Kurnool Municipal Corporation

Kurnool Municipal Corporation Official account of Kurnool Municipal Corporation, Andhra Pradesh.

పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే చర్యలు తప్పవు• ఉద్యోగులు విధులను శ్రద్ధతో నిర్వర్తించండి• క్షేత్రస్థాయిలో విసృతంగా తిరగండి • ...
01/06/2026

పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే చర్యలు తప్పవు

• ఉద్యోగులు విధులను శ్రద్ధతో నిర్వర్తించండి
• క్షేత్రస్థాయిలో విసృతంగా తిరగండి
• నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు

నగరంలో ప్రతి శానిటేషన్ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్యం మెరుగుపడాలని, మార్పు కనబడకపోతే సంబంధిత శానిటేషన్ ఇంస్పెక్టర్లు, కార్యదర్శులపై చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో పారిశుద్ధ్య పర్యవేక్షక సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. తాను ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, లోపాలను సరిచేసుకునేందుకు దిశానిర్దేశం చేస్తుంటే వాటిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రద్ధతో విధులను నిర్వర్తించాలని, క్షేత్రస్థాయిలో విసృతంగా తిరగాలని సూచించారు. తిరిగినప్పుడే సమస్యలు సులువుగా అర్థం అవుతుందన్నారు‌.‌ ప్రతి వాహనానికి వెళ్ళాల్సిన మార్గాన్ని మ్యాపింగ్ చేయాలని, ఆ విషయాన్ని డ్రైవర్‌కి, పారిశుద్ధ్య సిబ్బందికి, ప్రజలకు స్పష్టం తెలియజేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ రెండు ఖాళీ స్థలాల్లో, పెద్ద డ్రైనేజీ కాలువల్లో, ట్రాన్స్ఫార్మర్‌ల వద్ద స్వచ్ఛత పనులు చేపట్టాలని ఆదేశించారు. కూడళ్ళు, డివైడర్ల ప్రతిరోజూ తనిఖీ చేయాలన్నారు. ప్రతి దుకాణం వద్ద డస్ట్‌బిన్‌లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, శానిటేషన్ ఇంస్పెక్టర్లు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

మొండి బకాయిదారుల షాపులు సీజ్ చేయండి• నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశం• అవినీతిని సహించను.. బాధితులు ఫిర్యాదు చే...
01/06/2026

మొండి బకాయిదారుల షాపులు సీజ్ చేయండి

• నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశం
• అవినీతిని సహించను.. బాధితులు ఫిర్యాదు చేయాలి

నగరంలో ఉన్న మున్సిపల్ షాపుల అద్దె బకాయిలను చెల్లించకుండా ఉన్న దుకాణాలను వెంటనే సీజ్ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో రెవెన్యూ విభాగ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.

కొంతమంది సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్లు తన దృష్టికి వస్తుందని, పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పన్ను విధింపు, సవరణ, పేరు మార్పు వంటి సేవలను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని, నిర్దేశిత గడువులోపు దరఖాస్తులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఖాళీ ఉన్న మున్సిపల్ షాపులకు వెంటనే వేలంపాట నిర్వహించాలని, 25 ఏళ్లు పూర్తి అయిన షాపులకు కొత్త జీవో ప్రకారం నిబంధనలకు అనుగుణంగా రెన్యువల్ చేయడానికి లీజుదారుడి నుండి సమ్మతి తీసుకోవాలన్నారు. గడువు తీరిన షాపులపై బకాయిలు ఉంటే నోటీసులు జారీ చేసి కేసులు సైతం పెట్టాలన్నారు. వీలైనంత త్వరగా 80% బకాయిలను రాబట్టాలని స్పష్టం చేశారు.

అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. నగర ప్రజలు నగరపాలక సంస్థలో ముఖ్యంగా రెవెన్యూ విభాగంలో పన్ను విధింపు, వియల్‌టి విధింపు, పన్ను సవరణలు, పేరు మార్పు వంటి సేవల కోసం ఎవరైనా నగదు అడుగుతున్నట్లయితే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 9766 కు లేదా నేరుగా తన (కమిషనర్) నంబర్ 8106228899 కు ఫిర్యాదు చేయాలని కోరారు. అవినీతిని ఏమాత్రం సహించబోమని, ప్రజలు అవినీతి నిర్మూలనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్, ఆర్వోలు జునైద్, స్వర్ణలత, వాజిద్, ఆర్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు• పారిశుద్ధ్య విభాగ సిబ్బందిపై కమిషనర్ అసహనం• పిన్ పాయింట్ ప్రోగ్రామ్ పక్కాగా అమలు చేయాల...
01/06/2026

ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు

• పారిశుద్ధ్య విభాగ సిబ్బందిపై కమిషనర్ అసహనం
• పిన్ పాయింట్ ప్రోగ్రామ్ పక్కాగా అమలు చేయాలి

పారిశుద్ధ్య నిర్వహణలో పర్యవేక్షక సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకోక తప్పదని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు. సోమవారం ఆయన 5వ శానిటేషన్ డివిజన్‌లో మస్టర్ తనిఖీ చేశారు. అలాగే నరసింహారెడ్డి నగర్, వెంకటరమణ కాలనీ, కంట్రోల్ రూమ్, గాంధీనగర్, రాజ్‌విహార్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు.

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం..!  • పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన      మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను కాపాడ...
01/06/2026

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం..!

• పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన

మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించి, ఈగల్‌ (ఎలైట్‌ యాంటీ-నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌)కు సహకారం అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో రాత్రింబవళ్లు ప్రజల మధ్య విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా డ్రగ్స్‌, గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, సరఫరా లేదా రవాణా జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్‌ 1972కు సమాచారం అందించాలని సూచించారు.

సోమవారం 5వ శానిటేషన్ డివిజన్ కార్యాలయం వద్ద ఈగల్ టీం ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజాన్ని ఈ ముప్పు నుంచి కాపాడేందుకు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అనుమానాస్పద కార్యకలాపాలు, మాదకద్రవ్యాల విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం అందించడం ద్వారా నేరాల నియంత్రణకు తోడ్పడవచ్చన్నారు. పారిశుద్ధ్య కార్మికులు నగరంలోని ప్రతి ప్రాంతంలో తిరుగుతూ విధులు నిర్వహిస్తుండటంతో, వారి సహకారం మాదకద్రవ్యాల నిర్మూలనలో కీలకంగా ఉంటుందని తెలిపారు.

అనంతరం ఈగల్ బృందం సభ్యులు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, యువతపై వాటి ప్రభావం, అనుమానాస్పద కార్యకలాపాలను ఎలా గుర్తించాలి, సమాచారం ఎలా అందించాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో ఈగల్ ఎస్ఐ సుజన్, టీం సభ్యులు ఎలిషా, మాసుంవలి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ అనిల్, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

30/05/2026
డివైడర్లలో శుభ్రత పనులు చేపట్టాలి• నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసునగరంలో రహదారులతో పాటు విభాగిణులు (డివైడర్లు), రహదా...
30/05/2026

డివైడర్లలో శుభ్రత పనులు చేపట్టాలి

• నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు

నగరంలో రహదారులతో పాటు విభాగిణులు (డివైడర్లు), రహదారుల పక్కన ఉన్న ప్రాంతాలను సైతం శుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. శనివారం ఆయన బుధవారపేట, సి.క్యాంపు, అమ్మ హాస్పిటల్ కూడలి ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగర సుందరీకరణకు పరిశుభ్రమైన వాతావరణం ఎంతో అవసరమన్నారు. ప్రధాన రహదారులపై ఉన్న డివైడర్లలో పెరిగిన కలుపు మొక్కలు, చెత్తాచెదారం, ఎండిన కొమ్మలను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. రోడ్ల పక్కన చెత్త పేరుకుపోకుండా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, పారిశుద్ధ్య సిబ్బంది కేటాయించిన ప్రాంతాల్లో ప్రతిరోజూ విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని పర్యవేక్షక సిబ్బంది ఆదేశించారు.

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాలువలు, డ్రైన్లలో పూడిక పేరుకుపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రజలు కూడా చెత్తను రోడ్లపై, డివైడర్లలో వేయకుండా నగర పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, శానిటేషన్ ఇంస్పెక్టర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా నగరంలోని ఏ. క్యాంప్ లో అశ్విని ఆసుపత్రి సమీపంలోని డ్రైనేజ్   కాలువ వద్ద పరిశుభ్రత కార్యక...
30/05/2026

ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా నగరంలోని ఏ. క్యాంప్ లో అశ్విని ఆసుపత్రి సమీపంలోని డ్రైనేజ్ కాలువ వద్ద పరిశుభ్రత కార్యక్రమాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సంపత్ కుమార్ గారు, ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి గారు..

పట్టణాల అభివృద్ధిలో కమిషనర్లే కీలకం• యంత్రాంగంతో సమర్థవంతంగా పనిచేయించాలి• మున్సిపల్ శాఖ సిడిఏంఏ పి.సంపత్ కుమార్, ఐఏయస్•...
29/05/2026

పట్టణాల అభివృద్ధిలో కమిషనర్లే కీలకం

• యంత్రాంగంతో సమర్థవంతంగా పనిచేయించాలి
• మున్సిపల్ శాఖ సిడిఏంఏ పి.సంపత్ కుమార్, ఐఏయస్
• జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం

నగర/పట్టణాల అభివృద్ధిలో కమిషనర్లే కీలకమని, వారు బాధ్యతగా, స్మార్ట్ వర్క్‌తో సమర్థవంతంగా పనిచేసినప్పుడే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని రాష్ట్ర పురపాలక శాఖ పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సిడిఎంఏ) పి.సంపత్ కుమార్, ఐఎయస్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో డోన్ కమిషనర్‌‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అంతకుముందు గార్గేయపురం, జొహరాపురం డంప్ యార్డుల్లో బయో మైనింగ్, సి & డి వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్, కుక్కల సంతాన నియంత్రణ కేంద్రాన్ని పరిశీలించారు. గార్గేయపురం డంప్‌యార్డులో ఘన వ్యర్థాల బయో మైనింగ్ జాప్యం చేయొద్దని స్పష్టం చేశారు. 15 ఎకరాల్లో బయో మైనింగ్ పూర్తి అయిన వెంటనే చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి (వెస్ట్ టు ఎనర్జీ) ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించాలని, మరో 9.5 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ నిర్మాణానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. బయో మైనింగ్ పనులను రోజువారీ లక్ష్యాలతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. గార్గేయపురం డంప్‌యార్డులో రెండు నెలల్లో, జొహరాపురం డంప్‌యార్డులో ఒక నెలలో బయో మైనింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు.

అనంతరం మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించిన సిడిఎంఏ పి.సంపత్ కుమార్ మాట్లాడుతూ.. కమిషనర్లు ప్రతిరోజూ 2 నుంచి 3 గంటలు క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో మార్పు కనిపించేలా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని సూచించారు. ప్రజల్లో సానుభూతి పొందేలా, తద్వారా స్వచ్ఛతక ప్రజల సహకారం అందేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. గార్బేజ్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించి జరిమానాలు విధించాలని, అయినప్పటికీ మార్పు లేకపోతే వీడియో ఆధారాలతో కేసులు నమోదు చేయాలని సూచించారు. త్వరలో చెత్త వేస్తే జరిమానాలు విధించే విధానంపై పూర్తి విధివిధానాలతో ఉత్తర్వులు ఇస్తామన్నారు.

డ్రైనేజీ కాలువలు, పారిశుద్ధ్య సమస్యలు, ప్రజా ఫిర్యాదులపై పూర్తిస్థాయి అవగాహన కమిషనర్లకు ఉండాలని సూచించారు. ప్రజాప్రతినిధుల కంటే ముందే సమస్యలు కమిషనర్ల దృష్టిలో ఉండాలన్నారు. ప్రతిరోజూ సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించి అవసరమైన దిశానిర్దేశం చేయాలన్నారు. అన్ని సక్రమంగా ఉన్న ప్రాంతాల కంటే సమస్యలు ఉన్న ప్రాంతాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. సాధారణ నిధుల ఖర్చులో నిర్వహణ పనులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాతే అత్యవసర పనులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.

జీవో 75ను పక్కాగా అమలు చేయాలని, ప్రజాప్రతినిధులకు సైతం దీని గురించి తెలియజేయాలని ఆదేశించారు. ఇంటింటికీ డిజిటల్ క్యూ ఆర్ కోడ్ వ్యవస్థ అమలు చేసి, శాటిలైట్ ఆధారంగా ఆస్తుల విస్తీర్ణం, ప్రభుత్వ-ప్రైవేటు సేవలకు సమాచారాన్ని అనుసంధానం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఆస్తి పన్ను వసూళ్లు మెరుగుపరచాలని సూచించారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాలు ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యాలని తెలిపారు. డ్రైనేజీ లేకపోతే కనీసం కచ్చా కాలువ అయినా నిర్మించాలని, ప్రతిదానిని నిధులతో ముడిపెట్టడం సరికాదన్నారు. అందుబాటులో ఉన్న వనరులతో సాధ్యమైనంత సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో సమస్యలను ముందుగా పరిష్కరించాలని, రహదారులపై గుంతలు పూడ్చాలని ఆదేశించారు.

పూడికతీత పనులు జాప్యం చేయకుండా పూర్తి చేయాలని, ఖాళీ స్థలాలపై విఎల్‌టి పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. ఆయా స్థలాల యజమానుల వివరాలు సేకరించాలని సూచించారు. గార్బేజ్ పాయింట్లు లేకుండా వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పారిశుద్ధ్య సిబ్బంది కొరత ఉంటే నిధుల లభ్యతను బట్టి టౌన్ లెవల్ ఫెడరేషన్ ద్వారా పారిశుద్ధ్య సిబ్బందిని నియమించుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, అధికారులు స్మార్ట్ వర్క్ చేయాలని సూచించారు. రాయలసీమ ప్రాంత పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు మొక్కుబడిగా కాకుండా కచ్చితంగా నిర్వహించాలని సూచించారు. పైపై విధులు సరికాదని, సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు.

పట్టణాల వారీగా సమీక్ష నిర్వహించిన సిడిఎంఏ, కర్నూలు కార్పొరేషన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖచిత్ర సమాచారం, నివేదికలు, ముందస్తు చర్యలు వంటి అంశాలపై కమిషనర్ చల్లా ఓబులేసును అభినందించారు. కర్నూలులో పిన్ పాయింట్ ప్రోగ్రామ్ అమలు చేస్తున్నామని కమిషనర్ వివరించారు. చెత్త వాహనాలకు జీపీఎస్ అమర్చడం, ప్రాసెసింగ్ పాయింట్ల పర్యవేక్షణ వంటి అంశాలను వివరించారు. కర్నూలు కార్పొరేషన్‌ను జిల్లా మున్సిపాలిటీలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

సమావేశంలో అనంతపురం ఆర్డిఎంఏ నాగరాజు, కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, ఎమ్మిగనూరు కమిషనర్ గంగిరెడ్డి, ఆదోని కమిషనర్ నయీం, గూడూరు కమిషనర్ ఏ.వి. రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Address

Kurnool
518001

Alerts

Be the first to know and let us send you an email when Kurnool Municipal Corporation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kurnool Municipal Corporation:

Share