15/08/2026
పేదలకు మంచి చేయాలన్నదే చంద్రబాబు తపన - MP Vemireddy Prabhakar Reddy గారు
అభివృద్ధి, సంక్షేమం మీ కళ్ళముందే కనిపిస్తోంది
నిధులు తేవడంలో ఎమ్మెల్యే ఇంటూరి తర్వాతే ఎవరైనా
పెదపట్టపుపాలెంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే Inturi Nageswara Rao గారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా తీర్పు ఇవ్వాలని ఎమ్మెల్యే పిలుపు
👉 ఉలవపాడు మండలం పెద్దపట్టపుపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం ప్రారంభోత్సవం చేశారు.
👉 గ్రామ సమీపంలోని బకింగ్ హామ్ కాలువపై 20 లక్షల రూపాయల సొంత నిధులతో ఎంపీ వేమిరెడ్డి బ్రిడ్జి నిర్మించారు. అలాగే 20.5 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణం జరగగా, రెండింటిని నేతలిద్దరూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఊరంతా ఒక్కటై, అభిమాన నేతలకు ఘన స్వాగతం పలికారు.
MP ప్రభాకరరెడ్డి గారు మాట్లాడుతూ....
👉 పెదపట్టపుపాలెం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. గ్రామ పెద్దలు అడిగిన వెంటనే 20 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించాను. ఈరోజు బ్రిడ్జిని చూస్తుంటే, స్థానికులకు ఎంతో మేలు చేశానన్న సంతోషం ఎక్కువగా కలుగుతోంది. ఎంపీ లాండ్స్ ద్వారా నియోజకవర్గానికి 1.35 కోట్లు మంజూరు చేయడం జరిగింది.
👉 ముఖ్యమంత్రి చంద్రబాబుకు పేదలంటే తపన. వారికి మేలు చేయడానికి రోజుకు 20 గంటలు కష్టపడుతున్నారు. అమరావతి నిర్మాణం గురించి ప్రపంచ స్థాయిలో చర్చ జరుగుతోంది. రాబోయే మూడేళ్లలో మనకు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి.
👉 స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నిస్వార్ధమైన ప్రజా సేవకుడు. పట్టుదలతో ముఖ్యమంత్రిని మంత్రులను ఒప్పించి నిధులు తీసుకురావడంలో దిట్ట. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే కావడం మీ అదృష్టం. రెండేళ్ల నుంచి చూస్తున్నాను... అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే పనిచేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం మీ కళ్ళముందు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరంతా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
*MLA నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ.....*
👉 ఎంపీ వేమిరెడ్డి గారి దాతృత్వం, మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నియోజకవర్గంలో ఎంతోమంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు ఇచ్చారు. అనేక గ్రామాలలో వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేశారు. కృష్ణాపురం వద్ద బ్రిడ్జికి 40 లక్షలు మంజూరు చేశారు. ఏది అడిగినా కాదనకుండా సహాయం చేసే మంచి మనసున్న వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు.
👉 కూటమి ప్రభుత్వంలో పెద్దపట్టపుపాలెం గ్రామం బాగా అభివృద్ధి చెందింది. పల్లె పండుగ ద్వారా 60 లక్షలతో సిసి రోడ్లు వేయించాం. 38 లక్షల పంచాయతీ, మండల పరిషత్ నిధులతో 17 పనులు చేపట్టడం జరిగింది. చెరువుకు నీరు వచ్చే ఎలికేరు కాలువను అభివృద్ధి చేశాం.
👉 సంక్షేమం విషయానికి వస్తే... మత్స్యకార భరోసా ద్వారా 884 మందికి 1.8 కోట్లు, అన్నదాత సుఖీభవ ద్వారా 437 మందికి 87.5 లక్షలు, ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా 15 మంది, ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా 25 మందికి 20 లక్షలు అందజేయడం జరిగింది.
👉 ఈ మంచి పనులన్నీ ప్రజలు గుర్తుంచుకోవాలని, రాబోయే ఎందుకల్లో 12 పంచాయతీలను గెలుచుకునేలా కష్టపడాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు రాచగర్ల సుబ్బారావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు తూపిలి రమేష్, క్లస్టర్ ఇంచార్జ్ ఆవుల వాసు, స్థానిక నాయకులు ప్రళయకావేరి రామమూర్తి, ఊటుకూరి రాంబాబు, పుల్లా వెంకట్ రెడ్డి, వెయ్యాల అశోక్, గ్రామ కాపులు, పెద్దలు పాల్గొన్నారు.