Jupally Krishna Rao

  • Home
  • Jupally Krishna Rao

Jupally Krishna Rao Minister for Excise and Prohibition,
Tourism and Culture, Government of Telangana. MLA from Kollapur.
(1)

19/05/2026

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను బీఆర్ఎస్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఆరోపించారు. ఏపీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి కూడా పాలమూరు–రంగారెడ్డికి 90 టీఎంసీల నీటి కేటాయింపులను సాధించలేకపోయిందని విమర్శించారు. తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ కేసీఆర్, హరీశ్ రావు సంతకాలు చేశారని దుయ్యబట్టారు. ముందు నుంచి పాలమూరుపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపించారని మంత్రి జూపల్లి విమర్శించారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ వేల టీఎంసీల నీళ్లు తీసుకెళ్లిందన్నారు. తాము పాలమూరు ప్రాజెక్ట్ కు 90 టీఎంసీల నీటి కేటాయింపులు సాధిస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తెలంగాణకు 62 శాతం వాటాపై హక్కును సాధించుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. పాలమూరు– రంగారెడ్డికి త్వరలోనే నీటి కేటాయింపులు సాధిస్తామని తెలిపారు. ఇదే అంశంపై ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్లు చెప్పారు. పాలమూరుకు అత్యధిక నిధులు కేటాయించాలని కోరినట్లు మంత్రి వివరించారు. ప్రాజెక్టుల పూర్తి కోసం అధిక నిధులు కేటాయించేలా ఒత్తిడి తెస్తామని చెప్పారు.

19/05/2026

“వరి వేస్తే ఉరి” అంటూ రైతులను గతంలో కేసీఆర్ భయాందోళనకు గురిచేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు విమర్శించారు. 2014–2023 మధ్య ధాన్యం కొనుగోళ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.14,985 కోట్లు మాత్రమే చెల్లించిందని, తమ ప్రభుత్వం 2023 నుంచి ఇప్పటి వరకు రూ. 17,160 కోట్లు చెల్లించిందని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పదేండ్లలో కేసీఆర్ సర్కారు రూ.65 వేల కోట్ల అప్పును రూ.8 లక్షల కోట్లకు పెంచారని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 75 వేల కోట్ల అప్పు చెల్లిస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ పథకాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, గ్యాస్ సబ్సిడీ, ఉచిత ఆర్టీసీ బస్సు, సన్న వడ్లకు బోనస్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి పేరుతో వేల కోట్లు దోచుకున్నవారికి పాదయాత్ర చేసే నైతిక హక్కు లేదని మంత్రి ఆక్షేపించారు. తెలంగాణ ప్రజలు ఆలోచనాపరులని, బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మరని స్పష్టం చేశారు. పాలమూరుతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు.

19/05/2026

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ హయాంలోనే రూ.8,500 కోట్లు ఖర్చు చేశామని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పదేండ్ల కేవలం రూ.6,300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని గుర్తు చేశారు. తుమ్మిడి హట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని, గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకురావచ్చని మంత్రి చెప్పారు. ఐదున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు కేవలం 4 టీఎంసీల రిజర్వాయర్లు మాత్రమే నిర్మించారని విమర్శించారు. మల్లన్న సాగర్‌ను 50 టీఎంసీలతో నిర్మిస్తే, మహబూబ్‌నగర్ జిల్లాలో అలాంటి రిజర్వాయర్లు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. పదేళ్లలో పాలమూరులో తట్టెడు మట్టి కూడా తీయలేదని ధ్వజమెత్తారు.

19/05/2026

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామన్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఖండించారు. కుర్చీ వేసుకొని రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయిస్తానని అప్పటి సీఎం కేసీఆర్ 2015లో భూత్పూర్‌లో ప్రకటించారని గుర్తుచేశారు. కానీ మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటర్లకు కనీసం అనుమతులు కూడా తీసుకురాలేదన్నారు. పంపులు, మోటార్లు, సర్జ్ పూల్స్ కోసం రూ.35 వేల కోట్లు కేటాయించినా, పదేళ్లలో కేవలం రూ.25 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావాలంటే లక్ష కోట్ల రూపాయలు కావొచ్చన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు శంకుస్థాపన తర్వాత సంవత్సరానికి ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు.

హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమ...
19/05/2026

హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సీఎం పలు కీలక సూచనలు చేశారు.

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయించాలని ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలయినంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామన్న సిఎం తెలిపారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

19/05/2026

LIVE | Hon'ble Minister Jupally Krishna Rao Garu Pressmeet in Hyderabad

పూర్వీకులు భావితరాల కోసం భద్రపరిచిన అమూల్య వారసత్వ సంపద మ్యూజియం- మంత్రి జూపల్లి కృష్ణారావు అంతర్జాతీయ మ్యూజియం దినోత్స‌...
19/05/2026

పూర్వీకులు భావితరాల కోసం భద్రపరిచిన అమూల్య వారసత్వ సంపద మ్యూజియం
- మంత్రి జూపల్లి కృష్ణారావు

అంతర్జాతీయ మ్యూజియం దినోత్స‌వం సందర్భంగా హైదరాబాద్ లోని రాష్ట్ర‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి మంత్రి జూప‌ల్లి కృష్ణారావు గారు హాజ‌ర‌య్యారు. తెలంగాణ‌లో పర‌మార జ‌గద్దేవుని శాస‌నాలు, స్ట‌కో స్క‌ప్చ‌ర్స్ ఇన్ సెంటెన‌రీ మ్యూజియం అనే పుస్త‌కాల‌తో పాటు బ్రోచర్ల‌ను మంత్రి ఆవిష్కరించారు.

18/05/2026

పూర్వీకుల వారసత్వ సంపదను రక్షించడం అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు స్పష్టం చేశారు. ఉరుకుల పరుగుల జీవితంలో పడి ప్రజలు ప్రకృతిని ఆస్వాదించడం మర్చిపోయారని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అన్నారు. సమాజంలో ఉన్న రకరకాల రుగ్మతలను రూపుమాపేందుకే సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులు, రచయితలతో ప్రభాత భేరికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు.


18/05/2026

మన నాగరికత, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు, జీవన విధానానికి అద్దం పట్టే జ్ఞాన కేంద్రాలు మ్యూజియాలు అని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పేర్కొన్నారు.
ఎటువంటి సాంకేతిక ప‌రిజ్ఞానం, ప‌రిక‌రాలు లేని కాలంలో అద్భుతమైన కట్టడాలను మన పూర్వీకులు నిర్మించార‌ని, వాటిని చూసి తరించక పోతే జీవితం సంపూర్ణం కాదని తెలిపారు. వారసత్వ కట్టడాలను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక పటంలో మరింత ప్రతిష్టాత్మకంగా నిలపాలని ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వారసత్వ సంపద పరిరక్షణ, మ్యూజియాల అభివృద్ధి, చారిత్రక కట్టడాల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.

హైద‌రాబాద్ :-  మ్యూజియాలు అనేవి కేవలం పురాతన వస్తువుల నిల్వ కేంద్రాలు మాత్రమే కావు. అవి మన నాగరికత, సంస్కృతి, చరిత్ర, సం...
18/05/2026

హైద‌రాబాద్ :- మ్యూజియాలు అనేవి కేవలం పురాతన వస్తువుల నిల్వ కేంద్రాలు మాత్రమే కావు. అవి మన నాగరికత, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు, జీవన విధానానికి అద్దం పట్టే జ్ఞాన కేంద్రాలని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, పురావ‌స్తు శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. ప్రపంచ వారసత్వ సంపదను రక్షించడం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్స‌వం సందర్భంగా సోమ‌వారం ప‌బ్లిక్ గార్డెన్ లోని రాష్ట్ర‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా మంత్రి జూప‌ల్లి హాజ‌ర‌య్యారు. జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి కార్య‌క్రమాన్ని ప్రారంభించారు.

తెలంగాణ‌లో పర‌మార జ‌గద్దేవుని శాస‌నాలు, స్ట‌కో స్క‌ప్చ‌ర్స్ ఇన్ సెంటెన‌రీ మ్యూజియం అనే పుస్త‌కాల‌తో పాటు బ్రోష‌ర్ల‌ను మంత్రి జూప‌ల్లి ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ.. ఒక దేశ గొప్పతనం, నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ మ్యూజియాలు, వారసత్వ సంపద ద్వారానే భావితరాలకు చేరుతాయని అన్నారు.ఎటువంటి సాంకేతిక ప‌రిజ్ఞానం, ప‌రిక‌రాలు లేని కాలంలో అద్భుతమైన కట్టడాలను మన పూర్వీకులు నిర్మించార‌ని, వాటిని చూసి తరించక పోతే జీవితం సంపూర్ణం కాదని తెలిపారు.
రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం లభించడం తెలంగాణ చరిత్రకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చిందని, ఈ వారసత్వ కట్టడాలను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక పటంలో మరింత ప్రతిష్టాత్మకంగా నిలపాలని ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వారసత్వ సంపద పరిరక్షణ, మ్యూజియాల అభివృద్ధి, చారిత్రక కట్టడాల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. చారిత్రక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలలో స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు, సందర్శకులకు మెరుగైన సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా గైడ్ (Guide) ల‌కు శిక్షణ ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు. దీని కోసం రూ. 5 కోట్లు కేటాయిస్తామ‌ని చెప్పారు.

ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ స్పెష‌ల్ సీఎస్ వాణి ప్ర‌సాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆర్కియాలజీ, మ్యూజియాలజీ రంగాల్లో నూతన కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని వారసత్వ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చిన్నపిల్లలు, విద్యార్థులు, యువత మ్యూజియాల‌ను సందర్శించి చరిత్రపై అవగాహన పెంచుకోవాలని కోరారు.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Jupally Krishna Rao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jupally Krishna Rao:

  • Want your organization to be the top-listed Government Service?

Share