20/10/2023
*కరెంట్ చార్జీల పెంపుపై వలేటివారిపాలెం మండల కేంద్రంలో సీపీఎం,సీపీఐ ల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా ప్రజా బ్యాలెట్*
కేంద్ర ప్రభుత్వ షరతులకు తలోగ్గి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తుందని సిపిఎం వలేటివారి పాలెం మండల ఇన్చార్జి జీవీబీ కుమార్, సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బూసి. సురేష్ లు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రకరకాల పేర్లతో కరెంట్ చార్జీలను పెంచి సామాన్యులపై ఆర్థిక భారాలను మోపటాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో వలేటివారిపాలెం మండల కేంద్రంలో శుక్రవారం నాడు సాయంత్రం వలేటివారిపాలెం బస్టాండ్ సెంటర్ లో ప్రజా బ్యాలెట్ పేరుతో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తీసుక రావటం, వాటిని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహం చూపటం సిగ్గుచేటని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచటం వలన పెట్రోలు డీజిల్ చార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. ఫలితంగా రవాణా చార్జీలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివలన నిత్యావసర వస్తువుల ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగి రోజువారి కొనితినే ప్రజల అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని సిపిఎం మండల కార్యదర్శి మాదాల రమణయ్య ప్రారంభించారు. రాజకీయాలకతీతంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ప్రజా బ్యాలెట్ ఓటింగ్ లో పాల్గొన్నారు. 150 మంది ఓటింగ్ లో పాల్గొన్నారని, 149 మంది కరెంట్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఓటింగ్ లో పాల్గొన్నారని, ఒక్కరు మాత్రమే ప్రభుత్వం పెంచిన కరెంట్ చార్జీలనుసమర్థించారని పేర్కొన్నారు. సిపిఎం నాయకులు జీవీబీకుమార్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని,రక రకాల పేర్లతో పెంచిన కరెంటు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురిగాక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలోసిపిఎం వలేటివారిపాలెం మండల నాయకులు దువ్వూరి.జాన్, గుండ్లతోటి.మాధవమూర్తి,డి. యం.రాయుడు, పర్రె.భాస్కర్ రావు, పర్రె.శివ,జక్రయ్య, కేశవులు,ప్రజా సంఘాల నాయకులు మిట్టనోసల. సుభాను,సిపిఐ నాయకులు గాలం. అంజయ్య తదితరులు పాల్గొన్నారు