Telugu Desam Party: Kovvur

Telugu Desam Party: Kovvur Official Page of TDP Kovvur

స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ రథం ప్రారంభంఆంధ్రప్రదేశ్‌ను పరిశుభ్రంగా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ‘స్వచ్ఛ ఆ...
28/02/2026

స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ రథం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ను పరిశుభ్రంగా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కొవ్వూరు నియోజకవర్గంలో ‘స్వచ్ఛ రథం’ వాహనాన్ని ప్రారంభించడం జరిగింది.

గ్రామాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ మరియు ఇతర వ్యర్థాలను సమూలంగా తొలగించి, ప్రజల్లో పారిశుద్ధ్యం – పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచాలనే సంకల్పంతో ఈ స్వచ్ఛ రథాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రజలు తమ వద్ద ఉన్న ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థాలను ప్రభుత్వం నిర్దేశించిన రేటుకు స్వచ్ఛ రథం వద్ద అందించి, అదే విలువకు నిత్యావసర వస్తువులు పొందవచ్చు.

ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా మారడమే కాకుండా, ప్రజలకు ప్రత్యక్ష లాభం కూడా చేకూరుతుంది. మన గ్రామాలు స్వచ్ఛ గ్రామాలుగా మారాలంటే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరుతున్నాను.

ఈ కార్యక్రమంలో కొటారు వెంకట్రావు గారు, కాకర్ల సత్యేంద్ర గారు, కూచిపూడి గణపతి గారు, కూచిపూడి లక్ష్మణరావు గారు, ఇండుగుల రామకృష్ణ గారు, కూచిపూడి హనుమంతురావు గారు, చెవ్వూరి రాము గారు, అన్నమరెడ్డి రమణ గారు, దండమూడి శేషు గారు, నామా నరేంద్ర గారు, కోర్లపాటి దత్తుడు గారు, కైగాల శ్రీను గారు, అన్నమారెడ్డి సత్తిబాబు గారు, అన్నమారెడ్డి సోమశేఖర్ గారు, తిగిరిపల్లి కనకరత్న గారు, మద్దూకూరి శంకరం గారు, ఉప్పులూరి రమేష్ గారు, దుగ్గిరాల జగదీశ్ గారు, కొప్పాక జోవహర్ గారు, ఎలుగుబంటి బాలకృష్ణ గారు, నీరుకొండ రమేష్ గారు, పాల చంద్రరావు గారు తదితర ఎన్‌డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

28/02/2026

మరో రోజు.. మరో పెట్టుబడి..

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్.

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెంలో బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. రూ. 2,300 కోట్ల పెట్టుబడితో రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్‌లో యూనిట్ ఏర్పాటు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు.




దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. రేపు సెలవు దినం కావడంతో, ఒక్క రోజు ముందుగానే రాష్ట్రమ...
28/02/2026

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. రేపు సెలవు దినం కావడంతో, ఒక్క రోజు ముందుగానే రాష్ట్రమంతటా పండగ వాతావరణంలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఉదయం 11 గంటలకే 80% పైగా పెన్షన్ల పంపిణీ పూర్తైంది.

మరికాసేపట్లో విజయనగరం జిల్లా రావివలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు గారు.

#పేదలసేవలో




• కష్టకాలంలో వెన్నంటి నిలిచిన పవన్ కళ్యాణ్ నాకు జీవితాంతం పెద్దన్నే.. "ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 "సదస్సులో ఐటీ ,విద్యాశాఖల...
28/02/2026

• కష్టకాలంలో వెన్నంటి నిలిచిన పవన్ కళ్యాణ్ నాకు జీవితాంతం పెద్దన్నే.. "ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 "సదస్సులో ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్ఠీకరణ

• ఈ ఏడాది చివరి నాటికి 10.6 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తాం.. వ్యవసాయం, హౌసింగ్ బడ్జెట్ పై సీఎం చంద్రబాబు

• ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ చేసి త్వరలో "మనమిత్ర 2.0 "ను ప్రారంభిస్తాం.. అసెంబ్లీలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• రూ 2,300 కోట్ల పెట్టుబడితో 1,750 మందికి ఉద్యోగాలు కల్పించే "బ్లూ జెట్ హెల్త్ కేర్" పరిశ్రమకు రాంబిల్లి సెజ్ లో నేడు శంకుస్థాపన చేయనున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• చీపురుపల్లిలో హెచ్ పీ వీ వాక్సినేషన్ , రావివలసలో ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాలలో నేడు పాల్గొననున్న సీఎం చంద్రబాబు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/Yjtac


27/02/2026

2019-2024 మధ్య తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది. రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు క్షమాపణ చెబుతున్నాను. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తిరుమలలో ప్రపంచ స్థాయి టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఈ మహాపాపంలో భాగస్వాములు అయిన నిందితులను ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. వారికి చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం. - నారా లోకేష్, రాష్ట్ర హెచ్చార్డీ మరియు ఐటీ శాఖా మంత్రి

27/02/2026

సవాళ్లను ఎదురించిన ధీశాలి.. వైసీపీ అరాచకపు అహంకారాన్ని బద్దలు కొట్టిన యోధుడు!


జగన్ నోట  'ప్రాజెక్టు కడతా', 'అభివృద్ధి చేస్తా' అన్న మాటలు వస్తే నిజమని ఎవరూ నమ్మరు.  అయినా నాలుగు సార్లు చెప్పేసరికి ఒక...
27/02/2026

జగన్ నోట 'ప్రాజెక్టు కడతా', 'అభివృద్ధి చేస్తా' అన్న మాటలు వస్తే నిజమని ఎవరూ నమ్మరు. అయినా నాలుగు సార్లు చెప్పేసరికి ఒకవేళ పొరబాటున చేసేస్తాడేమో అనుకున్నారు. కానీ జగన్ విషయంలో జనం నమ్మిందే నిజమైంది. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండానే ఎన్నికలకు ముందు వెలిగొండను జాతికి అంకితం అనేశాడు జగన్. ఎంత మోసపోయాం అనుకున్నారు జనం.


27/02/2026

సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో రాష్ట్రమంతా యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేస్తున్నారు. దీనిలో భాగంగా అనకాపల్లి - చోడవరం రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి.


27/02/2026

పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం పక్కన పడేసింది.కేవలం ప్రెస్ మీట్ ల కోసం వాడుకుంది.


ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో పాల్గొని కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించిన కీలక అంశాన్ని సభ దృష్టికి తీసుకెళ్లాను.2018...
27/02/2026

ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో పాల్గొని కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించిన కీలక అంశాన్ని సభ దృష్టికి తీసుకెళ్లాను.

2018లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొవ్వూరుకు బీసీ గురుకుల పాఠశాలను మంజూరు చేశారు. అయితే అప్పటి నుండి ఈ పాఠశాల తాత్కాలిక అద్దె భవనంలోనే కొనసాగుతోంది.

గురుకుల పాఠశాలలో 480 మంది విద్యార్థులు చదువుకునే సామర్థ్యం ఉండగా, సొంత భవనం లేకపోవడం వల్ల ప్రస్తుతం కేవలం 190 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. అందువల్ల గురుకుల పాఠశాలకు తక్షణం స్థలం కేటాయించి, సొంత భవనం నిర్మించాలని సభలో విజ్ఞప్తి చేశాను.

మన కొవ్వూరు విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడం నా బాధ్యత. ఈ విషయంపై నిరంతరం కృషి చేస్తాను.

ఆపదలో ఉన్న బిడ్డకు అండగా.. ఆ కుటుంబానికి కొండంత ధైర్యంగా! చిన్నారి పునర్విక చికిత్సకు భరోసా ఇచ్చి, తనలోని మానవీయ కోణాన్న...
27/02/2026

ఆపదలో ఉన్న బిడ్డకు అండగా.. ఆ కుటుంబానికి కొండంత ధైర్యంగా!

చిన్నారి పునర్విక చికిత్సకు భరోసా ఇచ్చి, తనలోని మానవీయ కోణాన్ని చాటుకున్న లోకేష్ అన్న. మాట ఇస్తే మడమ తిప్పని నైజం.. పేదల కష్టాల్లో పాలుపంచుకునే గొప్ప హృదయం!

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పుట్టు పూర్వోత్తరాలు చూస్తే ఈ ప్రాజెక్టుకు అన్నీ చంద్రబాబుగారే. 30 ఏళ్ళ క్రితం  ప్రాజెక్...
27/02/2026

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పుట్టు పూర్వోత్తరాలు చూస్తే ఈ ప్రాజెక్టుకు అన్నీ చంద్రబాబుగారే. 30 ఏళ్ళ క్రితం ప్రాజెక్టు కోసం శంకుస్థాపన చేసింది ఆయనే. ప్రాజెక్టు పనుల్లో 90 శాతం పూర్తి చేసింది ఆయనే. మిగతా పని పూర్తి చేసేది కూడా ఆయనే. ఐదేళ్ళలో కేవలం 5 శాతం పనులు చేసిన జగన్ కు వెలిగొండ గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?


Address

Kovvur

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Kovvur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Kovvur:

Share