Telugu Desam Party: Kovvur

Telugu Desam Party: Kovvur Official Page of TDP Kovvur

స్పోర్ట్స్ కోటా ఎంపికల్లోఎలాంటి అవకతవకలు లేవు..
07/09/2026

స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో
ఎలాంటి అవకతవకలు లేవు..







07/09/2026

భార్యాభర్తలు అన్న కారణంతో ఇద్దరినీ ఉద్యోగాల్లోకి తీసుకోకూడదా జగన్ రెడ్డి. ఇద్దరూ ఒకే టోర్నమెంట్ లో మెడల్ గెలిచి ఉద్యోగాలు సాధించడం తప్పా..? స్పోర్ట్స్ సర్టిఫికెట్ లు పొంది.. జెన్యూన్ గా ఉద్యోగాలు తెచ్చుకోవడం తప్పంటావా..?







07/09/2026

కాయలు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు పడతాయి. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టే.. మెగా డీఎస్సీ నిర్వహించి వేలాది ఉద్యోగాలు ఇచ్చిన కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దయచేసి మా కష్టాన్ని అవమానించొద్దు. వేలాది ఉద్యోగాలు ఇచ్చిన సీఎం చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు మాకు దేవుళ్లతో సమానం.




డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేసి, చర్చకు రమ్మంటే రాకుండా పారిపోవడం జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలకు నిదర్శనం.
07/09/2026

డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేసి, చర్చకు రమ్మంటే రాకుండా పారిపోవడం జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలకు నిదర్శనం.







07/09/2026

*మాజీ సైనికుడి, ఉపాధ్యాయుడిపై 'సాక్షి' గూండాయిజం*

*పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై బురదజల్లడమే లక్ష్యంగా పాత్రికేయ ముసుగులో అరాచకాలు*

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించిన ఒక మాజీ సైనికుడిపై, సమాజానికి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడిపై 'సాక్షి' మీడియా ప్రతినిధులు సాగించిన అరాచకాన్ని, బరితెగింపు చర్యలకు పాల్పడుతోంది. ఉపాధ్యాయ దినోత్సవం నాడే, చిన్నారులకు పాఠాలు చెబుతున్న తరగతి గదిలోకి అక్రమంగా చొరబడి, చొక్కా పట్టుకుని ప్రాణభయం కలిగించేలా బెదిరించడం పాత్రికేయ విలువలకే మాయని మచ్చ. ఇది జర్నలిజం ముసుగులో సాగించిన రౌడియిజం, గూండాయిజం.

భారత సైన్యంలో హవల్దార్‌గా పనిచేసి రిటైర్ అయిన వి. చక్రపాణి రెడ్డి గారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, రోజుకు 16 గంటలకు పైగా కష్టపడి చదివి, మెగా డీఎస్సీలో ప్రతిభ ఆధారంగా, నిబంధనల ప్రకారం ఎక్స్-సర్వీస్‌మెన్ కోటాలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. కుప్పం మండలం నడిమూరు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా తన విధులను నిబద్ధతతో నిర్వహిస్తుంటే, రాజకీయ దురుద్దేశంతో ఆయనపై కక్షగట్టి వేధించడం క్షమార్హం కాని నేరం. అక్రమంగా పాఠశాలలోకి ప్రవేశించి, సర్టిఫికెట్లు చూపించకపోతే తప్పుడు వార్తలు రాస్తామని బ్లాక్‌మెయిల్ చేయడం, విద్యార్థుల ముందే చొక్కా కాలర్ పట్టుకుని భౌతిక దాడికి దిగడం సమాజం తలదించుకునే దుశ్చర్య.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, అవినీతి లేకుండా, కేవలం మెరిట్ ప్రాతిపదికన నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాలపై విషం చిమ్మాలనే దుగ్ధతోనే ఈ విధమైన కుట్రలకు తెరలేపారు. కష్టపడి మెరిట్‌తో ఉద్యోగాలు సాధించిన సామాన్యులను మానసికంగా క్షోభకు గురిచేసి, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు 'సాక్షి' పత్రిక, ఛానల్ ఎంతటి నీచానికైనా దిగజారుతున్నాయనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం.

దేశానికి సేవలందించిన సైనికుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, తరగతి గది పవిత్రతను కాలరాసిన సాక్షి రిపోర్టర్ గణేష్, కెమెరామన్ శ్రీకాంత్‌లపై చట్టప్రకారం చర్యలు.




07/09/2026

15 సంవత్సరాల నుంచి డీఎస్సీ ఉద్యోగం కోసం కష్టపడుతున్నా. మెగా డీఎస్సీలో ఉద్యోగం సాధించా. డీఎస్సీ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయి. వైసీపీ వాళ్ళు జనంలో పబ్లిసిటీ కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ గారిని బదనాం చేయడానికే గొడ్డలి పార్టీ విమర్శలు చేస్తోంది. వాళ్లకు దమ్ముంటే ఆయన సవాలును స్వీకరించి చర్చకు వెళ్ళాలి.




🚨BIG EXPOSE🚨 On  TODAY at 5 PMSTAY TUNED.
07/09/2026

🚨BIG EXPOSE🚨 On
TODAY at 5 PM

STAY TUNED.


07/09/2026

మెగా డీఎస్సీ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయి. బీసీ-బీ రిజర్వేషన్ ఉన్నా నేను ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం సాధించా. దీని కోసం ఏడాది పాటు హాస్టల్లో ఉండి కష్టపడి చదివా. దయచేసి మా కష్టాన్ని అవహేళన చెయ్యొద్దు.




•రాష్ట్రంలో ప్రతి నెల జరిగే పేదల పండుగను ప్రభుత్వం మరింత విస్తరించనుంది. ఇప్పటికే 62 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లు...
07/09/2026

•రాష్ట్రంలో ప్రతి నెల జరిగే పేదల పండుగను ప్రభుత్వం మరింత విస్తరించనుంది. ఇప్పటికే 62 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లు అందిస్తున్న కూటమి ప్రభుత్వం, అర్హులైన మరింత మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు సిద్ధమైంది

•మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నుంచి రెండు రోజుల పాటు ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి నాయకులకు లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ నిర్వహించనున్నారు

•ఏపీ పర్యాటక రంగానికి కేంద్రం మరో ఊతమిచ్చింది. స్వదేశ్ దర్శన్ 2.0, ప్రసాద్ పథకాల కింద రూ.419.30 కోట్లతో అరకు, అరసవల్లి, గన్నవరం, వేదగిరి ప్రాంతాల అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది

•తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ సీవోవో అడుసుపల్లి గోపినాయుడు కుటుంబ సభ్యులను, అలాగే ఇటీవల మరణించిన టీడీపీ సీనియర్ నేత చెరుకూరి వసంతకుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు

•నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవాలు సోమవారం జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/YqO66



ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించిన సీఎం చంద్రబాబు వారి డిమాండ్లను నెరవేరుస్తూ, సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ఉద్యోగ స...
06/09/2026

ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించిన సీఎం చంద్రబాబు వారి డిమాండ్లను నెరవేరుస్తూ, సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ఉద్యోగ సంఘాలు హర్షం ప్రకటించాయి.


Address

Kovvur

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Kovvur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Kovvur:

Shortcuts

Share