03/06/2026
*నకిలీ బిఎడ్ కళాశాలలలో అన్ని అక్రమాలే లేనివి వున్నాట్లు చెప్పడం వైవియు అధికారులకే సాధ్యం బిల్డింగ్, అధ్యాపకులు, విద్యార్థులు లేకున్నా అన్ని ఉన్నట్లు రిపోర్టులు వైవియు అధికారుల వింతలు బిఎడ్ కళాశాల తనిఖిలల్లో విద్యావ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్న అధికారులు*
*పీడీఎస్ యు ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు*
జిల్లాలో యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బిఎడ్ కళాశాలల్లో ఏమి లేకున్నా అన్ని ఉన్నట్లు వైవియు అధికారులు వింతలు చూపిస్తున్నారని పీడీఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.అంకన్న అన్నారు. బుధవారం పీడీఎస్ యు రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ..
ప్రస్తుతం యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బిఎడ్ కళాశాలలు తనిఖీలు జరుగుతున్నాయని, ఈ తనిఖిల్లో చాలా కళాశాలలు బిల్డింగ్ లు లేకున్నా, అధ్యాపకాలు లేకున్నా, విద్యార్థులు లేకున్నా తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారన్నరూ. పేరుకేమో వైవియు అధికారుల తనిఖీలు అంటారు.కానీ వైవియు అధికారికంగా ఇచ్చినా కాలేజీ గుర్తింపు అడ్రస్ లో కనీసం అయ్యా కళాశాల పేరుతో గల బోర్డు కూడా ఉండదు అన్నారు. మరి వైవియు అధికారులు తనిఖీలు ఎక్కడ చేస్తున్నారని సమాధానం చెప్పాలని వారు ప్రశ్నించారు. ప్రధానగా వైవియు అని సిడిసి డీన్ రఘు బాబు అక్రమాలకు అంతు లేకుండా పోయిందన్నారు. దశలవారుగా పిడిఎస్ యు ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనట్లు వారు తెలిపారు.ఇకనైనా విసి ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు జిల్లా నగర నాయకులు జగదీశ్ రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.