Bhadradri Kothagudem District Police

Bhadradri Kothagudem District Police For any crime related complaints, you may visit concerned PS

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిల్మ్ పోటీలలో పోలీస...
15/10/2025

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిల్మ్ పోటీలలో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలకు సంబంధించి ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిల్మ్ లను ఈ నెల 22 లోపు పోలీస్ పిఆర్వో (8712682121)కు అందజేయాలి:ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.జిల్లా వ్యాప్తంగా ప...
15/10/2025

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో నెల రోజుల పాటు చైతన్యం పేరుతో పలు కార్యక్రమాలను చేపడుతున్నాం :*ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ Telangana State Police

చర్ల మండలంలోని మావోయిస్టు ప్రభావిత గ్రామమైన ఎర్రంపాడు గ్రామాన్ని సందర్శించి అక్కడ నివసిస్తున్న 250 కుటుంబాలకు చర్ల పోలీస...
15/10/2025

చర్ల మండలంలోని మావోయిస్టు ప్రభావిత గ్రామమైన ఎర్రంపాడు గ్రామాన్ని సందర్శించి అక్కడ నివసిస్తున్న 250 కుటుంబాలకు చర్ల పోలీసుల ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన ఓఎస్డి నరేందర్ మరియు భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్ గార్లు State Police

Every child has a spark. At Young India Police School, we nurture it into brilliance.Admissions Open for Grades 1 - 6.Th...
03/10/2025

Every child has a spark. At Young India Police School, we nurture it into brilliance.

Admissions Open for Grades 1 - 6.
The future begins here!

For more: yipschool.in / +91 90591 96161

Telangana State Police

దేవీ నవరాత్రులలో భాగంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలలో పాల్గొన్న జ...
26/09/2025

దేవీ నవరాత్రులలో భాగంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

*జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు**చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి సందర్బంగా వారి చిత్రపట...
26/09/2025

*జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు*

*చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్*

ఈ రోజు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి సందర్బంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఘనంగా నివాళులు అర్పించారు.ఎస్పీ గారితో పాటు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని,భూమి కోసం,భుక్తి కోసం వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ గారు ప్రదర్శించిన తెగువ,పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని,ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కోన్నారు.ఇలాంటి పోరాట యోధుల ఆశయాల సాధన కొరకు ప్రతి ఒక్కరూ భాద్యతగా నడుచుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,ఆర్ఐలు సుధాకర్,నరసింహారావు,రవి,లాల్ బాబు,కృష్ణారావు మరియు తదితరులు పాల్గొన్నారు.

*పోలీస్ శాఖలో పనిచేసే డ్రైవర్లు నిత్యం తమ వాహనాల కండీషన్ ను తనిఖీ చేసుకుంటూ ఉండాలి**పోలీసు వాహనాలను తనిఖీ చేసిన జిల్లా ఎ...
26/09/2025

*పోలీస్ శాఖలో పనిచేసే డ్రైవర్లు నిత్యం తమ వాహనాల కండీషన్ ను తనిఖీ చేసుకుంటూ ఉండాలి*

*పోలీసు వాహనాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్*

ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా పోలీస్ శాఖలో వినియోగిస్తున్న వాహనాలను తనిఖీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఇట్టి వాహనాల డ్రైవర్లకు పలు సూచనలను చేశారు.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే క్రమంలో వాహనాల కండిషన్ ఎప్పటికప్పుడు మంచిగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.విధుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని,డ్రైవింగ్ చేసే సమయాల్లో పాటించే నియమ నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని తెలిపారు.అకస్మాత్తుగా వాహనం ఆగిపోయినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి అట్టి ఆటంకాలను నివృత్తి చేసుకోగలిగేలా కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు.క్రమశిక్షణతో,నిబద్ధతతో పని చేసే వారికి పోలీస్ శాఖలో మంచి పేరు లభిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ మోటారు వాహనాల అధికారి సుధాకర్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, హోమ్ గార్డ్స్ ఆర్ఐ నరసింహారావు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు మరియు ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

గ్రేవ్ కేసుల్లో నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడే విధంగా భాద్యతగా పనిచేయాలినేను సైతం కార్యక్రమంలో భాగంగా సీసి కెమెరాల ఏర్పా...
25/09/2025

గ్రేవ్ కేసుల్లో నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడే విధంగా భాద్యతగా పనిచేయాలి

నేను సైతం కార్యక్రమంలో భాగంగా సీసి కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వాములను చేయాలి

అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

చాతకొండ TSSP 6వ బెటలియన్ నందు పలు సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ అడిషనల్ డీజిపి,బెటాలియన...
24/09/2025

చాతకొండ TSSP 6వ బెటలియన్ నందు పలు సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ అడిషనల్ డీజిపి,బెటాలియన్స్ సంజయ్ కుమార్ జైన్ ఐపిఎస్ గారికి స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ Telangana State Police

*కోడిపందాలు,పేకాట,బెట్టింగులు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి**రోడ్డు ...
23/09/2025

*కోడిపందాలు,పేకాట,బెట్టింగులు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి*

*రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్*

*దుమ్ముగూడెం,బూర్గంపాడు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్*

ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు దుమ్ముగూడెం మరియు బూర్గంపాడు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు.పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలించారు.అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.నిత్యం ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.కోడిపందాలు,పేకాట,బెట్టింగు లు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.అంతర్రాష్ట్ర దొంగల ముఠాల కదలికలపై నిఘా పెంచి దొంగతనాల కట్టడికి కృషి చేయాలని అన్నారు.పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ ప్రమాద నివారణ చర్యలను చేపట్టాలని సూచించారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతీ ప్రదేశంలో "నేను సైతం" కార్యక్రమంలో భాగంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించేలా అవగాహనా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని తెలిపారు.గంజాయి వంటి మత్తు పదార్దాలను అక్రమంగా రవాణా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి సేవించే ప్రదేశాలను గుర్తించి,నిత్యం అట్టి ప్రదేశాలలో పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు.

*సైబర్ నేరాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి : కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్**లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన...
22/09/2025

*సైబర్ నేరాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి : కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్*

*లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదురుగడ్డ గ్రామంలో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం*

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదురుగడ్డ గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం ను నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా మొత్తం సుమారుగా 250 ఇండ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. సరిగా పత్రాలు లేకుండా నెంబర్ ప్లేట్లు లేని 100 ద్విచక్ర వాహనాలను,08 ఆటోలను సీజ్ చేయడం జరిగింది.సుమారుగా 20,000/- రూపాయల విలువగల మద్యం బాటిళ్లను స్వాదీనం చేసుకుని అక్రమంగా బెల్ట్ షాపులను నడుపుతున్న 05 గురు వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగింది.అదే విధంగా ఈ తనిఖీలలో అక్రమంగా నిల్వ ఉంచిన 128 గ్యాస్ సిలిండర్లను స్వాదీనం చేసుకుని కనకరాజు అను వ్యక్తిపై కేసు నమోదు చేశారు.2000/- రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసి కేసులు నమోదు చేయడమైనది.అనంతరం అక్కడ ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట వ్యతిరేక మరియు సాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు.తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.మట్కా,జూదం,బెట్టింగ్,గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడమైనదని తెలిపారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేసారు.విపత్కర సమయాల్లో ఆపదలో ఉన్నప్పుడు డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలను పొందాలని తెలిపారు.సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.నేరాల నియంత్రణ కొరకు తమ నివాస ప్రాంతాలలో సీసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.మద్యం సేవించి వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దని,ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సుమారుగా 100 మందికి పైగా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం 2టౌన్ సీఐ ప్రతాప్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,1టౌన్ సీఐ కరుణాకర్,3టౌన్ సీఐ శివప్రసాద్ మరియు ఎస్సైలు రమణా రెడ్డి,భాదవత్ రవి,సిబ్బంది పాల్గొన్నారు.

*మర్డర్ కేసుల్లోని నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మరియు కోర్టు డ్యూటీ అధికారులను అభినంది...
22/09/2025

*మర్డర్ కేసుల్లోని నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మరియు కోర్టు డ్యూటీ అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్*

అశ్వరావుపేట,మణుగూరు మరియు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో నమోదైన మర్డర్ కేసుల్లోని నేరస్తులకు శిక్షలు పడే విధంగా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మరియు కోర్టు డ్యూటీ అధికారులను ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు ఈ రోజు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.అదేవిధంగా లోక్ అదాలత్ ద్వారా అత్యధికంగా కేసుల పరిష్కారంలో ప్రతిభ కనబరిచిన చుంచుపల్లి మరియు సుజాత నగర్ కోర్టు డ్యూటీ అధికారులను కూడా ఈ సందర్భంగా అభినందించారు.పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవిడి లక్ష్మీ,అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసీక్యూటర్స్ లావణ్య,విశ్వశాంతి,రాజారావు గార్లను,మణుగూరు కోర్టు డ్యూటీ అధికారి అశోక్,కొత్తగూడెం 3టౌన్ కోర్ట్ డ్యూటీ అధికారి హేమీలాల్ మరియు అశ్వారావుపేట కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ నాగేశ్వరరావు లను మర్డర్ కేసుల్లోని నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసినందులకు గాను మరియు సుజాతనగర్ కోర్ట్ డ్యూటీ అధికారి మోహన్,కొత్తగూడెం 3టౌన్ పిఎస్ JFCM కోర్ట్ డ్యూటీ అధికారి శోభన్ లను ఇటీవల లోక్ అధాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేసినందుకు శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,3టౌన్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్,కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ ఎస్సై రాఘవ మరియు తదితరులు పాల్గొన్నారు.

Address

Kothagudem

Telephone

+918744242097

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhadradri Kothagudem District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhadradri Kothagudem District Police:

Share