09/09/2020
చైన్ లాగితే కదిలిన దొంగల డొంక
మాములు గొలుసు దొంగతనం కేసును చేధించి గొలుసుతో పాటు గతంలో దొంగిలించిన నాలుగు ద్విచక్ర వాహనాలను కూడా పట్టుకున్న కారంపూడి ఎస్సై గల్లా రవికృష్ణ మరియు సిబ్బంది
వివరాల్లోకి వెళ్తే.
గుంటూరు జిల్లా కారంపూడి మండల పరిధిలో గల శ్రీ చక్ర సిమెంటు ఫ్యాక్టరీ సమీపంలో నివాస ముంటున్న ఔతు కృష్టకుమారి అనే మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు గుర్తు తెలియని దుండగులు వచ్చి దొంగిలించారని ఔతు కృష్ణకుమారి ఆమె భర్త. శివరామిరెడ్డి కారంపూడి పొలీస్టేషన్లో పిర్యాదు చెయ్యగా కేసు దర్యాఫ్తులో భాగంగా కారంపూడి ఎస్సై గల్లా రవికృష్ణ తన సిబ్బంది తో పాటు ముగ్గురు వ్యక్తులు ని మరియూ ఒక పిల్లవాడు ని పట్టుకొని విచారించగా
తాము గతంలో కూడా పలు దొంగతనాలు చేసినట్లు అంగకరించారు . బంగారు గోలుసు తో పాటు నాలుగు బైక్ లను స్వాధీన పర్చుకున్నారు.
వారు పేర్లు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.....
( 1)తమ్మిశెట్టి గోపి %తండ్రి. వీరంజనేయూలు. కులము వడ్డెర. ఇస్సాయపాలెం గ్రామం నరసరావుపేట మండలం గుంటూరు జిల్లా
(2) షేక్ నాగార్జున. %తండ్రి. లాల్ సాహెబ్ కులం దూదేకుల. బరంపేట. నరసరావుపేట టౌన్, గుంటూరు జిల్లా
(3) మల్లెల వెంకట కోటేశ్వరరావు .%తండ్రి రామారావు. కులం తెలగ. పమిడిపాడు గ్రామం నరసరావుపేట మండలం గుంటూరు జిల్లా
(4) నిమ్మల మధు.% తండ్రి .కోటేశ్వరరావు. కులం ముదిరాజు. బీసీ కాలనీ నరసరావుపేట టౌన్. కేవలం దొంగతనం జరిగిన 3 రోజుల వ్యవధిలోనే గొలుసు దొంగతతనం కేసును ఛేదించి దొంగల ముఠా ని పట్టుకొని వారు దింగిలించిన బంగారు గొలుసు మరియు గతములో దొంగిలించిన నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం పర్చుకున్నారు
మూడు రోజుల్లో దొంగతనం కేసు చేధించి దొంగల ముఠా ని పట్టుకున్న కారంపూడి ఎస్సై గల్లా రవికృష్ణ మరియు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.