలో డీఆర్డీఏ, మెప్మా ద్వారా శ్రీనిధి, బ్యాంకు లింకేజీ రుణాలు పొందిన మహిళా లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు, ఎమ్మెల్యే సి. ఆదినారాయణరెడ్డి గారితో కలిసి మెగా చెక్కును అందజేశారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో ‘మన లెక్కలు-మన డబ్బులు’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సంబంధిత పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారితో కలిసి ఆవిష్కరించారు.

బుధవారం కడప నగరంలో “నవీ డెంటల్ కేర్” క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ముఖ్య అతి...
02/09/2026

బుధవారం కడప నగరంలో “నవీ డెంటల్ కేర్” క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ముఖ్య అతిథిగా పాల్గొని, రిబ్బన్ కట్ చేసి క్లినిక్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా దంత వైద్యులు డా. మేరువ వెంకట నవీన్‌ను జిల్లా కలెక్టర్ గారు అభినందించారు. ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ, కడప జిల్లా ప్రజలకు మెరుగైన దంత వైద్య సేవలు అందించాలని సూచించారు.

ప్రజలకు అందించే రెవెన్యూ సేవల్లో జాప్యానికి తావులేకుండా నిర్ణీత గడువులోగా సేవలను అందించాలని..పెండింగ్‌లో ఉన్న అర్జీలు, ర...
01/09/2026

ప్రజలకు అందించే రెవెన్యూ సేవల్లో జాప్యానికి తావులేకుండా నిర్ణీత గడువులోగా సేవలను అందించాలని..పెండింగ్‌లో ఉన్న అర్జీలు, రెవెన్యూ సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలనతో నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో నిర్వహించిన రెవెన్యూ అధికారుల సమావేశంలో జిల్లాలో రెవెన్యూ, ప్రజా సేవలకు సంబంధించిన 12 ప్రధాన ప్రమాణాలపై జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పురోగతి, పెండింగ్ అంశాలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ గారితో పాటు జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా గారు, సబ్‌ కలెక్టర్ హెచ్.ఎస్. భావన గారు, డీఆర్వో మల్లికార్జునుడు గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, పునఃసర్వే, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, భూముల బదలాయింపులు, 22-ఏ కేసులు, చుక్కల భూములు, భూసేకరణ, ప్రభుత్వ భూముల కేటాయింపు, ఐవీఆర్‌ఎస్‌, జెడ్‌హెచ్‌డీసీ భూములు, రెవెన్యూ రికార్డుల ఆన్‌లైన్‌ ప్రక్రియ, భూముల డిజిటలీకరణ తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు. ప్రతి నెలా నిర్వహించే రెవెన్యూ అధికారుల సమీక్షలో పెండింగ్‌ అంశాలపై స్పష్టమైన పురోగతి సాధించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.

వాణిజ్య పరంగా పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప...
01/09/2026

వాణిజ్య పరంగా పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారి అధ్యక్షతన ప్రొద్దుటూరు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా గారు, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సమీక్షా సమావేశంలో వివిధ శాఖల వారీగా చేపడుతున్న పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ గారు సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, పట్టణంతో పాటు పరిసర గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అధికారులు సమన్వయంతో పనిచేయాలని, రహదారులు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల్లో ఎలాంటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారులతో పాటు పట్టణాన్ని పరిసర గ్రామీణ ప్రాంతాలతో అనుసంధానించే రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారుల నిర్మాణం, మరమ్మతులు చేపట్టడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ దీపాల ఏర్పాటును పూర్తిస్థాయిలో చేపట్టాలన్నారు. పట్టణ విస్తరణకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను అంచనా వేసి మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

30/08/2026

అల్లనేరేడు సాగు స్థానంలో అవకాడో సాగును చేపట్టి, శాస్త్రీయ పద్ధతులు మరియు సమర్థవంతమైన మార్కెటింగ్‌తో విజయాన్ని సాధించిన కడప జిల్లా రైతు వరదరాజ్ కృషిని గౌ.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో కొనియాడారు.

వినూత్న సాగు విధానాలతో మంచి ఫలితాలు సాధిస్తూ, వ్యవసాయంలో కొత్త అవకాశాలకు మార్గం చూపుతున్న కడప జిల్లా రైతులకు ఇది మంచి ప్రోత్సాహం.

రాష్ట్ర ప్రభుత్వం, కడప జిల్లా యంత్రాంగం అందిస్తున్న సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు.. లింగాల మండలం వెలిదెండ్ల గ్రామ రైతు సాధించిన ఈ విజయం చక్కటి తార్కాణంగా నిలిచింది. ఈ విజయం మన జిల్లాకు గర్వకారణమే కాదు. కడప జిల్లా హార్టికల్చర్ హబ్ గా మారుతోందనదానికి శుభ సూచక నిదర్శనం.

Narendra Modi MyGovIndia Nara Chandrababu Naidu Nara Lokesh Ministry of Agriculture & Farmer’s Welfare, Government of India Press Information Bureau - PIB, Government of India

కడప నగర పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను సమన్వయంతో వేగవంతం చేయడంతో పాటు, నగరంలోని చెరువుల మరమ్మతులు, అభివృద్ధి,...
28/08/2026

కడప నగర పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను సమన్వయంతో వేగవంతం చేయడంతో పాటు, నగరంలోని చెరువుల మరమ్మతులు, అభివృద్ధి, సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్, కడప నగరపాలక సంస్థ (కేఎంసీ) ప్రత్యేక అధికారి డా. శ్రీధర్ చెరుకూరి గారు సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు, కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి గారితో కలిసి వివిధ శాఖల అధికారులతో నగరపాలక అభివృద్ధిపై సమీక్ష నిర్వహించి, ఆయా శాఖల పరిధిలోని పనుల పురోగతిపై సమీక్షించారు.

సమీక్షలో రెవెన్యూ శాఖకు సంబంధించి 132 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి భూమి కేటాయింపు, నిరుపేదలు, చేతివృత్తిదారులు, వివిధ సంఘాలకు ఇళ్ల స్థలాల గుర్తింపు, మిగిలిన ఇళ్ల క్రమబద్ధీకరణ, రహదారుల విస్తరణకు అవసరమైన భూసేకరణ, నూతన మోడల్ రైతుబజార్ల ఏర్పాటు, ఇళ్లులేని పేదలకు ఇంటి స్థలాల పంపిణీ, ఐటీ పార్కుకు భూమి కేటాయింపు, నగర పరిధిలోని ప్రభుత్వ స్థలాలను కబ్జా కాకుండా పరిరక్షించడం, ఎస్‌ఐఆర్ అంశాలు, వైఎస్ఆర్ నగర్‌లో పంపిణీ కాని స్థలాలు తదితర అంశాలపై సమీక్షించారు. కడప నగర పరిధిలోని చెరువుల అభివృద్ధి, మరమ్మతులు, సుందరీకరణపై జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

అలాగే నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని చెరువుల ఆయకట్టు వివరాలు, చెరువు కట్టల భద్రత, నీటి వనరుల పరిరక్షణ, సుందరీకరణకు ఉన్న అవకాశాలను సంబంధిత ఇరిగేషన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. అదేవిధంగా కడప అసెంబ్లీ పరిధిలోని చెరువులు, కుంటల శుభ్రత, దేవుని కడప, పుట్లంపల్లి చెరువుల పునరుద్ధరణ, కట్టలపై అవసరమైన రక్షణ చర్యలు చేపట్టే అంశాలపై సమీక్షించారు. ప్రతి చెరువుకు అవసరమైన మరమ్మతులు, అభివృద్ధి, సుందరీకరణ పనులను గుర్తించి, వాటిపై సమగ్ర నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు.

Address

Collecterate
Kadapa
516004

Alerts

Be the first to know and let us send you an email when District Collector, YSR Kadapa District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to District Collector, YSR Kadapa District:

Shortcuts

Share