02/06/2026
// గౌరవ ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మహిళా మరియు శిశు భద్రతా విభాగం ఐజీపీ శ్రీమతి బి. రాజకుమారి, ఐపీఎస్ గారి పర్యవేక్షణలో “ఆపరేషన్ దండాయన” ను ప్రారంభించిన కాకినాడ జిల్లా ఎస్పి శ్రీ జి. బిందు మాధవ్, ఐపిఎస్ //
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు మరియు బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, మహిళలపై జరుగుతున్న నేరాలలో, నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆధ్వర్యంలో మరియు మహిళా & శిశు భద్రత విభాగం ఐజీపీ శ్రీమతి బి. రాజకుమారి, ఐపీఎస్ గారి పర్యవేక్షణలో 'స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ (Speed Trial Monitoring) విధానాన్ని ఏపీ పోలీస్ శాఖ పకడ్బందీగా అమలు చేస్తోంది.
గౌరవ ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మహిళా మరియు శిశు భద్రతా విభాగం ఐజీపీ శ్రీమతి బి. రాజకుమారి, ఐపీఎస్ గారి పర్యవేక్షణలో “ఆపరేషన్ దండాయన” ను ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో కాకినాడ జిల్లా ఎస్పి శ్రీ జి. బిందు మాధవ్, ఐపిఎస్ గారు పోలీసు అధికారుల సమక్షంలో ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, గృహ హింస, పోక్సో కేసుల్లో తదితర నేరస్తులపై నిఘాకు మరియు నేరాల నియంత్రణకు “శక్తి” కార్యక్రమాలలో భాగంగా "ఆపరేషన్ దండాయన" ను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడమైనది. మహళలపై జరిగే నేరాలపై జీరో టోలరెన్స్ పాలసీ.. సత్వర విచారణ, నేరస్తులకు కఠిన శిక్షలు విధించడం, నేరస్తుల కదలికలపై నిఘా పెట్టడం ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం.
మహిళలపై నేరాలకు సంబంధించిన ప్రతి కేసులో 60 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేసి, సంచలన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి శిక్షలు పడేలా చూడడం, బాధిత మహిళలకు ఎన్జీవోల సహకారంతో కౌన్సెలింగ్, న్యాయ సహాయం అందించడంతో పాటు, పునరావృత నేరస్తులు, అనుమానితులపై SOS - సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరవబడును. SOS షీట్ హోల్డర్స్ పై నిరంతరం నిఘా కొనసాగును.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, "మహిళలపై నేరాల విషయంలో మా వైఖరి (Zero Tolerance Policy) మరియు Conviction based policing నినాదంతో నిందితులు ఎంతటి ప్రభావశీలురైనా కఠినంగా శిక్షిస్తాం. ప్రతి బాధితురాలికి న్యాయం జరిగే వరకు " ఆపరేషన్ దండాయన" నిరంతరం కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. మహిళా భద్రత కోసం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని, ఎలాంటి నేరాన్ని ఉపేక్షించవద్దని ఏపీ డీజీపీ గారు పోలీస్ శాఖకు ఆదేశించారన్నారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ (ఏ ఆర్) అడిషనల్ ఎస్పి శ్రీ ఎస్. శ్రీనివాసరావు, కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ పాటిల్ దేవ్ రాజ్ మనీష్, ఐపిఎస్ గారు, ఎస్బి డిఎస్పి శ్రీ కెవివి సత్యనారాయణ, కాకినాడ ఏ ఆర్ డిఎస్పి శ్రీ వి జి శ్రీహరి రావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీ వి శ్రీనివాసరావు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ టి దుర్గాప్రసాద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎమ్ నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ దండాయన గురించి వివరణ:
• ‘ఆపరేషన్ దండాయన' ప్రారంభం: ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆధ్వర్యంలో మరియు మహిళా & శిశు భద్రత విభాగం ఐజీపీ శ్రీమతి బి. రాజకుమారి, ఐపీఎస్ గారి పర్యవేక్షణలో ప్రారంభం.
• స్పీడ్ ట్రయల్ మానిటరింగ్: మహిళలపై నేరాల్లో నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా పకడ్బందీగా అమలు.
• 60 రోజుల గడువు: మహిళలపై నేరాలకు సంబంధించిన ప్రతి కేసులో 60 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు తప్పనిసరి.
• ఫాస్ట్ ట్రాక్ కోర్టులు: సంచలన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి త్వరితగతిన శిక్షలు పడేలా కృషి చేయడం
• నేరస్తులపై నిఘా: పునరావృత నేరస్తులు, అనుమానితులపై SOS - సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరవడం, వారిపై నిరంతర నిఘా ఉంచడం.
• సాంకేతిక నిఘా: జియోట్యాగింగ్ మరియు ‘నైబర్ హుడ్ వాచ్' ద్వారా ప్రజల భాగస్వామ్యంతో భద్రత.
• బాధితులకు సహాయం: ఎన్జీవోల సహకారంతో కౌన్సెలింగ్, న్యాయ సహాయం అందించడం.
• డీజీపీ హెచ్చరిక: మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ పాలసీ. నిందితులు ఎంతటి ప్రభావశీలులైనా కఠినంగా శిక్షిస్తాం. ప్రతి బాధితురాలికి న్యాయం జరిగే వరకు 'ఆపరేషన్ దండాయన' కొనసాగింపు.
పత్రికా ప్రకటన
తేదీ: 02.06.2026
జిల్లా పోలీసు కార్యాలయం,
కాకినాడ
AP Police
Dgp Andhra Pradesh
Andhra Pradesh Police