23/05/2021
కుప్పం.శాంతిపురం(మం),గొల్లపల్లికి గ్రామానికి చెందిన నందమూరి వీరాభిమాని మురుగేష్ ఈ నెల 13వ తేదీ టెంకాయ చెట్టు పై నుండి పడిపోయి.ప్రాణాపాయ స్థితిలో నడుము విరిగి,వెన్నుపూస క్రాక్ వదిలి,రెండు కాళ్ళు పని చేయకుండా దీన స్థితిలో చికిత్స పొందుతున్న అతనికి కుప్పం నందమూరి తారక్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు శివ రాయల్ చేతులు మీదగా 20,000/-రూ ఆర్థిక సహాయాన్ని అతనికి అందించడం జరిగింది.అతను కొలుకోవాలి అంటే ఇంకా లక్షలతో కూడుకున్న పనని,ఇప్పుడే శక్తి కి మించి అప్పులు చేసి ఖర్చు చేశామని,నందమూరి కుటుంబ సభ్యులు అందరూ అన్న-తమ్ముడిగా భావించి తమ తమ శక్తి కొద్దీ ఆర్డిక సహాయం చేసి తనను ఆదుకోవాలని ప్రాధేయ పడ్డాడు.ఈ కార్యక్రమంలో దేవా, లీలా వినోద్,ముత్తు కుమార్,శాంతిపురం లక్ష్మిపతి తదితరులు పాల్గొన్నారు.