04/09/2026
27 ఏళ్ల తర్వాత బాల్య స్నేహితుల అపూర్వ కలయిక
* ఆనందాన్ని పేద విద్యార్థులతో పంచుకున్న పూర్వ విద్యార్థులు
* ఏబీఎం హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ గెట్ టుగెదర్ – సంతోషానికి సేవా కార్యక్రమం జోడించిన కేసవరపు. యేసురత్నం గారు
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఏబీఎం హైస్కూల్లో 1998–99 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు సుమారు 27 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకుని ఆత్మీయ గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా అప్పట్లో తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు, పూర్వ విద్యార్థులు, తోటి విద్యార్థులు, చిన్ననాటి స్నేహితులు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల అనంతరం ఒకరినొకరు కలుసుకోవడంతో కార్యక్రమం మొత్తం ఆనందం, ఉత్సాహం, ఆత్మీయతతో నిండిపోయింది. చిన్ననాటి స్నేహబంధాలు కాలం గడిచినా చెక్కుచెదరలేదని ఈ కలయిక మరోసారి చాటిచెప్పింది.
�