21/10/2022
ఏబీవీపీ ఆత్మకూరు నగర నూతన కమిటీ ఎన్నిక
ఆత్మకూరు అక్టోబర్ 21
ఆత్మకూరు పట్టణంలోని ఏబీవీపీ శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఏబీవీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఆత్మకూరు నూతన కమిటీని ఎన్నుకున్నట్లు జిల్లా కన్వీనర్ వీరబ్రహ్మం తెలిపారు. నగర కార్యదర్శి గా శ్రీ హరి నాయక్, నగర సహాయ కార్యదర్శి గా అమర్నాథ్ రెడ్డి,శ్రీను, నగర ఉపాధ్యక్షులుగా జగదీష్, శ్రీరామ్,
ఎస్. ఎఫ్ .డి కన్వీనర్ గా మణికంఠ,
సోషల్ మీడియా కన్వీనర్ గా లక్ష్మీకాంత్ రెడ్డి, ను నగర కలమంచ్ కన్వీనర గా నగర కార్యవర్గ సభ్యులు గా జస్వంత్,కిరణ్,సుధాకర్,బన్నీ, సంతోష్,ఇమ్రాన్ లు ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఎబివిపి పూర్వ కార్యకర్త వాసుదేవ రెడ్డి గారు ముఖ్య వక్త గా మాట్లాడుతూ ఆత్మకూరు నూతన కమిటీ సభ్యులుగా ఎన్నికైన విద్యార్థులందరు కూడా సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్కరూ జాతీయ భావాలు దేశభక్తి కలిగి ఉండాలని విద్యార్థి దశలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని అన్నారు. ఏబీవీపీ విద్యారంగ సమస్యలే కాకుండా భారతదేశంలో చేసే నిర్మాణాత్మక కార్యక్రమాలు, సేవకార్యక్రమాలు, నిర్వహిస్తూ జాతీయ పునర్నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తుoది అన్నారు. వివేకానందుని మాటగా ఏబీవీపీ బాటగా వివేకానందుని అడుగు జాడల్లో నడుస్తూ నేటి విద్యార్థి - నేటి పౌరుడేనని బాధ్యత గుర్తుచేస్తూ అనేక మంది నాయకులను ఏబీవీపీ తయారు చేస్తుంది అన్నారు. దేశానికి హాని కలిగించే ఎటువంటి పరిస్థితులు వచ్చినా సైనికుని వలే ఏబీవీపీ కార్యకర్తలు ముందు ఉండి పోరాడుతారని అన్నారు.ఈకార్యక్రమంలో ఎబివిపి నంద్యాల జిల్లా కో కన్వీనర్ రవికిషోర్ ఇంద్ర నరసింహులు తదితరులు పాల్గొన్నారు