CPM Kandukur Constituency

CPM Kandukur Constituency భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

*కరెంట్ చార్జీల పెంపుపై వలేటివారిపాలెం మండల కేంద్రంలో సీపీఎం,సీపీఐ ల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా ప...
20/10/2023

*కరెంట్ చార్జీల పెంపుపై వలేటివారిపాలెం మండల కేంద్రంలో సీపీఎం,సీపీఐ ల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా ప్రజా బ్యాలెట్*
కేంద్ర ప్రభుత్వ షరతులకు తలోగ్గి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తుందని సిపిఎం వలేటివారి పాలెం మండల ఇన్చార్జి జీవీబీ కుమార్, సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బూసి. సురేష్ లు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రకరకాల పేర్లతో కరెంట్ చార్జీలను పెంచి సామాన్యులపై ఆర్థిక భారాలను మోపటాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో వలేటివారిపాలెం మండల కేంద్రంలో శుక్రవారం నాడు సాయంత్రం వలేటివారిపాలెం బస్టాండ్ సెంటర్ లో ప్రజా బ్యాలెట్ పేరుతో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తీసుక రావటం, వాటిని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహం చూపటం సిగ్గుచేటని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచటం వలన పెట్రోలు డీజిల్ చార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. ఫలితంగా రవాణా చార్జీలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివలన నిత్యావసర వస్తువుల ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగి రోజువారి కొనితినే ప్రజల అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని సిపిఎం మండల కార్యదర్శి మాదాల రమణయ్య ప్రారంభించారు. రాజకీయాలకతీతంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ప్రజా బ్యాలెట్ ఓటింగ్ లో పాల్గొన్నారు. 150 మంది ఓటింగ్ లో పాల్గొన్నారని, 149 మంది కరెంట్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఓటింగ్ లో పాల్గొన్నారని, ఒక్కరు మాత్రమే ప్రభుత్వం పెంచిన కరెంట్ చార్జీలనుసమర్థించారని పేర్కొన్నారు. సిపిఎం నాయకులు జీవీబీకుమార్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని,రక రకాల పేర్లతో పెంచిన కరెంటు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురిగాక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలోసిపిఎం వలేటివారిపాలెం మండల నాయకులు దువ్వూరి.జాన్, గుండ్లతోటి.మాధవమూర్తి,డి. యం.రాయుడు, పర్రె.భాస్కర్ రావు, పర్రె.శివ,జక్రయ్య, కేశవులు,ప్రజా సంఘాల నాయకులు మిట్టనోసల. సుభాను,సిపిఐ నాయకులు గాలం. అంజయ్య తదితరులు పాల్గొన్నారు

03/10/2023

CPM పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధి సాధనకై చేపట్టిన పాదయాత్ర ప్రారంభం సందర్భంగా చేవూరులో జరిగిన సభలో మా...
02/10/2023

CPM పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధి సాధనకై చేపట్టిన పాదయాత్ర ప్రారంభం సందర్భంగా చేవూరులో జరిగిన సభలో మాట్లాడుతున్న CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్. నరసింగరావు...

అక్టోబర్ 2 నుండి రామాయపట్నం పోర్టు వద్ద ప్రారంభమై  అక్టోబర్ 13న నెల్లూరు వరకు జరిగే సిపిఎం పాదయాత్రలను జయప్రదం చేయాలని స...
25/09/2023

అక్టోబర్ 2 నుండి రామాయపట్నం పోర్టు వద్ద ప్రారంభమై అక్టోబర్ 13న నెల్లూరు వరకు జరిగే సిపిఎం పాదయాత్రలను జయప్రదం చేయాలని సిపిఎం ఉలవపాడు మండల కార్యదర్శి జివిబి కుమార్ పిలుపునిచ్చారు. సిపిఎం ఉలవపాడు మండల కమిటీ సమావేశం ఎస్. డి గౌస్ బాషా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం కందుకూరు నియోజకవర్గ నాయకులు జి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. అక్టోబర్ 3న ఉదయం 10 గంటలకు ఉలవపాడు మండల కేంద్రానికి పాదయాత్ర చేరుకుంటుందని, ఆటో స్టాండ్ వద్ద సభ జరుగుతుందని సభలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం మండల నాయకులు ఎస్.మాచర్లరావు కొమరగిరి. వెంకటేశ్వర్లు,ఏలూరి.నాగార్జున, కే శేషమ్మ, పొట్లూరి కోటేశ్వరరావు,వీసం.సురేంద్ర తదితరులు పాల్గొన్నారు

04/09/2023

ప్రజా సమస్యల పరిష్కరించాలని, అధిక ధరలు, విద్యుత్ చార్జీలను తగ్గించాలని, అంక భూపాలపురంలోని చింతమానుచేను భూములను దళితులకు ఇవ్వాలని కోరుతూ వలేటివారిపాలెం మండల తహసీల్దార్ ఆఫీస్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు మాదాల రమణయ్య అధ్యక్షత వహించారు .ఈధర్నాలో మండల ఇన్చార్జ్ జీవీబీ కుమార్ మాట్లాడారు, ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దువ్వూరి జాన్,పర్రె భాస్కరరావు డిఎం రాయుడు ,ఎం లాజర్, దార్ల మాల్యాద్రి ఎం ఆశీర్వాదం తదితరులున్నారు

04/09/2023
*అధిక ధరలు,కరెంట్ చార్జీలను తగ్గించాలని చింతమాను చేను భూములను దళితులకు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా,వినతి*     కేంద్...
04/09/2023

*అధిక ధరలు,కరెంట్ చార్జీలను తగ్గించాలని చింతమాను చేను భూములను దళితులకు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా,వినతి*
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల విస్మరించి, అధిక ధరలను కరెంట్ చార్జీలను పెంచుతూ ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నాయని సిపిఎం వలేటివారిపాలెం మండల ఇన్చార్జి జీవీబీకుమార్ విమర్శించారు.
సోమవారం నాడు సిపిఎం ఆధ్వర్యంలో వలేటివారిపాలెం తహసిల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా జరిగింది. ధర్నాకు సిపిఎం మండల కార్యదర్శి మాదాల రమణయ్య అధ్యక్షత వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న సిపిఎం నేత జీవీబీకుమార్ మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచబోము, ధరలు తగ్గిస్తాము, ఉద్యోగాలు ఇస్తాము అన్న పాలకులు ఆచరణలో తమ వాగ్దానాలను విస్మరించి ప్రజలపై భారాలు వేయటం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల కాలంలో 7సార్లు కరెంట్ చార్జీలను పెంచిందన్నారు. సర్ చార్జీలు,ట్రూ అప్, అదనపు చార్జీల పేరుతో మూడు రెట్లు రేట్లు పెంచింది అన్నారు. ఇది సరికాదు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. నిత్యవసర ధరలను అదుపు చేయాలని కోరారు. అంకభూపాలపురంలో 1984లో అప్పటి ప్రభుత్వం 60ఎకరాలు దళితులకు డీకే పట్టాలు ఇచ్చిందని, కానీ ఆన్లైన్లో అగ్రవర్ణ రైతుల పేర్లు ఆ పొలాలలో ఉన్నారని అన్నారు. స్థానిక రెవిన్యూ అధికారులు జోక్యం చేసుకొని రిసర్వే లో ఈ భూములన్నీ దళితులకి చెందేటట్లు చేయాలని కోరారు. అనంతరం మండల తహసిల్దార్ కె వి బి టి సుందరమ్మ కు వినతి పత్రం ఇచ్చి సమస్యని వివరించారు. వెంటనే విచారణ జరిపి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు దువ్వూరి జాన్, డిఎం రాయుడు,పర్రె భాస్కరరావు, దార్ల మాల్యాద్రి మంగి.లాజరు, మల్లెల అంకయ్య ,ఎం ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు

*గిరిజనులుసమస్యలతోపాటు అధిక ధరలు,కరెంటు చార్జీలను తగ్గించాలని పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో తహసిల్దార్ ఆఫీస్ వ...
04/09/2023

*గిరిజనులుసమస్యలతోపాటు అధిక ధరలు,కరెంటు చార్జీలను తగ్గించాలని పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో తహసిల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా*
ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆగస్టు 30వ తేదీ నుండి సెప్టెంబరు 4వరకు ఉలవపాడు లో సమరభేరి జరిగింది. సిపిఎం నాయకులు అన్నీ గిరిజన కాలనీలు తిరిగి కరపత్రాలు పంచి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఈరోజు సెప్టెంబర్ 4న తహసిల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు .
ఈధర్నా కు సిపిఎం మండల నాయకులు ఎస్.డి.గౌస్ బాషా అధ్యక్షత వహించారు. ధర్నాలో పాల్గొన్న సిపిఎం మండల కార్యదర్శి జీవీబీకుమార్ మాట్లాడుతూ స్థానిక సమస్యలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా నిత్యవసర ధరలు, కరెంట్ చార్జీలు పెరిగి ప్రజలపై తీవ్రమైన బారాలు పడ్డాయని పేర్కొన్నారు. పేద ప్రజలపై భారాలు -కార్పొరేట్లకు వరాలు అన్నచందంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, ఇది మారాలని ప్రజా ఉద్యమాలతోనే సాధ్యమని పేర్కొన్నారు. అనంతరం తహసిల్దారు బ్రహ్మయ్య తో సమస్యలపై చర్చించారు
ఈ ధర్నా లో సిపిఎం మండల నాయకులు
కొమరగిరి. వెంకటేశ్వర్లు,ఏలూరి. నాగార్జున, కే.శేషమ్మ,పొట్లూరి. రవి,ఎస్. డి. జహీర్, ఎస్.కె.సుల్తాన్, రాపూరి ఎలమందమ్మ, చేవూరు లక్ష్మి, చేవూరి నాగమ్మ, ఆర్ అనసూయమ్మ తదితరులు ఉన్నారు

*అంకభూపాలపురం చింతమాను చేను భూములను దళితులకు ఇవ్వాలి*సిపిఎం డిమాండ్.       వలేటివారిపాలెం మండలం రామ చంద్ర పురం రెవెన్యూ ...
03/09/2023

*అంకభూపాలపురం చింతమాను చేను భూములను దళితులకు ఇవ్వాలి*
సిపిఎం డిమాండ్.
వలేటివారిపాలెం మండలం రామ చంద్ర పురం రెవెన్యూ గ్రామంలోని అంక భూపాలపురంలోని సర్వేనెంబర్ 192,193 ,194 లలో ఉన్న 60ఎకరాల భూమిని 1984లో అప్పటి ప్రభుత్వం దళితులకు పట్టాలు ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం ఆభూమిని గ్రామంలోని అగ్రవర్ణ రైతులు ఆక్రమించుకొని సాగు చేసుకున్నారని సిపిఎం వలేటివారిపాలెం మండల ఇన్చార్జి జివిబి కుమార్ పేర్కొన్నారు.
ఆదివారం నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న సమరభేరి కార్యక్రమంలో భాగంగా అంక భూపాలపురం ఎస్సీ కాలనీలో సిపిఎం నాయకులు పర్యటన చేశారు. కరపత్రాలను పంచారు. ఎస్సీ కాలనీలో జెండా సెంటర్ వద్ద దళితులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సెంటు భూమి లేకుండా రెక్కల కష్టంతో బ్రతుకుతున్న దళితులకు 1984లో ప్రభుత్వ ఇచ్చిన భూములను అగ్రవర్ణ రైతులు ఆక్రమించుకొని, సాగు చేసుకుంటూ దళితులను నానా ఇబ్బందులు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈ సమస్యపై అనేక దఫాలుగా రెవిన్యూ అధికారులను కలిసి సమస్యను వివరించినా, ఏమాత్రం సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. రెవిన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు దళితులకు ఇచ్చిన భూములను వారిని సాగు చేసుకోనివ్వకుండా అడ్డుపడితే ఆపాల్సిఉంటే చోద్యం చూస్తున్నారు అని పేర్కొన్నారు. దళితుల భూములను అక్రమంగా ఆక్రమించుకున్న అగ్రవర్ణ రైతులపై కేసులు నమోదు చేసి, ఆ భూములను దళితులకు ఇవ్వాలని, దళితులు ఆ భూములను సాగు చేసుకునేటట్లు తోడ్పడాలని కోరారు. లేనట్లయితే దళితులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం వలేటివారిపాలెం మండల నాయకులు దువ్వూరి జాన్ సాధు చెన్నకేశవులు,స్థానికులు అత్యాల. యాకోబు, మల్లెల. అంజయ్య, మంగి. లాజర్, మంగి.సురేష్,డొక్కా.చిన నరసయ్య,మంగి. కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న సమరభేరి కార్యక్రమంలో భాగంగా ఉలవపాడు పంచాయితీ లోని గిరిజనులు ఎద...
01/09/2023

ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న సమరభేరి కార్యక్రమంలో భాగంగా ఉలవపాడు పంచాయితీ లోని గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రామ సచివాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాజశేఖర్ రెడ్డి కి వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం ఉలవపాడు మండల కార్యదర్శి జీవీబీకుమార్ మాట్లాడుతూ గత మూడు రోజులుగా ఉలవపాడులో సిపిఎం ఆధ్వర్యంలో సమరభేరి కార్యక్రమం పేరుతో ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగిందని అన్నారు. అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. గత రెండు, మూడు తరాలుగా నివాసం ఉంటున్న గిరిజనులకు ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, వరిగ చేను సంఘం లో గిరిజనుల ఇళ్లపై కరెంట్ తీగలు వేలాడుతూ ఉన్నాయని,భయంతో బ్రతకాల్సి వస్తుందని,కరెంటు వైర్లు సరి చేయాలని ఎలక్ట్రిసిటీ అధికారులను కోరారు, గ్రామ ప్రజలందరూ వదిలిన వ్యర్థాలు, డ్రైనేజీ రూపంలో కోటిరెడ్డి కుంట రోడ్డు ప్రక్కనే డ్రైనేజీ అంతా పేరుకుపోయి ఉందని, కాలువ బ్లాక్ అయిందని దోమలతో రాత్రి పూట నిద్రపోవడానికి వీలు లేకుండా ఉందని అన్నారు, శాశ్వతంగా డ్రైనేజీ కాల్వ ను నిర్మించాలని కోరారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు. లేనట్లయితే ప్రజలందరినీ సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ వినతి పత్రం ఇచ్చిన వారిలో సిపిఎం మండల నాయకులు
ఎస్.డి గౌస్ బాషా,ఏలూరి. నాగార్జున, రాపూరి. కోటేశ్వరరావు, ఎస్.కె.సుల్తాన్ తదితరులు ఉన్నారు

అధిక ధరలను అదుపు చేయాలని, పెంచిన కరెంట్ చార్జీలు తగ్గించాలని,శంకర నగర్ కాలనీ గిరిజనులకు కేటాయించిన స్మశాన స్థలం ఆక్రమణకు...
31/08/2023

అధిక ధరలను అదుపు చేయాలని, పెంచిన కరెంట్ చార్జీలు తగ్గించాలని,శంకర నగర్ కాలనీ గిరిజనులకు కేటాయించిన స్మశాన స్థలం ఆక్రమణకు గురికాకుండా చూడాలని కోరుతూ సమరభేరి కార్యక్రమంలో భాగంగా సిపిఎం ఉలవపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో మన్నేటికోట గ్రామంలోని శంకర నగర్ గిరిజన కాలనీలో ప్రచార కార్యక్రమం లో గిరిజనులను ఉద్దేశించి మాట్లాడుతున్న మండల కార్యదర్శి జీవీబీ కుమార్,పాల్గొన్న నాయకులు ఎస్. డి. గౌస్ భాషా, కత్తి. అంకమ్మ, చౌటూరి.పోలయ్య,కత్తి. శ్రీను తదితరులు పాల్గొన్నారు

Address

Kandukuru

Website

Alerts

Be the first to know and let us send you an email when CPM Kandukur Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share