05/09/2026
భావితరాలకు బంగారు భవిష్యత్తు విద్యతోనే సాధ్యం:- Janasena Sainik - SatyaPrasad Desineedi.
ప్రతి గడపలో చదువు ఆ ఇంటికి పంచే వెలుగు. చదువుంటే సమాజానికి జరుగుతుంది మేలు. మానవ ప్రగతికి అక్షరాస్యత తప్పనిసరి. అక్షరాస్యత మనిషి జీవన స్థితిగతులను మార్చేస్తుంది. వారివారి సంస్కృతిని బలపరచుకునేలా చేస్తుంది. అక్షరాస్యత అనేది మానవ జీవితాలలో అత్యంత విలువైన అంశం మానవులు ఎదగడానికి, స్థిరమైన వాతావరణాన్ని సృష్టించడానికి అక్షరాస్యత, విద్య చాలా ముఖ్యం, ‘మనిషి జీవించడానికి ఆహారం ఎంత అవసరమో,చదువు కూడా అంతే అవసరం. పేదరికాన్ని పారద్రోలడానికి, శిశు మరణాలు తగ్గించడానికి, అధిక జనాభా నియంత్రణకు, లింగ వివక్షత లేకుండా ఉండటానికి విద్య ఎంతో అవసరం.
అక్షరాస్యత కుటుంబ స్థితిగతులను మెరుగు పరుస్తుంది, దాంతో దేశ ప్రగతి త్వరితంగా జరుగుతుంది. ప్రతి పౌరుడూ కుటుంబం పట్ల, సంఘం పట్ల, దేశం పట్ల బాధ్యతగా ప్రవర్తించడానికి నిరంతర విద్యాభ్యాసం దోహద పడుతుంది నాణ్యతతో కూడిన విద్యను అందించటంలో మనరాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది . దేశరక్షణకు ఆయుధం ఎంత ముఖ్యమో,ఆ ఆయుధానికి అక్షరం అంతముఖ్యం. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం శభాకాంక్షలు.
#సత్యప్రసాద్_దేశినీడి
జనసేన పార్టీ, కాకినాడ జిల్లా.