04/09/2026
కుప్పం గడ్డపై టీడీపీ జైత్రయాత్ర కొనసాగాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి: PKM-UDA చైర్మన్ డాక్టర్ బి.ఆర్. సురేష్ బాబు
కుప్పం: మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని గోరివిమాకులపల్లి, బందర్లపల్లి గ్రామ పంచాయతీల తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా PKM-UDA చైర్మన్ డాక్టర్ బి.ఆర్. సురేష్ బాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధి ప్రస్థానాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి టీడీపీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. టీడీపీ జెండాను రెపరెపలాడిస్తూ, పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా సమష్టిగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని, గ్రామస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని డాక్టర్ సురేష్ బాబు సూచించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత కార్యదర్శి శ్రీకాంత్ గారు, రాష్ట్ర గ్రంథాలయ బోర్డు మెంబర్ మునిస్వామి గారు, టీడీపీ రామకుప్పం మండల అధ్యక్షులు వెంకటరమణ గారు, టీడీపీ రామకుప్పం మండలం మాజీ అధ్యక్షులు ఆనంద్ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, ఎంపీపీ సులోచన గుర్రప్ప గారు, పట్టర్ నారాయణ గారు, అలాగే కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.