PDSU Kadapa

PDSU Kadapa అధ్యయనం పోరాటం

పత్రికా ప్రకటన🔴 డిగ్రీ ప్రవేశాల జాప్యాన్ని నివారించి వెంటనే తరగతులు ప్రారంభించాలి: పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అ...
07/09/2026

పత్రికా ప్రకటన
🔴 డిగ్రీ ప్రవేశాల జాప్యాన్ని నివారించి వెంటనే తరగతులు ప్రారంభించాలి: పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న
🔴 విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు
🔴 వెంటనే డిగ్రీ కౌన్సెలింగ్‌ పూర్తి చేసి సీట్ల కేటాయింపు చేపట్టాలి
🔴 ప్రవేశాల ప్రక్రియలో ఇకపై ఎలాంటి జాప్యం చేయకూడదు
కడప నగరం, సెప్టెంబర్‌ 06, 2026:
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నివారించి, విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా వెంటనే తరగతులు ప్రారంభించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆదివారం కడప నగరంలోని పీడీఎస్‌యూ రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెలువడి నాలుగు నెలలు గడిచినా డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ పూర్తికాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సీట్ల కేటాయింపును పదేపదే వాయిదా వేయడం వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారని, వారి విలువైన విద్యా సమయం నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను వెంటనే పూర్తి చేసి, సీట్ల కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి తరగతులను తక్షణమే ప్రారంభించాలని ఎం. అంకన్న డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేసి, స్పష్టమైన విద్యా క్యాలెండర్‌ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థుల హక్కుల కోసం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ కడప, అన్నమయ్య జిల్లాల నాయకులు మనోజ్‌, మహేష్‌, పండు తదితరులు పాల్గొన్నారు.
— ఎం. అంకన్న
రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పీడీఎస్‌యూ

రాయచోటి | 05-09-2026రాయచోటి పీజీ కేంద్రంలో వెంటనే తరగతులు ప్రారంభించాలిస్టేట్ గెస్ట్ హౌస్‌లో రాష్ట్ర మంత్రులకు వినతి పత్...
06/09/2026

రాయచోటి | 05-09-2026

రాయచోటి పీజీ కేంద్రంలో వెంటనే తరగతులు ప్రారంభించాలి

స్టేట్ గెస్ట్ హౌస్‌లో రాష్ట్ర మంత్రులకు వినతి పత్రం అందజేసిన పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. అంకన్న

రాయచోటిలో పీజీ కేంద్రం ఏర్పాటుకు 2020లోనే చర్యలు ప్రారంభమై, 2021లో పీజీ కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ, నేటికీ పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించకపోవడం ఆందోళనకరమని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. అంకన్న అన్నారు. ఈ మేరకు శనివారం రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్‌లో రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌లను కలిసి వినతి పత్రం అందజేశారు.

పీజీ కేంద్రాన్ని యూనివర్సిటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలి

పీజీ కేంద్రంలో వెంటనే తరగతులు ప్రారంభించి, అవసరమైన పీజీ కోర్సులు ఏర్పాటు చేయడంతో పాటు పూర్తిస్థాయి అధ్యాపకులు, శాశ్వత భవనాలు, హాస్టల్, డిజిటల్ లైబ్రరీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. రాయచోటి పీజీ కేంద్రాన్ని పూర్తిస్థాయి యూనివర్సిటీ కేంద్రంగా అభివృద్ధి చేసి, రాయచోటి నియోజకవర్గం విద్యార్థులకు స్థానికంగానే నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావాలని ఎం. అంకన్న విజ్ఞప్తి చేశారు.

*పత్రికా ప్రకటన*  *విజయవాడ* ( క్రిస్తురాజపురం ) *02/09/2026* *....ఢిల్లీ విద్యార్థుల పోరాటం భవిష్యత్తుకు పునాది....* గత ...
03/09/2026

*పత్రికా ప్రకటన*
*విజయవాడ*
( క్రిస్తురాజపురం )
*02/09/2026*

*....ఢిల్లీ విద్యార్థుల పోరాటం భవిష్యత్తుకు పునాది....*

గత మూడు నెలల నుంచి దేశ రాజదాని ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న పోరాటం భవిష్యత్తు ఉద్యమానికి మరింత దోహదా పడతాయని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ డీ ఎస్ యూ )మాజీ రాష్ట్ర అధ్యక్షులు పి. ప్రసాద్ అన్నారు..
గత రెండు రోజుల నుంచి విజయవాడ నగరంలోని పీ డీ ఎస్ యూ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్న ఆ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో .." *జన్ జి ఉద్యమం -విద్యార్థుల భవిష్యత్తు కార్యక్రమాలు "*
అనే అంశంపై వక్త గా మాట్లాడారు...
కామ్రేడ్ పి ప్రసాద్ మాట్లాడుతూ... దేశ విద్యారంగం పట్ల, నిరుద్యోగ సమస్య పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై దేశవ్యాప్తంగా యువత కన్నెర్ర చేసిందన్నారు. సమస్యలను పరిష్కరించమని, నీట్ పేపర్ లీకేజీకి కారణమైన కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఢిల్లీ నగరంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారన్నారు.. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జీ,భాష్ప వాయువు,టియర్ గ్యాస్ వంటి వాటిని ఉపయోగించిన ఎక్కడ కూడా విద్యార్థులు వెనుకడుగు వేయలేదన్నారు. ఒక చేత్తో భారత రాజ్యాంగాన్ని చేతబట్టి, మరొక చేతితో స్వాతంత్ర సమరయోధులు అందించిన పోరాట స్ఫూర్తిని ఎత్తిపడుతూ విద్యార్థులు చేసిన పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు. ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్ చుక్ కూడా శాంతియుతంగా చేస్తున్న ఆందోళనను పోలీసులు భగ్నం చేసి ఆయనను అరెస్టు చేయటం దుర్మార్గమన్నారు.. అంతేకాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరీక్ష పేపర్ లీకేజీ, అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ విద్యాసంస్థల సంరక్షణ కోసం విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలకు పిలుపునివ్వటం ఆహ్వానించదగ్గ విషయమేనని, దానికి మనలాంటి ప్రగతి శీల విద్యార్థులు, సమాజ మార్పు కోరుకునే వారందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో పీ డీ ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కె.భాస్కర్, ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, ఉపాధ్యక్షులు రాజశేఖర్, అంకన్న, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఐ. రాజేష్, కె. నాని, రాంబాబు, వీరేంద్ర రాష్ట్ర నాయకులు వినోద్, నాగేష్, ప్రసాద్, శంకర్, నాగేశ్వరావు, అఖండ, తదితరులు పాల్గొన్నారు.

ఐ. రాజేష్,
పీ డీ ఎస్ యూ,
7989948796.

**దళిత,,గిరిజన విద్యార్థులకు అన్యాయం చేయొద్దు....*  పి పి పి పేరుతో స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ అనే ఆశ చూపించి ప్రభుత్వ స్కూల...
02/09/2026

**దళిత,,గిరిజన విద్యార్థులకు అన్యాయం చేయొద్దు....*
పి పి పి పేరుతో స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ అనే ఆశ చూపించి ప్రభుత్వ స్కూల్లో, కాలేజీల లోని భవనాలు స్థానిక నారాయణ, ఫిజిక్స్ వాలా కోచింగ్ సెంటర్లకు దారా దత్తం చేయద్దని, పోటీ పరీక్షలకు దళిత గిరిజన విద్యార్థులకు శిక్షణ అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానీదేనని దానికి మిగతా ప్రభుత్వ స్థలాలు ఏర్పాటు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యు) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె.భాస్కర్, ఎం. వినోద్ కుమార్ లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం విజయవాడ నగరంలో PDSU రాష్ట్ర కార్యాలయం లో రెండు రోజులు పాటు జరుగుతున్న పిడిఎస్ యు రాష్ట్ర కార్యవర్గాల సమావేశాలలో వారు మాట్లాడుతూ..
పేద విద్యార్థులకు కోచింగ్ అనే బ్రమ చూపించి, పేద విద్యార్థులు చదువుకుంటున్న గురుకుల విద్యాలయాలను ఖాళీ చేపించడం దుర్మార్గమన్నారు. అదే అమలయితే రాష్ట్రవ్యాప్తంగా దళిత గిరిజన విద్యార్థులకు విద్యను దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం వేరే భవనాలు ఏర్పాటు చేసి అందులో దళిత, గిరిజన విద్యార్థులకు కోచింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ అన్- ఎయిడెడ్ డెంటల్ కళాశాలలో ఫీజులు పెంచడం దుర్మార్గం అన్నారు.. ఆయా కళాశాలలో ఇప్పటికి అధిక ఫీజుల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే,మరల ఇప్పుడు 10 నుంచి 20 శాతం వరకు ఫీజులు పెంచడం, ఆయా వర్గాల విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేయడమే. అందరికీ విద్యా, వైద్యం అందుబాటులోకి తెస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వైద్య విద్యార్థుల స్టై ఫండ్ కేవలం 3 శాతం పెంచుతూ, వైద్య విద్యార్థుల దగ్గర్నుంచి 10 నుండి 20 శాతం వరకు ఫీజులు లాగటం దుర్మార్గమన్నారు .. తక్షణమే ప్రభుత్వం పునరాలోచించి వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని , ఒకవైపు1200 కోట్ల రూపాయల ఫీజుబకాయలు విడుదల చేయకపోవడం వల్ల యాజమాన్యాల విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి, మరొకవైపు సంక్షేమ విద్యార్థుల ఆకలి కేకలు ప్రభుత్వానికి వినపడటం లేదా అని ప్రశ్నించారు.. సంక్షేమ విద్యార్థులకు కేవలం 10 శాతం మెస్ చార్జీలు పెంచి చేతులు దులుపుకోవడం అన్యాయం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, తక్షణమే వాటిని భర్తీ చేయాలన్నారు..
కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ భూషణం, L. రాజశేఖర్, అంకన్న, సునీల్, సహాయ కార్యదర్శులు మహర్షి, వీరేంద్ర, కాకి నాని, రాజేష్, రాంబాబు,లోకేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అఖండ, ఆశీర్వాదం, శంకర్, నాగేష్, ప్రసాద్, మానస తదితరులు పాల్గొన్నారు

*వైద్య కోర్సుల ఫీజుల పెంపును వెంటనే రద్దు చేయాలి*  *పేద, మధ్యతరగతి విద్యార్థులపై ఫీజుల భారం మోపొద్దు*  *వైద్య విద్యను వ్...
30/08/2026

*వైద్య కోర్సుల ఫీజుల పెంపును వెంటనే రద్దు చేయాలి*

*పేద, మధ్యతరగతి విద్యార్థులపై ఫీజుల భారం మోపొద్దు*

*వైద్య విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను ప్రభుత్వం అడ్డుకోవాలి*

*తల్లిదండ్రులు, విద్యార్థులతో చర్చించకుండా ఫీజులు పెంచడం సరికాదు*

– *పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు* *ఎం. అంకన్న*

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ వైద్య, దంత వైద్య కళాశాలల్లో వైద్య పట్టా, దంత వైద్య పట్టా కోర్సుల ఫీజులను 10 శాతం, వైద్య పీజీ కోర్సుల ఫీజులను 15 శాతం పెంచడం అన్యాయమని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న అన్నారు. ఆదివారం కడప నగరంలోని పీడీఎస్‌యూ రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే యాజమాన్య కోటా, విదేశీ భారతీయుల కోటా ఫీజులు భారీగా ఉన్నాయని, తాజాగా ఫీజుల పెంపుతో పేద, మధ్యతరగతి విద్యార్థులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. పిల్లలను వైద్య విద్య చదివించేందుకు తల్లిదండ్రులు అప్పులు చేయడం, భూములు అమ్ముకోవడం, ఆస్తులను తాకట్టు పెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఫీజుల పెంపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కారణంగా చూపుతూ జూనియర్ వైద్యుల ఉపకార వేతనం పెంపును ప్రభుత్వం తిరస్కరిస్తూ, మరోవైపు ప్రైవేట్ వైద్య కళాశాలల ఫీజులను పెంచడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఎం. అంకన్న విమర్శించారు. ఫీజుల నియంత్రణ కమిటీ పేరుతో తల్లిదండ్రులు, విద్యార్థులతో సమగ్ర చర్చ లేకుండా ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఫీజుల పెంపును ఉపసంహరించడంతో పాటు అదనపు వసూళ్లపై కఠిన నియంత్రణ విధించాలని, విద్యార్థులకు ఉపకార వేతనాలు, విద్యా రుణాలపై రాయితీలను పెంచాలని కోరారు. వైద్య విద్య వ్యాపారం కాదని, విద్యార్థుల భవిష్యత్తును ఫీజుల భారంతో ప్రశ్నార్థకం చేయరాదని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా, నగర నాయకులు ఖాసీం, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

🏑 మేజర్ ధ్యాన్ చంద్ 🏑“మీరు మైదానంలో అడుగుపెట్టినప్పుడు…కేవలం మీ ఆటపై మాత్రమే దృష్టి పెట్టండి.శత్రువుల బలహీనతలను కాకుండా…...
29/08/2026

🏑 మేజర్ ధ్యాన్ చంద్ 🏑
“మీరు మైదానంలో అడుగుపెట్టినప్పుడు…
కేవలం మీ ఆటపై మాత్రమే దృష్టి పెట్టండి.
శత్రువుల బలహీనతలను కాకుండా…
మీ సొంత బలాన్ని నమ్మండి.”
— మేజర్ ధ్యాన్ చంద్
సుప్రసిద్ధ భారతీయ హాకీ దిగ్గజం
🏑 హాకీని ఆటగా ఆడలేదు…
భారత కీర్తిని ప్రపంచానికి చాటారు!
💐 మేజర్ ధ్యాన్ చంద్‌కు జోహార్లు.
📅 జననం: 29.08.1905
🕯️ మరణం: 03.12.1979

*మిలాద్‌–ఉన్‌–నబీ సెలవును ఉల్లంఘిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకోవాలి*  *పీడీఎస్ యు రాష్ట...
27/08/2026

*మిలాద్‌–ఉన్‌–నబీ సెలవును ఉల్లంఘిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకోవాలి*

*పీడీఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.అంకన్న*

నేడు ఆగస్టు 26న రాష్ట్రవ్యాప్తంగా మిలాద్‌–ఉన్‌–నబీ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన సెలవును అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా పాటించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న డిమాండ్ చేశారు. బుధవారం పీడీఎస్‌యూ రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో మాట్లాడుతూ, సెలవు రోజున విద్యార్థులను తరగతులకు పిలిపించడం, టీచర్లను విధులకు, శిక్షణ కార్యక్రమాలకు హాజరు కావాలని ఒత్తిడి చేయడం వెంటనే నిలిపివేయాలని కోరారు. కడప, అన్నమయ్య జిల్లాలతో పాటు కడప, బద్వేల్, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాజంపేట, మదనపల్లె, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె, పుంగనూరు తదితర ప్రాంతాల్లో సెలవు నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై సంబంధిత అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించాలని అన్నారు.

విద్యాశాఖ, ఇంటర్, యూనివర్సిటీ అధికారులు ఉల్లంఘనలు నిర్ధారణ అయితే వర్తించే నిబంధనల ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎం. అంకన్న డిమాండ్ చేశారు. విద్యార్థులు, టీచర్ల విశ్రాంతి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. సెలవు నిబంధనలను ఉల్లంఘించే విద్యాసంస్థలను ఉపేక్షించరాదని, పోలీసులు అందుబాటులో ఉన్న సమాచారం, ఆధారాలను పరిశీలించి, చట్టపరంగా కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంటే తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా, నగర నాయకులు మహేష్, ఉపేంద్ర పాల్గొన్నారు.

🔥 సాయం అందుకోండి… గ్రాడ్యుయేట్స్ అవ్వండి! 🎓✨అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సహకారంతో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులకు గొప్ప ...
26/08/2026

🔥 సాయం అందుకోండి… గ్రాడ్యుయేట్స్ అవ్వండి! 🎓✨

అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సహకారంతో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులకు గొప్ప అవకాశం! 🌟

🎓 డిగ్రీ 1వ సంవత్సరంలో చేరిన బాలికలకు
💰 సంవత్సరానికి ₹30,000 స్కాలర్‌షిప్
🇮🇳 దేశవ్యాప్తంగా 1,95,000 మంది విద్యార్థినులకు మంజూరు

⏰ ఈ నెల 31వ తేదీ ఆఖరి గడువు!

👉 అర్హత ఉన్న విద్యార్థినులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోండి.
📢 ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, విద్యార్థినులు, తల్లిదండ్రులతో షేర్ చేయండి.

సీఎస్‌ఐ ఉన్నత పాఠశాల స్థలాన్ని వాణిజ్యానికి లీజుకు ఇవ్వడం సిగ్గు చేటుఆయా స్థలాలను విద్యా, దార్మిక అంశాలకు వాటికే వినియోగ...
23/08/2026

సీఎస్‌ఐ ఉన్నత పాఠశాల స్థలాన్ని వాణిజ్యానికి లీజుకు ఇవ్వడం సిగ్గు చేటు

ఆయా స్థలాలను విద్యా, దార్మిక అంశాలకు వాటికే వినియోగించాలి

ఆ స్థలాలు వ్యక్తుల స్వార్ధం కోసం కాదు.. కడప ప్రజలంతా అడ్డుకోవాలి

దీనితో పాటు పక్కనే ఉన్న రిలయన్స్ మార్ట్, మయూర బేకరి వున్నా స్థలాలు ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో
రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి

– పీడీఎస్‌ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.అంకన్న

ఎంతో చరిత్ర గల కడప సీఎస్‌ఐ ఉన్నత పాఠశాలను నిర్వీర్యం చేస్తూ ఆ స్థలాలను దోచుకొనేందుకు చేస్తున్న ప్రయత్నలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకువాలని పీడీఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.అంకన్న డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలో పీడీఎస్ యు రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో మాట్లాడుతూ ..
మొట్ట మొదట నుండి ఈ స్థలాలు వున్నది కేవలం విద్య, ధార్మికల కోసం మాత్రమే కానీ వ్యాపారాల కోసం కాదన్నారు. వేలాది మంది ఇక్కడ చదువుకొని ఎంతో మంది ఉన్నత స్థానాలలో వున్నారన్నారు. కడపలోనే ఎంతో మందికి విద్యా బుద్దులు నేర్పిన ఆ స్కూల్ ఈ రోజు అన్యాక్రాంతం అవుతుందడం ఎంతో బాధాకరమన్నారు. కడప నగరంలో ఇంత దారుణం జరుగుతున్న ప్రముఖ వ్యక్తులుగా చలామణి అవుతున్న చెప్పుకొనే వారు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కడప దేశంలోని మొత్తం సిఎస్ఐ స్కూల్ మాత్రమే కాకుండా అక్కడ వున్న సిఎస్ఐ స్థలాలు కూడా విద్య ధార్మిక అవసరాలకు ఉపయోగించాల్సి ఉండగా ఇదే విధంగా గతంలో ప్రయివేట్ వ్యక్తులకు అప్పనంగా లీజుల పేరుతూ ఇచ్చారని వాటిలో ఇప్పుడున్న రిలయన్స్ మార్ట్, మయూర బేకరి కూడా ఉన్నాయి అన్నారు. ఎంతో మందికి విద్యా ప్రధాతగా వున్నా సిఎస్ఐ పాఠశాల ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు జిల్లా కార్యదర్శి జి.శ్రీనాథ్ యాదవ్ , పీడీఎస్ యు జిల్లా నగర నాయకులు మహేశ్, దుర్గేష్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Address

Kadapa

Website

Alerts

Be the first to know and let us send you an email when PDSU Kadapa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share