Team "Tummala Babu"

Team "Tummala Babu" sri Tummala Rama Swamy (Babu)

08/07/2026

జై తుమ్మల 😍🔥

05/07/2026
04/07/2026
01/07/2026

🤣

Celebrating 20K Followers 🔥❤️💐
30/06/2026

Celebrating 20K Followers 🔥❤️💐

🎉 20,000 మంది కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు! 🙏❤️
మన ఫేస్ బుక్ పేజీ
నేడు ాలోవర్స్ అనే మరో మైలురాయిని చేరుకుంది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు... మీ అందరి ప్రేమ, నమ్మకం, ఆదరణకు ప్రతీక.

ప్రతి లైక్, ప్రతి కామెంట్, ప్రతి షేర్, ప్రతి ప్రోత్సాహం మాకు మరింత బాధ్యతను గుర్తు చేస్తోంది.

ప్రజా సమస్యలను ప్రజల గొంతుకగా వినిపిస్తూ, నిజాయితీతో కూడిన సమాచారం, సేవా కార్యక్రమాలు, ప్రజా ప్రయోజనాల కోసం మా ప్రయాణం ఇదే ఉత్సాహంతో కొనసాగుతుంది.

మీ అందరి ఆశీస్సులు, ఆదరణ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

20K నుండి... ఇంకా ఎన్నో విజయాల వైపు కలిసి ముందుకు సాగుదాం! ✊🔥
మీ అభిమానం ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటూ..
మీ...
తుమ్మల రామస్వామి ( బాబు)
డిసిసిబి ఛైర్మన్
కాకినాడ జిల్లా అధ్యక్షులు
జై జనసేన! ❤️🤍

పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే మా లక్ష్యం – తుమ్మల రామస్వామి (...
24/06/2026

పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే మా లక్ష్యం – తుమ్మల రామస్వామి (బాబు)
మా అందరి ఆరాధ్య దైవం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే మా లక్ష్యమని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ ఛైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి (బాబు) తెలిపారు.
కాకినాడ నుండి అన్నవరం వరకు నిర్మాణంలో ఉన్న సాగరమాల రహదారి కారణంగా స్థానిక రైతులు, గ్రామస్తులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతూ యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామ రైతులు, గ్రామస్తుల తరఫున కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి అపూర్వ భరత్, ఐఏఎస్ గారికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రజల తరఫున ఈ వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు.
పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో సాగరమాల రహదారి నిర్మాణంలో భాగంగా అవసరమైన చోట అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు, బాక్స్ కల్వర్టులు ఏర్పాటు చేయడం ద్వారా రైతులు, గ్రామస్తుల రాకపోకలకు సౌలభ్యం కలగడంతో పాటు వరద ముప్పును నివారించవచ్చని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని, ప్రజల అవసరాలను గుర్తించి శాశ్వత పరిష్కారాల దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సిహెచ్ సురేష్ కుమార్ నాని, ఏవి రామారావు, మేడ రామకృష్ణారెడ్డి, సిహెచ్ బాలరెడ్డి, ఆనంద్ వెంకట రాఘవరావు, ఎం. అర్జున్ రెడ్డి, కొమరగిరి గ్రామ రైతులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

🚜 రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు
🛣️ సాగరమాల రహదారిపై జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం
✊ పిఠాపురం ప్రజల సంక్షేమమే లక్ష్యం – తుమ్మల రామస్వామి (బాబు)

JanaSena Party  సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టేందుకు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు, "జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమి...
23/06/2026

JanaSena Party సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టేందుకు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు, "జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీ"లో భాగంగా #కర్నూలు_పార్లమెంట్ పరిశీలీకులుగా నియమితులైన సందర్భంగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు #తంగెళ్ల_ఉదయ్_శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ..
మీ....
#తుమ్మల_రామస్వామి (బాబు),
డిసిసిబి ఛైర్మన్ ,
కాకినాడ జిల్లా అధ్యక్షులు.

🟢 గ్రామాల పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం మరో ముందడుగు ♻️పెద్దాపురం మండలంలోని గ్రామ పంచాయతీలకు ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్...
22/06/2026

🟢 గ్రామాల పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం మరో ముందడుగు ♻️

పెద్దాపురం మండలంలోని గ్రామ పంచాయతీలకు ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ట్రైసైకిళ్లను పంపిణీ చేసిన పెద్దాపురం ఎమ్మెల్యే శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు మరియు డీసీసీబీ ఛైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి (బాబు) గారు.

గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజా ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

తడి చెత్త – పొడి చెత్త వేర్వేరుగా సేకరణ, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ ద్వారా ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.

పరిశుభ్ర గ్రామం – ఆరోగ్యవంతమైన సమాజం ✨

*ప్రపంచ పర్యావరణ దినోత్సవం - 2026* *పెద్దాపురం పట్టణ మరియు నియోజకవర్గ జనసేన శ్రేణులకు ముఖ్య సమాచారం*ప్రపంచ పర్యావరణ దినో...
05/06/2026

*ప్రపంచ పర్యావరణ దినోత్సవం - 2026*


*పెద్దాపురం పట్టణ మరియు నియోజకవర్గ జనసేన శ్రేణులకు ముఖ్య సమాచారం*

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 జూన్ 5వ తేదీ ఈ రోజు (శుక్రవారం) ఉదయం 9:00 గంటలకు పెద్దాపురం పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ మరియు కట్టమూరు రోడ్ ప్రాంతాలలో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం మరియు సైకిల్ యాత్ర నిర్వహించబడనున్నాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా

*శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాల శాఖ మంత్రివర్యులు*

విచ్చేసి కార్యక్రమంలో పాల్గొననున్నారు.

అలాగే పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ గారి ఆహ్వానం మేరకు

*కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్*
*శ్రీ తుమ్మల రామస్వామి బాబు గారు*

ఈ కార్యక్రమంలో మరో ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.

📍 ప్రత్యేక సూచన:

జనసేన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వీర మహిళలు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ ఉదయం 8:30 గంటలకు *శ్రీ తుమ్మల రామస్వామి బాబు గారి* నివాసానికి చేరుకోవలసిందిగా కోరడమైనది. అక్కడి నుండి సమిష్టిగా కార్యక్రమ ప్రాంగణానికి బయలుదేరడం జరుగుతుంది.

🌱 ఒక్క మొక్క... లక్షల మందికి ప్రాణవాయువు
🚴 సైకిల్ యాత్ర... ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు
🌍 పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

*కావున పెద్దాపురం పట్టణం మరియు నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము*

జై జనసేన ✊
జై హింద్ 🇮🇳

*కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుల కార్యాలయం*

Address

Kakinada

Alerts

Be the first to know and let us send you an email when Team "Tummala Babu" posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share