Kurnool Police

Kurnool Police Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kurnool Police, Law enforcement agency, konda reddy fort, Kurnool.

03/06/2026

పత్రికా ప్రకటన(03.06.2026)

కర్నూలు జిల్లా...

* క్రీడాస్ఫూర్తిని చాటాలి...

విజయోత్సాహంలో వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు.

* గుంపులో ఉన్నప్పుడు వ్యక్తిగత బాధ్యతను మరవకూడదు.

* ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర ద్వారా యువకులకు కౌన్సెలింగ్.

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయం సాధించిన సందర్భంగా ఇటీవల కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్‌లో కొందరు యువకులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు బస్సుల అద్దాలను పగులగొట్టిన ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనలో పాల్గొన్న 18 మందిని కర్నూలు టూ టౌన్ పోలీసులు గుర్తించి సోమవారం అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా యువతలో అవగాహన కల్పించేందుకు కర్నూలు నగరంలోని సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీ సుధీర్ సండ్ర గారి ద్వారా ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర మాట్లాడుతూ...

అభిమాన జట్టు విజయం సాధించినప్పుడు ఆనందం వ్యక్తం చేయడం సహజమేనని, అయితే మాబ్ కల్చర్‌లో పడి వ్యక్తిత్వాన్ని, విలువలను, క్యారెక్టర్‌ను కోల్పోవడం సరికాదని తెలిపారు.

గుంపులో ఉన్నప్పుడు కొందరు "అందరూ చేస్తున్నారు కదా" అనే భావనతో తాము సాధారణంగా చేయని పనులు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.

ఆస్తుల ధ్వంసం, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడడం వంటి చర్యలు క్షణికావేశంలో జరిగినప్పటికీ వాటి ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని వివరించారు.

ప్రతి వ్యక్తి తన చర్యలకు తానే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఒకసారి చేసిన చిన్న తప్పు కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరించారు.

క్రీడలను క్రీడాస్ఫూర్తితో స్వీకరిస్తూ గెలుపు-ఓటములను సమానంగా చూడాలని, బాధ్యతాయుతంగా ప్రవర్తించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, కళాశాల యాజమాన్యం మరియు ఇతరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.





పత్రికా ప్రకటన(03.06.2026)కర్నూలు జిల్లా...* స్కూల్, కళాశాలల్లో  సీట్ల అడ్మిషన్ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల విద్...
03/06/2026

పత్రికా ప్రకటన
(03.06.2026)
కర్నూలు జిల్లా...

* స్కూల్, కళాశాలల్లో సీట్ల అడ్మిషన్ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.

* అడ్మిషన్ల సీజన్ లో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ళు .

* ఆన్ లైన్ చెల్లింపులు చేసే ముందు నిజ నిర్ధారణ చేసుకోండి.
.. కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు.

ప్రస్తుతం విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్, కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు బుధవారం తెలిపారు.

కొంతమంది మోసగాళ్లు ప్రముఖ పాఠశాలలు, కళాశాలల ప్రతినిధులమని నమ్మబలికి ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు లేదా సోషల్ మీడియా ప్రకటనల ద్వారా సంప్రదిస్తూ, “సీట్లు పరిమితంగా ఉన్నాయి”.

“రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని అడ్వాన్స్‌గా చెల్లించి సీటు రిజర్వ్ చేసుకోండి” అంటూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని తెలిపారు.

ఇలా డబ్బులు చెల్లించిన తర్వాత సంబంధిత విద్యాసంస్థలను సంప్రదిస్తే, తమ వద్ద ఎలాంటి రుసుము జమ కాలేదని, ఆ వ్యక్తులకు తమ సంస్థతో సంబంధం లేదని తెలుస్తోందన్నారు.

ఈ విధంగా అనేక మంది సైబర్ మోసగాళ్ల బారిన పడుతున్నారని హెచ్చరించారు.

తల్లిదండ్రులు, విద్యార్థులు అడ్మిషన్లకు సంబంధించిన ఫీజులను కళాశాల లేదా పాఠశాల అధికారిక కార్యాలయంలో లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చెల్లించాలని సూచించారు.

అపరిచిత వ్యక్తులు పంపిన బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఐడీలు లేదా QR కోడ్‌లకు డబ్బులు పంపవద్దన్నారు.

ఏదైనా విద్యాసంస్థ పేరుతో ఫోన్ కాల్ వచ్చినప్పుడు ముందుగా సంబంధిత సంస్థ అధికారిక నంబర్ల ద్వారా వివరాలను నిర్ధారించుకోవాలని సూచించారు.

సైబర్ మోసానికి గురైనట్లయితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా

cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు.

సమయానికి ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును తిరిగి పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండి సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు




పత్రికా ప్రకటన (03.06.2026)కర్నూలు జిల్లా…* నేర నియంత్రణ , ప్రజల భద్రతే లక్ష్యం.* రాత్రి వేళల్లో  కొనసాగుతున్న విజిబుల్ ...
03/06/2026

పత్రికా ప్రకటన (03.06.2026)
కర్నూలు జిల్లా…

* నేర నియంత్రణ , ప్రజల భద్రతే లక్ష్యం.

* రాత్రి వేళల్లో కొనసాగుతున్న విజిబుల్ పోలీసింగ్ .

* రహదారి ప్రమాదాల నివారణకు “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా నేరాల నియంత్రణకు అనుమానాస్పద వాహనాలను తనిఖీలు చేపడుతున్నారు .

కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని సబ్ డివిజన్ లలో విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు.

కర్నూలు నగరంలో కర్నూల్ ఒకటవ పట్టణ సిఐ శ్రీ మారుతి శంకర్ ఆధ్వర్యంలో బ్లూ కోల్ట్స్ బృందాలు, క్యూఆర్టీ పోలీసు బృందాలు పాల్గొని కట్టుదిట్టంగా విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు.

డ్రంక్ & డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.

రహదారి ప్రమాదాల నివారణకు “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఎక్కడైనా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112 కు గాని లేదా డయల్ 100కు గాని సమాచారం ఇవ్వాలని సూచించారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు




02/06/2026

పత్రికా ప్రకటన (02.06.2026)
కర్నూలు జిల్లా…

* నేర నియంత్రణ , ప్రజల భద్రతే లక్ష్యం.

* రాత్రి వేళల్లో కొనసాగుతున్న విజిబుల్ పోలీసింగ్ .

* రహదారి ప్రమాదాల నివారణకు “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా నేరాల నియంత్రణకు అనుమానాస్పద వాహనాలను తనిఖీలు చేపడుతున్నారు .

కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని సబ్ డివిజన్ లలో విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు.

కర్నూలు నగరంలో కర్నూల్ తాలూకా సిఐ తేజ మూర్తి ఆధ్వర్యంలో బ్లూ కోల్ట్స్ బృందాలు, క్యూఆర్టీ పోలీసు బృందాలు పాల్గొని కట్టుదిట్టంగా విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు.

డ్రంక్ & డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.

రహదారి ప్రమాదాల నివారణకు “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఎక్కడైనా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112 కు గాని లేదా డయల్ 100కు గాని సమాచారం ఇవ్వాలని సూచించారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు




పత్రికా ప్రకటన(01.06.2026)కర్నూలు జిల్లా...అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ... శ్రీ జె. బాబు ప్రసాద్.ఎస్పీ గారికి క్య...
01/06/2026

పత్రికా ప్రకటన
(01.06.2026)

కర్నూలు జిల్లా...

అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ... శ్రీ జె. బాబు ప్రసాద్.

ఎస్పీ గారికి క్యాంపు కార్యాలయంలో కర్నూల్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ... అడిషనల్ ఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్

కర్నూలు డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న శ్రీ జె. బాబు ప్రసాద్ గారు ఇటీవల అదనపు ఎస్పీ గా పదోన్నతి పొందారు.

ఈ సందర్భంగా సోమవారం కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.

ఈ సందర్భంగా కర్నూల్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ...

అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందిన శ్రీ జె. బాబు ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేశారు.

భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, పోలీసు శాఖలో ఆయన సేవలు మరింత సమర్థవంతంగా కొనసాగాలని శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు




పత్రికా ప్రకటన(01.06.2026)కర్నూలు జిల్లా...ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో ఆస్తుల ధ్వంసం...సీసీ కెమెరాల ఆధారంగా 18 మంది గుర్తి...
01/06/2026

పత్రికా ప్రకటన(01.06.2026)

కర్నూలు జిల్లా...

ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో ఆస్తుల ధ్వంసం...

సీసీ కెమెరాల ఆధారంగా 18 మంది గుర్తింపు, అరెస్టు.

ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం సహించం :

కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్.

కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు నడిరోడ్డుపై తీసుకెళ్లిన పోలీసులు

ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు విజయం సాధించిన నేపథ్యంలో నిర్వహించిన విజయోత్సవాల సందర్భంగా కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులతో పాటు బస్సుల అద్దాలు ధ్వంసం చేసి నష్టం కలిగించిన ఘటనపై కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలు, సోషల్ మీడియా వీడియోలు మరియు ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి ఘటనలో పాల్గొన్న 18 మంది వ్యక్తులను గుర్తించి అరెస్టు చేశారు.

కోర్టుకు తరలించారు.

ప్రజా ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు.

విజయోత్సవాలు, పండుగలు, ఇతర వేడుకలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు





01/06/2026

పత్రికా ప్రకటన(01.06.2026)

కర్నూలు జిల్లా...

ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో ఆస్తుల ధ్వంసం...

సీసీ కెమెరాల ఆధారంగా 18 మంది గుర్తింపు, అరెస్టు.

ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం సహించం :

కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్.

కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు నడిరోడ్డుపై తీసుకెళ్లిన పోలీసులు

ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు విజయం సాధించిన నేపథ్యంలో నిర్వహించిన విజయోత్సవాల సందర్భంగా కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులతో పాటు బస్సుల అద్దాలు ధ్వంసం చేసి నష్టం కలిగించిన ఘటనపై కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలు, సోషల్ మీడియా వీడియోలు మరియు ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి ఘటనలో పాల్గొన్న 18 మంది వ్యక్తులను గుర్తించి అరెస్టు చేశారు.

కోర్టుకు తరలించారు.

ప్రజా ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు.

విజయోత్సవాలు, పండుగలు, ఇతర వేడుకలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు





పత్రికా ప్రకటన …  (01.06.2026) కర్నూలు జిల్లా...విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం ... కర్నూలు ఎస్పీ శ్రీ  విక్రాంత్ ...
01/06/2026

పత్రికా ప్రకటన … (01.06.2026)

కర్నూలు జిల్లా...

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం ...

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.

• ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 132 ఫిర్యాదులు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన ... జిల్లా ఎస్పీ.

కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 132 ఫిర్యాదులు వచ్చాయి.

వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ...

1) కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన మల్లికార్జున సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నమ్మించి రూ. 3 లక్షలు తీసుకుని ల్యాప్‌టాప్ మాత్రమే నా కుమారుడి కి ఇచ్చి మోసగించాడని తుగ్గలి మండలం , పగిడిరాయి కొత్తూరు గ్రామానికి చెందిన హరీష్ చంద్ర ఫిర్యాదు చేశారు.

2)బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న మల్లు నవీన్ కుమార్ రెడ్డి రూ. 1 లక్ష 50 వేలు తీసుకుని మోసానికి పాల్పడ్డాడని, ఓర్వకల్లు మండలం, గుట్టపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ చేశారు.

3) మొదటి భార్యకు ఇల్లు అగ్రిమెంట్ రాసిస్తామని హామీ ఇచ్చి, రెండో భార్య పేరు మీద ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించి, ఆ ఇంటి పై రుణం తీసుకుని మొదటి భార్య కు, పిల్లల కు అన్యాయం చేశారని , ఈ విషయం పై విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని కర్నూలు మండలం, జి. శింగవరం గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మ ఫిర్యాదు చేశారు.

4) 14 సంవత్సరాల నుండి నా కుమారులు రాముడు, లోకేష్ ఆస్తిని అనుభవిస్తున్నారు. అయితే ప్రస్తుతం నన్ను, నా కుమార్తెలను పట్టించుకోవడం లేదు. నాకు 70 సంవత్సరాల వయస్సు వచ్చింది. కనీసం అన్నం కూడా పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలని గోనెగండ్ల మండలం , చిన్నమర్రివీడు గ్రామానికి చెందిన ఈరమ్మ ఫిర్యాదు చేశారు.

5) కెనరా బ్యాంకు లో మినీ బ్యాంక్ పాయింట్ నిర్వహిస్తూ, కెనరా బ్యాంకు ఉద్యోగినని చెప్పుకుంటూ అందరిని నమ్మించాడు. రైతులు , ఖాతాదారుల నుంచి పొదుపు రుణాలు , మార్ట్ గేజ్ రుణాలు మరియు ఇతర లావాదేవీల పేరుతో ప్రజల నుండి రూ. 6 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసి బ్యాంకులో జమ చేయకుండా దుర్వినియోగం చేసి , ఐపి నోటిీసులు ఇచ్చి మోసం చేసి ఉడాయించిన హరి కుమార్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని సి. బెలగల్లు మండలం , కాంపాడు గ్రామంకు చెందిన నాగన్న, ఓంకార్ ఫిర్యాదు చేశారు.

6) తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న ధనలక్ష్మి యూనివర్సిటీలో మా కుమారుడు రెహాన్ బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటికి వచ్చాడు. ఎందుకు వచ్చావు అని బాగా చదువుకోవాలని మందలించడంతో ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కనిపెట్టి న్యాయం చేయాలని కర్నూలు, సంపత్ నగర్ కు చెందిన సవీనా బేగం ఫిర్యాదు చేశారు.

7) కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా విత్తనం వేసిన పొలాన్ని ట్రాక్టర్ తో దున్నించి అన్యాయం చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని నందవరం మండలం, కనకవీడు గ్రామానికి చెందిన నాగన్న గౌడ్ ఫిర్యాదు చేశారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటి పై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు హామీ ఇచ్చారు.

ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీ హుస్సేన్ పీరా, సిఐలు శివశంకర్ , రామయ్య నాయుడు , రామాంజులు పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు




పత్రికా ప్రకటన (  31.05.2025)కర్నూలు జిల్లా...డిజిటల్ అరెస్టు పేరుతో వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.సైబర్ న...
31/05/2026

పత్రికా ప్రకటన ( 31.05.2025)

కర్నూలు జిల్లా...

డిజిటల్ అరెస్టు పేరుతో వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

సైబర్ నేరగాళ్ళు చేసే మోసాలు వాటిని ఎవరు నమ్మవద్దు...

కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు

ఇటీవల "డిజిటల్ అరెస్ట్" అనే పేరుతో సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి... జాగ్రత్త...

సైబర్‌ నేరాల్లో సొమ్ము రికవరీకి అవకాశం గంటలోపే... అప్రమత్తతే కీలకం.

తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతా ల ఒ.టి.పి.లను ఎవ్వరికీ చెప్పవద్దు.

డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్ళు పోలీసులమని , సీబీఐ అధికారులమని లేదా ఇతర ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్ చేస్తూ మీ మీద కేసు నమోదైందని, గంజాయి, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్నారని, మీరు అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్నారని, మీ పేరు మీద కోరియర్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయని లేదా మీ సిమ్/బ్యాంక్ ఖాతా కు వాడబడిందని వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదివారం కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు విజ్ఞప్తి చేశారు.

పోలీసులు ఎప్పుడూ వీడియో, ఆడియో కాల్స్ చేయరన్న విషయం గ్రహించాలన్నారు.

ఎవరికీ కూడా వీడియో కాల్ ద్వారా అరెస్టు గురించి సమాచారం చెప్పడం పోలీసుల పని కాదన్నారు. .

అసలైన అధికారులు బ్యాంక్ ఖాతా / ఆధార్ / OTP అడగరన్నారు.

కేసులో సహాయం చేస్తామని, నమ్మించి, తాము సూచించిన బ్యాంకు ఖాతాకు భారీగా నగదు పంపాలని కోరుతారన్నారు. తమతో మాట్లాడిన వివరాలను ఎవ్వరికీ తెలపకుండా ఉండాలని తమ బ్యాంకు ఖాతాను రిజర్వు బ్యాంకు సహకారంతో పరిశీలించాల్సి ఉందని, వివరాలు సేకరించి, తమ యొక్క బ్యాంకు ఖాతాలలో ఉన్న డబ్బును కాజేస్తారన్నారు.

ఎవరైనా తెలియని వ్యక్తులు కాల్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే అటువంటి ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసి ఆ సమాచారాన్ని స్థానిక పోలీసు స్టేషన్ లోగాని లేదా సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని సమాచారం అందించాలన్నారు.

ఈ తరహా నేరాల్లో ఎవరైనా నగదును పోగొట్టు కొన్నట్లయితే ఒక గంటలోపే 1930 కు లేదా నేషనల్ సైబరు క్రైం పోర్టల్లో https://cybercrime.gov.in/ కు రిపోర్టు చేయాలన్నారు.

సైబర్ నేరం జరిగిన గంటలోపే ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మునంతా తిరిగి రికవరీ చేసి ఇప్పించేందుకు పోలీసులకు అవకాశం ఉంటుందని, గంటలోపే అప్రమత్తతే కీలకమని దాన్ని గోల్డెన్ అవర్ అని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.




పత్రికా ప్రకటన (31.05.2026)కర్నూలు జిల్లా...* నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని  రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూ...
31/05/2026

పత్రికా ప్రకటన (31.05.2026)

కర్నూలు జిల్లా...

* నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు.

* చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి.

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ , శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి , చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.




Address

Konda Reddy Fort
Kurnool
518001

Telephone

100

Alerts

Be the first to know and let us send you an email when Kurnool Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share