07/09/2026
*మాజీ సైనికుడి, ఉపాధ్యాయుడిపై 'సాక్షి' గూండాయిజం*
*పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై బురదజల్లడమే లక్ష్యంగా పాత్రికేయ ముసుగులో అరాచకాలు*
దేశ సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించిన ఒక మాజీ సైనికుడిపై, సమాజానికి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడిపై 'సాక్షి' మీడియా ప్రతినిధులు సాగించిన అరాచకాన్ని, బరితెగింపు చర్యలకు పాల్పడుతోంది. ఉపాధ్యాయ దినోత్సవం నాడే, చిన్నారులకు పాఠాలు చెబుతున్న తరగతి గదిలోకి అక్రమంగా చొరబడి, చొక్కా పట్టుకుని ప్రాణభయం కలిగించేలా బెదిరించడం పాత్రికేయ విలువలకే మాయని మచ్చ. ఇది జర్నలిజం ముసుగులో సాగించిన రౌడియిజం, గూండాయిజం.
భారత సైన్యంలో హవల్దార్గా పనిచేసి రిటైర్ అయిన వి. చక్రపాణి రెడ్డి గారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, రోజుకు 16 గంటలకు పైగా కష్టపడి చదివి, మెగా డీఎస్సీలో ప్రతిభ ఆధారంగా, నిబంధనల ప్రకారం ఎక్స్-సర్వీస్మెన్ కోటాలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. కుప్పం మండలం నడిమూరు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా తన విధులను నిబద్ధతతో నిర్వహిస్తుంటే, రాజకీయ దురుద్దేశంతో ఆయనపై కక్షగట్టి వేధించడం క్షమార్హం కాని నేరం. అక్రమంగా పాఠశాలలోకి ప్రవేశించి, సర్టిఫికెట్లు చూపించకపోతే తప్పుడు వార్తలు రాస్తామని బ్లాక్మెయిల్ చేయడం, విద్యార్థుల ముందే చొక్కా కాలర్ పట్టుకుని భౌతిక దాడికి దిగడం సమాజం తలదించుకునే దుశ్చర్య.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, అవినీతి లేకుండా, కేవలం మెరిట్ ప్రాతిపదికన నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాలపై విషం చిమ్మాలనే దుగ్ధతోనే ఈ విధమైన కుట్రలకు తెరలేపారు. కష్టపడి మెరిట్తో ఉద్యోగాలు సాధించిన సామాన్యులను మానసికంగా క్షోభకు గురిచేసి, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు 'సాక్షి' పత్రిక, ఛానల్ ఎంతటి నీచానికైనా దిగజారుతున్నాయనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం.
దేశానికి సేవలందించిన సైనికుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, తరగతి గది పవిత్రతను కాలరాసిన సాక్షి రిపోర్టర్ గణేష్, కెమెరామన్ శ్రీకాంత్లపై చట్టప్రకారం చర్యలు.