04/09/2026
దండుపాలెం బ్యాచ్ రేవంత్ రెడ్డి. 1,000 రోజుల సంబరాలు ఎందుకు? ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు మిస్ Hemaa Sudarshan Jilloju గారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తయిందని సంబరాలు చేసుకోవడం కంటే, 420 హామీలు, 6 గ్యారెంటీల అమలుపై ప్రజలకు లెక్క చెప్పాలని ఆప్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు మిస్ హేమా సుదర్శన్ జిల్లోజు గారు డిమాండ్ చేస్తోంది. ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రాజెక్టు, హైడ్రా, భూసేకరణ, బుల్లెట్ ట్రైన్, రీజినల్ రింగ్ రోడ్ వంటి భారీ ప్రాజెక్టుల పేరుతో భూములు, ప్రజల ఆస్తుల విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటిపై ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వివరాలు వెల్లడించాలి. ప్రజలకు ఉద్యోగాలు, రైతు భరోసా, మహిళలకు హామీలు, విద్య, వైద్యం, ఇళ్ల విషయంలో ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలి. మరోవైపు మూసీ ప్రాజెక్టులో భూముల సేకరణపై న్యాయపరమైన వివాదాలు కూడా కొనసాగుతున్నాయి. 1,000 రోజుల సంబరాలు ప్రజల కోసం చేసిన పాలనకు గుర్తుగా ఉండాలే తప్ప, అధికార ప్రచారానికి వేదిక కాకూడదు.
ప్రతి హామీకి అమలు స్థితి
ప్రతి భూసేకరణకు పూర్తి వివరాలు
ప్రతి భారీ ప్రాజెక్టుకు ఖర్చు–ప్రయోజనాల లెక్కలు
ప్రజల ఆస్తులకు పూర్తి రక్షణ
ప్రభుత్వం వెంటనే “1,000 రోజుల పాలనపై ప్రజా శ్వేతపత్రం” విడుదల చేయాలని ఆప్ తెలంగాణ అధ్యక్షురాలు మిస్ హేమా గారు డిమాండ్ చేస్తోంది.