భారతీయ జనతాపార్టీ కదిరి

  • Home
  • India
  • Kadiri
  • భారతీయ జనతాపార్టీ కదిరి

భారతీయ జనతాపార్టీ కదిరి Political organization in kadiri assembly

04/09/2026

🚀అంతరిక్షంలో భారత్ మరో చరిత్ర సృష్టించింది!

ISRO మరో అద్భుత విజయాన్ని అందుకుంది.

GSLV-F17 రాకెట్ ద్వారా ప్రయోగించిన EOS-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత Sub-Geosynchronous Transfer Orbit‌లో ప్రవేశపెట్టింది.

🛰️ EOS-05 ప్రత్యేకత ఏంటి?
భౌస్థిర/భూసమకాలిక కక్ష్య నుంచి పనిచేసే భారత్ తొలి ఇమేజింగ్ ఎర్త్-ఆబ్జర్వేషన్ ఉపగ్రహం ఇది. సుమారు 36,000 కి.మీ ఎత్తు నుంచి విస్తృత ప్రాంతాలను తరచుగా పరిశీలించగలదు.

🌾 వ్యవసాయం
🌪️ విపత్తుల పర్యవేక్షణ
🌊 వరదలు, తుఫానులపై నిఘా
🔥 అటవీ అగ్నిప్రమాదాల పరిశీలన
🛡️ వ్యూహాత్మక సమాచారం

ఇలా దేశ భద్రతతో పాటు అభివృద్ధి రంగాలకు EOS-05 కీలకంగా నిలవనుంది.

ధర్మ సంస్థాపన కోసం భువిపై అవతరించిన శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ…అందరిక...
04/09/2026

ధర్మ సంస్థాపన కోసం భువిపై అవతరించిన శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ…

అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!

జై శ్రీకృష్ణ!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు💐💐💐💐🎂🎂🎂🎂🎂Pawan Kalyan...
02/09/2026

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు💐💐💐💐🎂🎂🎂🎂🎂
Pawan Kalyan Satya Kumar Y BJP Andhra Pradesh Bharatiya Janata Party (BJP) PVN Madhav

01/09/2026

మొదటి త్రైమాసికంలో నమోదైన 7.8% బలమైన జీడీపీ వృద్ధికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు భారత ప్రజలకు అభినందనలు తెలిపారు.

ఇది భారతదేశపు స్థితిస్థాపక ఆర్థిక వ్యవస్థకు, దాని వృద్ధి గాథ బలానికి మరో నిదర్శనం.

భారతదేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. 🇮🇳

28/08/2026

చిట్టి చెల్లెళ్ల పెద్దన్నయ్య… ప్రతి అడుగులో అండగా!

20/08/2026

నిన్న, కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం ఒక ఆశ్చర్యకరమైన, దేశ వ్యతిరేక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ 1937 తీర్మానాన్ని అనుసరించి, గొప్ప వందేమాతరం గీతంలోని కేవలం రెండు చరణాలను మాత్రమే పాడాలని వారు నిర్ణయించారు.

1937లో కాంగ్రెస్ పార్టీ, ముస్లింలను బుజ్జగించేందుకు, ద్విజాతి సిద్ధాంతాన్ని బలోపేతం చేస్తూ వందేమాతరం గీతాన్ని రెండు చరణాలుగా విభజించి దేశ విభజనకు పునాది వేసిందని నేను యావత్ దేశానికి గుర్తు చేయాలనుకుంటున్నాను. చివరికి, దేశం విభజించబడి, పాకిస్తాన్ ఆవిర్భవించింది.

ఈనాడు, వందేమాతరం గీతం ఆవిర్భవించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, జాతీయ ఐక్యతను బలోపేతం చేసేందుకు బంకిం బాబు యొక్క ఈ అమర కృతి గీతాన్ని పూర్తిగా పాడటం ద్వారా ఆ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దే ప్రయత్నం జరిగింది. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో దీనిని పూర్తిగా పాడాలని నిర్ణయించబడింది మరియు ఈ నిర్ణయానికి చట్టబద్ధత కూడా కల్పించబడింది.

నిన్న, కాంగ్రెస్ పార్టీ ఇదే నిర్ణయాన్ని విస్మరించాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం వారి తీవ్ర బుజ్జగింపు విధానాన్ని మాత్రమే ధృవీకరిస్తుంది. ఓటు బ్యాంకు కోసం, వారు బంకిం బాబు యొక్క ఈ అమర కృతిని అవమానించడమే కాకుండా, దేశ స్వాతంత్ర్యం కోసం వందేమాతరం జపిస్తూ ఉరితీయబడిన లక్షలాది అమరవీరులను కూడా అవమానించారు.

నేడు, కాంగ్రెస్ పార్టీ తన 1937 తీర్మానానికి కట్టుబడి పార్లమెంట్ చట్టాన్ని తిరస్కరిస్తోంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఉధృతంగా బుజ్జగింపు రాజకీయాలను అనుసరిస్తోంది.

- శ్రీ Amit Shah

18/08/2026

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ చేసే ప్రతి చిన్న దుశ్చర్యకు తగిన బుద్ధి చెప్పేందుకు భారత బలగాలు సర్వసన్నాహాలతో సిద్ధంగా ఉన్నాయి. శత్రు దేశం వేసే ప్రతి తప్పటడుగుకూ కఠినమైన మూల్యం చెల్లించుకునేలా దెబ్బకొట్టడానికి భారత్ పూర్తి నిబద్ధతతో ఉంది.

18/08/2026

📍 విశాఖపట్నంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రదర్శన

ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారు విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రదర్శనను సందర్శించారు.
ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ గత ఒక సంవత్సరం కాలంలో చేపట్టిన సంస్థాగత కార్యక్రమాలు, పార్టీ విస్తరణ, ప్రజాసేవా కార్యక్రమాలు మరియు కార్యకర్తల కృషిని ప్రదర్శించారు.
ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 28 జిల్లాల్లో బీజేపీ నిర్వహించిన కార్యకలాపాలు, పార్టీ సంస్థాగతంగా సాధించిన పురోగతి, ప్రజలకు అందించిన సేవలు మరియు వివిధ కార్యక్రమాల వివరాలను ప్రదర్శనలో చూపించారు.
ఇందులో ప్రధానంగా ఏమి చూపించారు?
ఒక సంవత్సరం పాటు బీజేపీ చేసిన సంస్థాగత ప్రయాణం
28 జిల్లాల్లో పార్టీ కార్యకలాపాల విస్తరణ
ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు
పార్టీ సంస్థను బలోపేతం చేయడానికి చేపట్టిన కార్యక్రమాలు
వివిధ కార్యక్రమాల్లో బీజేపీ కార్యకర్తల నిరంతర కృషి
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించడానికి చేసిన ప్రయత్నాలు.

18/08/2026

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ Nitin Nabin గారు, జాతీయ సంఘటనా మహా మంత్రి శ్రీ బి.ఎల్. సంతోష్ జీ, జాతీయ సహ సంఘటనా మహా మంత్రి శ్రీ శివప్రకాశ్ జీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, కేంద్ర మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు తదితరులు అప్పన్న స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలు, ఆశీర్వచనం అందించారు.

జాతీయ నాయకులకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు PVN మాధవ్ గారు ఆలయ విశిష్టతను తెలియచేశారు.

Address

Anantapor
Kadiri

Telephone

9701886902

Website

Alerts

Be the first to know and let us send you an email when భారతీయ జనతాపార్టీ కదిరి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share