13/03/2024
ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధుల చరిత్రలో 12 మార్చి, 2024 నాడు చారిత్రాత్మక మైన రోజు ఎందుకంటే ఆ రోజు ఒక చారత్రాత్మక మైన ఘట్టం చరిత్రలో చోటు చేసుకుంది, అది ఏంటంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వున్న బౌద్ధ విహరాల లో కాకినాడ బౌద్ధ విహారం ఒకటి, ఎంతోమంది బౌద్ధ ఉపాసకులు ఇక్కడ బౌద్ధాన్ని నేర్చుకుని ఆచరిస్తూ వున్నారు, ఇప్పుడు ఆ బౌద్ధులు ఆనాటి బుద్దుడు ఏవిధంగా అయితే ఆనాటి సామాజిక రుగ్మతలు అయిన వర్ణ వ్యవస్థ ద్వారా, స్త్రీ బానిసత్వం ద్వారా యజ్ఞ యాగాదుల ద్వారా ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని , మోసాలను, తద్వారా దుఃఖం పొందుతున్న సామాన్య ప్రజలకు, బుద్దుడు తాను పొందిన జ్ఞానోదయం , తద్వారా తాను కనుగొన్న ధమ్మం ను ప్రచారం చేస్తూ, అందుకు గాను సుసుక్షితు లైన బౌద్ధ బిక్కులను తయారు చేసి దమ్మాను ప్రచారం చేసి ప్రజల దుఃఖానికి కారణం ను తెలిపి దాని నుండి బయట పడే మార్గాన్ని బోధించి, ప్రజలు స్వేచ్ఛ పొందేలా ప్రజలను జాగృతి చేశారు, అప్పుడు ప్రజలు వారి అంతకు వారే దుఃఖ విముక్తి పొందారు , ఇప్పుడు కూడా మనకు కష్టాలు వున్నాయి, నిరుద్యోగం, స్త్రీ బానిసత్వం, విద్య లేకపోవటం, అస్పృశ్యత, అవమానం, దాడులు, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని మరి వీటికి కారణాలు ఎంటి?
స్వతంత్రం వచ్చినప్పటి నుండి అనగా రాజ్యాంగం రాసుకుని 75 సంవత్సరాలు దాటుతున్న కూడా మన ప్రజలకు కష్టాలు రోజు రోజు కూ పెరుగుతున్నాయి తప్పా తరగటం లేదు, ఇందులో భాగంగానే ప్రజలు అనేకానేక పోరాటాలు చేస్తున్నారు, ఇందులో భాగంగానే అనేక సామాజిక, రాజకీయ పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రజల కష్టాలు తీరటం లేదు, అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రజలు ఏకం అవుతున్నారు, వారికి గల సమస్యలు గల కారణాలను సహేతుకంగా తర్కించి తెలుసుకుని వాటి ఆధారంగా ఈ దేశ మూల వాసి ప్రజలు దేశ వ్యాప్తంగా సంఘటితంగా పోరాటాలు చేస్తున్నారు, అందులో భాగంగానే *ఇప్పుడు దేశం లో అతి ముఖ్యమైన సమస్య EVM (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లు.*
*మన అందరికీ తెలిసినట్టు ఇప్పుడు దేశ వ్యాప్తంగా EVM లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అనేక రాజకీయా పార్టీలు, ప్రజా సంఘాలు, EVM వ్యతిరేక ఉద్యమాలు జరుపుతున్నాయి.*
*ఇప్పుడు దేశ ప్రజలు అందరూ ఆనాడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు యొక్క విలువను తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు, అలాగే ఒకవేళ ఓటు హక్కును కోల్పోతే, అప్పుడు రాబోయే ఉపద్రవాన్ని కూడా ఇప్పుడు ప్రజలు గుర్తించారు, అందుకే ఇప్పుడు దేశ వ్యాప్తంగా EVM ల ద్వారా మన ఓటు ఏవిధంగా విలువ కోల్పోతుంది అనేది, BAMCEF జాతీయ అధ్యక్షులు మాన్యులు వామన మెస్రం గారి ద్వారా అలాగే ప్రజలను నిరంతరం జాగృతి చేసే BAMCEF లాంటి సంస్థ లాంటి ద్వారా EVM ల ద్వారా జరిగే మోసం గురుంచి ఇప్పుడు దేశ ప్రజలు అందరికీ తెలిసి పోయింది, అందుకే BMM (భారత్ ముక్తి మోర్చ) లాంటి ప్రజాస్వామిక , ఇతర ప్రజా ఉద్యమ సంస్థలు, అలాగే సుప్రీం కోర్టు లాయర్లు, రాజకీయ పార్టీలు మొన్న ఆ మధ్య అనగా 2024 , జనవరి 22 నాడు ఢిల్లీ జంతర్ మంతర్ లో దాదాపు లక్ష మంది కి పైగా ప్రజలతో EVM లకు వ్యతిరేకంగా, అలాగే ECI (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా) యొక్క తీరును నిరసిస్తూ ఒక పెద్ద ర్యాలీ మరియు ధర్నా ప్రదర్శన కార్యక్రమం ను నిర్వహించారు, కాకపోతే ఇంత పెద్ద విషయాన్ని ఏ మీడియా పత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ చూపలేదు కాబట్టి ఇప్పుడు ప్రజలు మరింతగా ఆలోచిస్తున్నారు, మీడియాలో చూపకపోవడం వలన ప్రజల అనుమానం మరింతగా అనుమానిస్తున్నారు, అందుకే ఇప్పుడు తమ ఓటు గురుంచి, ఓటు విలువ గురుంచి ప్రజలు చర్చ చేస్తూ అర్థం చేసుకుంటున్నారు, అందుకే తమ నిరసనను దేశ వ్యాప్తంగా తెలియ చేస్తున్నారు, ఇప్పుడు EVM ల గురుంచిన జాగృతి దేశ వ్యాప్తంగా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది, అందుకే దేశ వ్యాప్తంగా ప్రజలు నిరసన కార్యక్రమాలు చెందుతున్నారు...*
*అందులో భాగంగానే ఇప్పుడు కాకినాడ బౌద్ధ విహార సభ్యులు, కాకినాడ లో వున్న ప్రజాస్వామిక వాదులును, ఇతర ప్రజా సంఘాలును కలుపుకుని EVM లకు వ్యతిరేకంగా దాదాపు 70 మంది ప్రజల తో కలసి కాకినాడ లో స్థానిక కలెక్టరేట్ వద్ద గల బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద తమ నిరసనను తెలియచేశారు, ఈ విధంగా తమ నిరసనను తెలియచేయటం వలన ఇతర ప్రజలు , EVM ల ద్వారా జరిగే ఎన్నికల ద్వారా జరిగే మోసం గురుంచి, తద్వారా ఓటు యొక్క విలువ ఎలా శూన్యం కబడుతుంది, ప్రజాస్వామ్యం ఎలా నాశనం అవుతున్నాయి, రాజ్యాంగం ఎలా నాశనం అవుతున్నాయి అని ఆలోచించటం మొదలు పెట్టారు..*
*నిజంగా ఇది ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధుల చరిత్రలో ఒక గొప్ప కార్యక్రమం, ఆనాటి బౌద్ధులు ఏ విధంగా అయితే ఆనాటి సామాజిక సమస్యల గురుంచి పోరాటం చేశారో అదే విధంగా ఈ నాటి కాకినాడ బౌద్ధులు కూడా ఈనాడు దేశంలోని ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, ప్రజల ప్రాథమిక హక్కు కు ప్రమాదం కలిగించే EVM లకు వ్యతిరేకంగా తమ గొంతుకను వినిపించారు, ఇది అత్యంత గొప్ప విషయం, ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ప్రజాస్వామిక వాదులు రాష్ట్ర వ్యాప్తంగా,దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేశారు, ఈ నిరసన కార్యక్రమం చాలా మందికి ప్రేరణ కలిగించింది.*
*అయితే కొద్దిమందికి ఒక అనుమానం కలగవచ్చు, ఆనాడు బుద్దుడు కానీ బుద్ధ విహారాలు కానీ ఆధ్యాత్మిక ను బోధించాయి కదా ? మరి ఇప్పుడు బుద్ధ విహార ప్రజలు EVM లకు వ్యతిరేకంగా నిరసన తెలపటం ఎంటి అని ?*
*మనం ఒకసారి చరిత్రను బాగా అధ్యయనం చేస్తే బుద్దుడు నిజానికి సామాజిక పోరాటం చేశాడు,ఆనాటి సామాజిక , రాజకీయ సమస్యకు పరిష్కారం కోసం పని చేశాడు, కానీ ఈ విషయం తెలియని సాధారణ ప్రజలు బుద్దుడు ఆధ్యాత్మిక వాది కదా?*
*ఆధ్యాత్మికం అంటే అలౌకికము కదా అని చాలా మంది అభిప్రాయ పడతారు, కానీ నిజానికి "బుద్దుడు చెప్పిన ఆధ్యాత్మికం లౌకిక మైనదీ, అంటే భూమి మీద మనిషికి కలిగే దుఃఖానికి కారణం అయిన దుఃఖ హేతువుల గురుంచి తెలియజేయునది, దుఃఖ విముక్తి కి మార్గం చూపి , భూమి మీద మనిషి సంతోషంగా జీవించి నిర్వాణ స్థితిని( దుఃఖ రహిత స్థితి) చేరుకునే మార్గం" బుద్దుడు బోధించిన ఆధ్యాత్మిక మార్గం,*
*🔥అంతేకాని సాధారణ ప్రజలు అనుకున్నట్టు బుద్దుడు బోధించిన మార్గం అలౌకికము అంటే ఈ లోకానికి సంబంధము లేనిది కాదు..అనే అభిప్రాయం తప్పు" ఈ రకంగా చూస్తే కాకినాడ బౌద్ధులు , బుద్ధ విహార ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించటం జరిగింది.*
*అలాగే రాష్ట్రం లోని మిగిలిన ఇతర బుద్ధ విహార నిర్వాహకులు, బౌద్ధులు కూడా ఈ విధంగా బుద్దుడు చూపిన మార్గం లో పయనించాలని, ఈనాటి అత్యంత ఆవశ్యక , సామాజిక సమస్య అయిన EVM ల మీద అలాగే ఇతర ముఖ్య సమస్యల మీద ప్రజలను జాగృతి చేస్తారని కోరుకుందాం అలాగే దేశ ప్రజలు ఆశిస్తున్నట్టు దేశంలో EVM ల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా మాత్రమే ఎన్నికలు తిరిగి రావాలని , తద్వారా ప్రజల ఓటును , ఓటు యొక్క విలువను, తద్వారా ప్రజాస్వామ్యము , రాజ్యాంగము కాపడబడతాయని ఆశిద్దాం.*
*"ఎందుకంటే మనం మన ఓటును కాపాడుకుంటే మాత్రమే మిగిలిన ప్రజాస్వామ్యం కానీ, రాజ్యంగము కానీ కాపడబడతాయి లేదంటే భవిష్యత్తులో త్వరలోనే రాబోయే బానిస వ్యవస్థ లో బానిసత్వం అనుభవించటానికి సిద్దం కావాల్సిందే..."*
*చివరగా కాకినాడ బుద్ధ విహార కు ప్రత్యేక అభినందనలు*💐💐
జై భీమ్
జై మూల నివాసి
ఇట్లు
BAMCEF
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ.