Kakinada District Police

Kakinada District Police This is an initiative by the Kakinada Dist. Police to connect directly with the citizen & redresses Please do not report crime here.

In case of emergency
100 /
9494933233

05/06/2026

// "స్టాప్. వాష్.. గో..." అంటూ డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్న కాకినాడ జిల్లా పోలీసు యంత్రాంగం //

కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీతో పాటు "స్టాప్ వాష్ అండ్ గో" మరియు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను ముమ్మరంగా నిర్వహించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి, వారి నిద్రమత్తును వదిలించేలా ముఖాలు కడిగించే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. రహదారి ప్రమాదాల నివారణే ధ్యేయంగా కాకినాడ జిల్లా పోలీస్ సిబ్బంది చేపట్టిన ఈ వినూత్న ప్రయోగానికి ప్రయాణికుల నుండి విశేష స్పందన లభించడమే కాకుండా, వారి రక్షణకు పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యలపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

AP Police
Dgp Andhra Pradesh
Andhra Pradesh Police




























04/06/2026

♦కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు డ్రగ్స్ రహిత సమాజమే ధ్యేయంగా♦
ఈ రోజు కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ G. బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ ABG తిలక్ గారి పర్యవేక్షణ లో, ప్రత్తిపాడు CI గారి ఆధ్వర్యంలో, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం మరియు రౌతులపూడి మొత్తం 4 మండలాల లోని గంజాయి సేవించే అనుమానితులను సెక్యూర్ చేసి వారికి రాపిడ్ డ్రగ్ స్క్రీనింగ్ టెస్ట్ కిట్ ద్వారా టెస్ట్ లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐదు మండలాలకు చెందిన 21 మందిని చెక్ చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చింది.
ఈ సందర్భంగా ప్రత్తిపాడు CI గారు ఈ చెకింగ్ ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అలాగే పాజిటివ్ వచ్చిన వారిని వాళ్ళ పేరెంట్స్ సహాయంతో కౌన్సిలింగ్ చేసి వారిని డి అడిక్షన్ సెంటర్ ద్వారా వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో శ్రీ బి సూర్య అప్పారావు, సర్కిల్ ఇన్ స్పెక్టర్, ప్రత్తిపాడు వారు, శ్రీమతి యస్.లక్ష్మి కాంతం, యస్.ఐ ప్రత్తిపాడు, శ్రీ యన్ రామలింగేశ్వరరావు, యస్.ఐ, ఏలేశ్వరం, శ్రీ జి శ్రీహరిబాబు, యస్.ఐ అన్నవరం మరియు శ్రీ యన్. వెంకటేశ్వర రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
AP Police
Dgp Andhra Pradesh
Andhra Pradesh Police























***a

04/06/2026

//కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పెద్దాపురం అపెక్స్ ఫ్యాక్టరీలో మహిళా కార్మికులకు మహిళా రక్షణ చట్టాలు మరియు ఫోక్సో యాక్ట్ ,శక్తి యాప్, సైబర్ నేరాల గురించి అవగాహన సదస్సును నిర్వహించిన పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ ABG తిలక్ గారు//

ఈరోజు పెద్దాపురం ఎపెక్స్ ఫ్యాక్టరీలో మహిళా కార్మికులకు మహిళా రక్షణ చట్టాలు, శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అని, సైబర్ నేరాలు, మోసాల గురించి అవగాహన కలిగి ఉండాలని వివిధ రకాల మోసాల గురించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఫ్యాక్టరీ నుండి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించడం జరిగింది. అలాగే పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా వారిపై తగిన పర్యవేక్షణ ఉండాలని సూచించడం జరిగింది. అలాగే హాస్టల్లో ఉంటున్న ఇతర రాష్ట్రాల మహిళా కార్మికులు గుర్తింపు కార్డులను కలిగి ఉండాలని వాళ్ళ యొక్క మరియు వారి బంధువుల యొక్క సమాచారాన్ని యాజమాన్యం వారు సేకరించుకోవాలని అలాగే వారు ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చేటప్పుడు వాళ్ళ ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరడం జరిగింది. రక్షణ కోసం 112 కాల్ లేదా శక్తి యాప్ ను ఉపయోగించుకోవాలనీ తెలియ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దాపురం SI శ్రీమతి మౌనిక మేడమ్ గారు, CI YRK మరియు సిబ్బంది పాల్గొన్నారు.
AP Police
Dgp Andhra Pradesh
Andhra Pradesh Police

























03/06/2026

// ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా "పల్లె నిద్ర" లో పాల్గొన్న కాకినాడ జిల్లా పోలీసులు //
కాకినాడ జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ది.02.06.2026 వ తేదీన, జగ్గంపేట సర్కిల్ పరిధిలోని బొర్రపాలెం, కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మిరాజు పేట గ్రామాల ప్రజలతో పోలీసులు మమేకమై, ఫ్రెండ్లీ పోలీసింగ్ తో నేర రహిత సమాజమే లక్ష్యంగా “పల్లె నిద్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రజలతో మమేకమై శాంతిభద్రతలపై సమీక్షించడంతో పాటు సైబర్ నేరాలు, మహిళల భద్రత, పోక్సో చట్టం, నూతన చట్టాలపై సమగ్ర అవగాహన కల్పించారు. సమాజానికి శాపంగా మారిన బాల్య వివాహాల నివారణ యొక్క అవశ్యకతను వివరిస్తూ, ఎవరైనా బాల్య వివాహాలు చేస్తున్నట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలని, శారీరకంగా ఎదుగుదల లేకుండా చిన్న వయసులో పెండ్లి చేస్తే వారి జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని, పుట్టే పిల్లల మీద కూడా ఆ ప్రభావం ఉంటుందన్నారు. గంజాయి నివారణ కొరకు ఈగల్ అనే ప్రత్యేక పోలీసు యంత్రాంగం పని చేస్తుందని, 1972 కి సమాచారం ఇవ్వాలన్నారు. ముఖ్యంగా యువత ఈజీ మనీ కోసం ఆన్లైన్ బెట్టింగ్ జోలికి పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని, తీవ్ర మానసిక ఇబ్బందులు కలుగజేసే అనధికార లోన్ యాప్స్ బారిన పడవద్దని హెచ్చరించారు. నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత కాల్స్, మెసేజ్లు, ముఖ్యంగా వీడియో కాల్స్ కు అస్సలు స్పందించవద్దని స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్ళు అపరిచిత లింక్స్ పంపడం ద్వారా మీ ఫోన్ ను వారి కంట్రోల్ లోకి తీసుకొని మీ బ్యాంక్ డబ్బులు కొల్లగొట్టడం, మీ వాట్సాప్ హ్యాక్ చేసి మీ పరిచయస్తులను డబ్బులు అడగడం వంటి నేరాలకు పాల్పడుతున్నందున, స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ బాధితులుగా మారి అకౌంట్ లో డబ్బులు పోగొట్టుకున్నా, లేదా ఆన్లైన్ ద్వారా వేధింపులు ఎదుర్కొంటున్నా క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఉచిత జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలని, లేదా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి రావాలని, బాధితుల వివరాలు అత్యంత రహస్యంగా ఉంచబడతాయని ఈ సందర్భంగా తెలియజేశారు.
AP Police
Dgp Andhra Pradesh
Andhra Pradesh Police

























03/06/2026

// "స్టాప్. వాష్.. గో..." అంటూ డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్న కాకినాడ జిల్లా పోలీసు యంత్రాంగం //
కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీతో పాటు "స్టాప్ వాష్ అండ్ గో" మరియు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను ముమ్మరంగా నిర్వహించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి, వారి నిద్రమత్తును వదిలించేలా ముఖాలు కడిగించే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. రహదారి ప్రమాదాల నివారణే ధ్యేయంగా కాకినాడ జిల్లా పోలీస్ సిబ్బంది చేపట్టిన ఈ వినూత్న ప్రయోగానికి ప్రయాణికుల నుండి విశేష స్పందన లభించడమే కాకుండా, వారి రక్షణకు పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యలపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
AP Police
Dgp Andhra Pradesh
Andhra Pradesh Police



























// పదవీ విరమణ పొందిన మరియు  మరణించిన హోమ్ గార్డ్స్ కుటుంబాలకు  “చేయూత” ని అందించిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మ...
03/06/2026

// పదవీ విరమణ పొందిన మరియు మరణించిన హోమ్ గార్డ్స్ కుటుంబాలకు “చేయూత” ని అందించిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారు //
విధి నిర్వాహణలో సుదీర్ఘకాలం పనిచేసే ఇటీవల పదవి విరమణ పొందిన హోమ్ గార్డ్స్ కు 'చేయూత' గా 4 కుటుంబాలు కి చెక్ లను ఎస్పీ గారు జిల్లా పోలీస్ కార్యాలయం లో ఈ రోజు అందచేశారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో ఇటీవల కాలంలో మరణించిన హోమ్ గార్డ్ Hg 257,Ch. సుకుమార్ రాజు వాళ్ళ కుటుంబానికి రూ.4,58,660 /- ,అలాగే ఇటివల కాలంలో మరణించిన హోమ్ గార్డ్ Hg 77,S. సోమేశ్వరరావు వాళ్ళ కుటుంబానికి, రూ.4,57,240 /- అలాగే మరణించిన హోం గార్డ్ Hg 683, Ch.దుర్గాప్రసాద్ వాళ్ళ భార్యకి కంపాసినేటివ్ అపాయింట్మెంట్ కింద హోమ్ గార్డ్ జాబ్ మరియు అమౌంట్ రూ.1,93,120 /- , పదవి విరమణ తర్వాత మరణించిన హోమ్ గార్డ్ Hg 472, K.గంగిశెట్టి వాళ్ళ కుటుంబానికి, రూ.1,93,120 /- వాళ్ళ కుటుంబాలను,ఆర్ధికంగా ఆదుకొనేందుకు 'చేయూత'గా హెూంగార్డ్సు సమకూర్చిన ఒక్క రోజు డ్యూటీ,అలవెన్సు ను జిల్లా ఎస్పీ ,పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీశ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారు అందజేసారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ - పోలీసుశాఖలో హెూంగార్డుగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన లేదా ప్రమాదవసాత్తు లేదా అనారోగ్య కారణాలతో మృతి చెందిన హెూంగార్డు కుటుంబాలనుఆర్ధికంగా ఆదుకొనేందుకు కాకినాడ పోలీసు యూనిట్ లో పని చేస్తున్న హెూంగార్డ్సు స్వచ్చందంగా ముందుకు వచ్చి, ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు మొత్తాన్ని ప్రోగు చేసి, వారి కుటుంబాలకు “చేయూత”గా అందజేయడంఅభినందనీయమన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వలన పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతోపాటు, వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో హెూంగార్డ్సు ఆర్ఐ M. నరసింహమూర్తి పాల్గొన్నారు.
పత్రికా ప్రకటన
తేదీ: 03.06.2026
జిల్లా పోలీస్ కార్యాలయం,
కాకినాడ.
AP Police
Dgp Andhra Pradesh
Andhra Pradesh Police
























// గౌరవ ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్  గారి ఆదేశాల మేరకు  మహిళా మరియు శిశు భద్రతా  విభాగం ఐజీపీ శ...
02/06/2026

// గౌరవ ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మహిళా మరియు శిశు భద్రతా విభాగం ఐజీపీ శ్రీమతి బి. రాజకుమారి, ఐపీఎస్ గారి పర్యవేక్షణలో “ఆపరేషన్ దండాయన” ను ప్రారంభించిన కాకినాడ జిల్లా ఎస్పి శ్రీ జి. బిందు మాధవ్, ఐపిఎస్ //
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు మరియు బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, మహిళలపై జరుగుతున్న నేరాలలో, నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆధ్వర్యంలో మరియు మహిళా & శిశు భద్రత విభాగం ఐజీపీ శ్రీమతి బి. రాజకుమారి, ఐపీఎస్ గారి పర్యవేక్షణలో 'స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ (Speed Trial Monitoring) విధానాన్ని ఏపీ పోలీస్ శాఖ పకడ్బందీగా అమలు చేస్తోంది.
గౌరవ ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మహిళా మరియు శిశు భద్రతా విభాగం ఐజీపీ శ్రీమతి బి. రాజకుమారి, ఐపీఎస్ గారి పర్యవేక్షణలో “ఆపరేషన్ దండాయన” ను ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో కాకినాడ జిల్లా ఎస్పి శ్రీ జి. బిందు మాధవ్, ఐపిఎస్ గారు పోలీసు అధికారుల సమక్షంలో ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, గృహ హింస, పోక్సో కేసుల్లో తదితర నేరస్తులపై నిఘాకు మరియు నేరాల నియంత్రణకు “శక్తి” కార్యక్రమాలలో భాగంగా "ఆపరేషన్ దండాయన" ను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడమైనది. మహళలపై జరిగే నేరాలపై జీరో టోలరెన్స్ పాలసీ.. సత్వర విచారణ, నేరస్తులకు కఠిన శిక్షలు విధించడం, నేరస్తుల కదలికలపై నిఘా పెట్టడం ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం.
మహిళలపై నేరాలకు సంబంధించిన ప్రతి కేసులో 60 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేసి, సంచలన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి శిక్షలు పడేలా చూడడం, బాధిత మహిళలకు ఎన్జీవోల సహకారంతో కౌన్సెలింగ్, న్యాయ సహాయం అందించడంతో పాటు, పునరావృత నేరస్తులు, అనుమానితులపై SOS - సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరవబడును. SOS షీట్ హోల్డర్స్ పై నిరంతరం నిఘా కొనసాగును.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, "మహిళలపై నేరాల విషయంలో మా వైఖరి (Zero Tolerance Policy) మరియు Conviction based policing నినాదంతో నిందితులు ఎంతటి ప్రభావశీలురైనా కఠినంగా శిక్షిస్తాం. ప్రతి బాధితురాలికి న్యాయం జరిగే వరకు " ఆపరేషన్ దండాయన" నిరంతరం కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. మహిళా భద్రత కోసం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని, ఎలాంటి నేరాన్ని ఉపేక్షించవద్దని ఏపీ డీజీపీ గారు పోలీస్ శాఖకు ఆదేశించారన్నారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ (ఏ ఆర్) అడిషనల్ ఎస్పి శ్రీ ఎస్. శ్రీనివాసరావు, కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ పాటిల్ దేవ్ రాజ్ మనీష్, ఐపిఎస్ గారు, ఎస్బి డిఎస్పి శ్రీ కెవివి సత్యనారాయణ, కాకినాడ ఏ ఆర్ డిఎస్పి శ్రీ వి జి శ్రీహరి రావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీ వి శ్రీనివాసరావు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ టి దుర్గాప్రసాద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎమ్ నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఆపరేషన్ దండాయన గురించి వివరణ:
• ‘ఆపరేషన్ దండాయన' ప్రారంభం: ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆధ్వర్యంలో మరియు మహిళా & శిశు భద్రత విభాగం ఐజీపీ శ్రీమతి బి. రాజకుమారి, ఐపీఎస్ గారి పర్యవేక్షణలో ప్రారంభం.
• స్పీడ్ ట్రయల్ మానిటరింగ్: మహిళలపై నేరాల్లో నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా పకడ్బందీగా అమలు.
• 60 రోజుల గడువు: మహిళలపై నేరాలకు సంబంధించిన ప్రతి కేసులో 60 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు తప్పనిసరి.
• ఫాస్ట్ ట్రాక్ కోర్టులు: సంచలన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి త్వరితగతిన శిక్షలు పడేలా కృషి చేయడం
• నేరస్తులపై నిఘా: పునరావృత నేరస్తులు, అనుమానితులపై SOS - సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరవడం, వారిపై నిరంతర నిఘా ఉంచడం.
• సాంకేతిక నిఘా: జియోట్యాగింగ్ మరియు ‘నైబర్ హుడ్ వాచ్' ద్వారా ప్రజల భాగస్వామ్యంతో భద్రత.
• బాధితులకు సహాయం: ఎన్జీవోల సహకారంతో కౌన్సెలింగ్, న్యాయ సహాయం అందించడం.
• డీజీపీ హెచ్చరిక: మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ పాలసీ. నిందితులు ఎంతటి ప్రభావశీలులైనా కఠినంగా శిక్షిస్తాం. ప్రతి బాధితురాలికి న్యాయం జరిగే వరకు 'ఆపరేషన్ దండాయన' కొనసాగింపు.
పత్రికా ప్రకటన
తేదీ: 02.06.2026
జిల్లా పోలీసు కార్యాలయం,
కాకినాడ

AP Police
Dgp Andhra Pradesh
Andhra Pradesh Police

























// పదవీ విరమణ పొందిన ఐదుగురు  పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు // పోలీస్...
02/06/2026

// పదవీ విరమణ పొందిన ఐదుగురు పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు //
పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు విశిష్ట సేవలు అందించి, నేడు పదవీ విరమణ పొందిన ఐదుగురు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. పదవీ విరమణ పొందిన వారిలో కాకినాడ III టౌన్ ఎస్సై శ్రీ కె. విజయ్ కుమార్ , కాకినాడ I టౌన్ ఎస్సై శ్రీ సి హెచ్ కుమార్, కాకినాడ పోర్ట్ ఎస్సై శ్రీ ఎ. సూర్య ప్రకాష్, ట్రాఫిక్ –వన్ ఎస్సై కె . అప్పారావు మరియు ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ కె. నారాయణరావు ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు ఆయా అధికారులను దుశ్శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించి, వారి సుదీర్ఘ సేవలను కొనియాడారు. విధి నిర్వహణలో వారు చూపిన నిబద్ధతను అభినందిస్తూ, వారి తదుపరి విశ్రాంత జీవనం సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ శ్రీ కె.వి.వి. సత్యనారాయణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ శ్రీ ఎం. నరసింహమూర్తి, శ్రీ కె. వెంకటరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ ఎం.వి.వి. సత్యనారాయణ మూర్తి, ఎస్పీ సీసీ శ్రీ ఎస్. రాంబాబు, జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ పి. సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.
పత్రికా ప్రకటన
తేదీ: 02.06.2026
జిల్లా పోలీస్ కార్యాలయం,
కాకినాడ

AP Police
Dgp Andhra Pradesh
Andhra Pradesh Police



























//గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో భాగంగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించ...
31/05/2026

//గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో భాగంగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జివిజి అశోక్ కుమార్, ఐపిఎస్//
తుని మండలం చామవరం గ్రామంలో జూన్ 1, 2026 వ తేదీన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటించనున్న నేపథ్యంలో ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జివిజి అశోక్ కుమార్ ఐపిఎస్ గారితో పాటు కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్, ఐపిఎస్ గారు, కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా, ఐపిఎస్ గారు పోలీసు బందోబస్తు ఏర్పాట్లను ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఇందులో భాగంగా వీఐపీ భద్రత కొరకు కేటాయించిన కాన్వాయ్ యొక్క ట్రైల్ రన్‌ను స్వయంగా నిర్వహించి రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో ఎక్కడా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా ప్రధాన సభా వేదిక, ట్రాఫిక్ పాయింట్లు, కట్ ఆఫ్ పాయింట్స్, హెలిప్యాడ్ పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బందోబస్తు విధుల్లో భాగమైన సివిల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్, స్పెషల్ టీమ్స్, క్రైమ్ పార్టీ, ట్రాఫిక్ పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ మరియు క్విక్ రెస్పాన్స్ టీమ్ తదితర విభాగాలకు చెందిన అధికారులకు, సిబ్బందికి శాంతిభద్రతల పరిరక్షణ మరియు వీఐపీ సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌పై ఐజీ గారు, కాకినాడ జిల్లా ఎస్పీ గారు దిశా నిర్దేశం చేశారు. పర్యటన ముగిసే వరకు ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కాకినాడ (ఏ ఆర్) అడిషనల్ ఎస్ పి శ్రీ ఎస్. శ్రీనివాసరావు, కాకినాడ ఏ ఎస్పీ శ్రీ పాటిల్ దేవ్ రాజ్ మనీష్, ఐపిఎస్ గారు, ఎస్ బి డి ఎస్ పి శ్రీ కెవివి సత్యనారాయణ, పెద్దాపురం డిఎస్పి శ్రీ ఏబిజీ తిలక్, బందోబస్తుకు విచ్చేసిన ఇతర జిల్లాల పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పత్రికా ప్రకటన
తేదీ: 31.05.2026
జిల్లా పోలీసు కార్యాలయం,
కాకినాడ.
AP Police
Dgp Andhra Pradesh
Andhra Pradesh Police

























31/05/2026

// "స్టాప్. వాష్.. గో..." అంటూ డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్న కాకినాడ జిల్లా పోలీసు యంత్రాంగం //
కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్ ఐపీఎస్ గారి ముందస్తు ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీతో పాటు "స్టాప్ వాష్ అండ్ గో" మరియు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను ముమ్మరంగా నిర్వహించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి, వారి నిద్రమత్తును వదిలించేలా ముఖాలు కడిగించే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. రహదారి ప్రమాదాల నివారణే ధ్యేయంగా కాకినాడ జిల్లా పోలీస్ సిబ్బంది చేపట్టిన ఈ వినూత్న ప్రయోగానికి ప్రయాణికుల నుండి విశేష స్పందన లభించడమే కాకుండా, వారి రక్షణకు పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యలపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
పత్రికా ప్రకటన
తేదీ 31.05.2026
జిల్లా పోలీసు కార్యాలయం,
కాకినాడ.
AP Police
Dgp Andhra Pradesh
Andhra Pradesh Police



























Address

ANDHRAPRADESH
Kakinada
533001

Telephone

+919494933233

Website

Alerts

Be the first to know and let us send you an email when Kakinada District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kakinada District Police:

Share