Krishna District Police

Krishna District Police Official page of Krishna District Police. In case of any emergency .
(1)

కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు కంకిపాడు సీఐ జె. మురళీకృష్ణ గారు, కంకిపాడు ఎస్‌ఐ డి. సందీప్...
05/06/2026

కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు కంకిపాడు సీఐ జె. మురళీకృష్ణ గారు, కంకిపాడు ఎస్‌ఐ డి. సందీప్ గారు మరియు ఉయ్యూరు రూరల్ ఎస్‌ఐ కె. సురేష్ బాబు గారు “చైతన్యం” కార్యక్రమంలో భాగంగా కంకిపాడు మండలం కొలవెన్ను గ్రామంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మహిళల రక్షణ, పోక్సో చట్టం మరియు ఎన్‌డీపీఎస్ చట్టానికి సంబంధించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

అలాగే సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, OTPలు, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని తెలిపారు. మహిళలు మరియు చిన్నారులపై ఎలాంటి వేధింపులు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112, సైబర్ మోసాల ఫిర్యాదుల కోసం 1930 సేవలను వినియోగించాలని సూచించారు.

కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు ఘంటసాల ఎస్‌ఐ వి. చందన గారు మరియు శక్తి టీమ్-4 సభ్యులు మహిళల...
05/06/2026

కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు ఘంటసాల ఎస్‌ఐ వి. చందన గారు మరియు శక్తి టీమ్-4 సభ్యులు మహిళలు, యువతులు మరియు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ ఉపయోగాలు, సైబర్ మోసాల పట్ల అప్రమత్తత, మహిళల భద్రత, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు.

అలాగే శక్తి యాప్‌ను మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని అత్యవసర పరిస్థితుల్లో ఎలా వినియోగించుకోవాలో వివరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 సేవలను వినియోగించాలని సూచించారు. మహిళలు మరియు యువతులు అప్రమత్తంగా ఉంటూ తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని అవగాహన కల్పించారు.

కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు తమ తమ స్టేషన్ పరిధిలో “జ...
05/06/2026

కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు తమ తమ స్టేషన్ పరిధిలో “జన చైతన్యం” అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం, యువతను చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచడం, మహిళలు మరియు చిన్నారుల భద్రతపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు, కాలనీలు, విద్యాసంస్థలు మరియు ముఖ్య కూడళ్లలో ప్రజలతో ప్రత్యక్షంగా సమావేశమై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

ఈ కార్యక్రమాల్లో భాగంగా ట్రాఫిక్ నియమాలు మరియు రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ వినియోగించాలని సూచిస్తున్నారు. మైనర్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యల వల్ల కలిగే అనర్థాలను వివరించి, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని అవగాహన కల్పిస్తున్నారు.

అలాగే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులకు OTPలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని సూచిస్తున్నారు. ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే డయల్ 1930కు ఫిర్యాదు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 సేవలను వినియోగించాలని తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, ఫేక్ లింకులు మరియు మోసపూరిత యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇక గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందని వివరించి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలు, పోక్సో చట్టం, శక్తి యాప్ ఉపయోగాలు, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ వంటి అంశాలపై కూడా ప్రత్యేకంగా వివరించి మహిళల భద్రత కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తున్నారు. ప్రజలు పోలీసులకు సహకరించి సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు భాగస్వాములు కావాలని జిల్లా పోలీసులు కోరుతున్నారు.

05/06/2026

చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్థులను అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు

కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, మచిలీపట్నం ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీ జి. శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో, సీసీఎస్ మచిలీపట్నం సీఐ శ్రీ కె.వి.ఎస్. వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో మచిలీపట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐ జగదీష్ గారు మరియు సీసీఎస్ మచిలీపట్నం ఎస్ఐ నాగరాజు గారు మరియు సీసీఎస్ సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి నేరాలను నియంత్రణలో భాగంగా ఎస్పీ గారి ఉత్తర్వులు ప్రకారం జాయింట్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా, ఈరోజు ది.05.06.2026 వ తేదీన మధ్యాహ్నం సుమారు 01:00 గంట ప్రాతంలో మచిలీపట్నం పాండురంగ హై స్కూల్ ఏరియా నందు జాయింట్ వెహికల్ చెకింగ్ లో భాగంగా ఇద్దరు అనుమానితుల్ని అదుపులో తీసుకుని విచారించగా వారు గత నెల ది.11.05.2026వ తేదీన రాత్రి సుమారు 08.00 గంటల ప్రాంతంలో మచిలీపట్నంలోని కలెక్టర్ బంగ్లా వెనుక గల ఎస్.జి.ఓ. కాలనీ సమీపంలో ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళా మెడలో నుంచి రెండు బంగారు చైన్లు బలవంతముగా లాక్కొని బైక్ పై పారిపోయినట్లు, అదే విధంగా గతంలో కూడా మచిలీపట్నం L.E.F చర్చి మరియు చిలకలపూడి లోని కొబ్బరితోట సమీపం లో చైన్ స్నాచింగ్ చేసినట్లు నేరమును అంగీకరించినారు.

నిందితులు వివరాలు

1.మహ్మద్ ఖాజా మొయినుద్దీన్, వయస్సు 43 సం"లు, మసీదు సెంటర్, ఎన్.జి.ఓ. కాలనీ, కైకలూరు.

2 . మహ్మద్ హిమామ్ షరీఫ్, వయస్సు 49 సం"లు, మసీదు సెంటర్, ఎన్.జి.ఓ. కాలనీ, కైకలూరు.

ప్రాధమిక విచారణలో భాగముగా నిందితులు మచిలీపట్నం మరియు చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. వీటిలో:

1 . మచిలీపట్నం పీఎస్ క్రైమ్ నం.113/2026, సెక్షన్లు 134, 304(2) BNS

2 . మచిలీపట్నం పీఎస్ క్రైమ్ నం.116/2025, సెక్షన్లు 134, 304(2) BNS

3 . చిలకలపూడి పీఎస్ క్రైమ్ నం.150/2025, సెక్షన్లు 304, 307 r/w 3(5) BNS

రికవరీ ప్రాపర్టీ వివరాలు:

సుమారు Rs.8,50,000/- విలువ గల 60 గ్రాములు బంగారపు వస్తువులు మరియు నేరానికి ఉపయోగించిన pulsar మోటార్ సైకిల్ దర్యాప్తులో భాగంగా మచిలీపట్నం వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులోని ప్రతిభ కనపరిచిన సీసీఎస్ మచిలీపట్నం సీఐ శ్రీ కె.వి.ఎస్. వరప్రసాద్, మచిలీపట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐ జగదీష్ గారు మరియు సీసీఎస్ మచిలీపట్నం ఎస్ఐ నాగరాజు గారు మరియు సీసీఎస్ సిబ్బంది అయిన సీసీఎస్ PC's హర్ష, రామకృష్ణ, రవి మరియు రామ్ ప్రసాద్ లను కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారు అభినందించినారు.

Andhra Pradesh Police

నేరాల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసుల ముమ్మర రాత్రి గస్తీ.జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యా సాగర్ నాయుడు గారి ఆదే...
04/06/2026

నేరాల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసుల ముమ్మర రాత్రి గస్తీ.

జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యా సాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు జిల్లాలో నేరాల నివారణే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం రాత్రివేళ పకడ్బందీగా గస్తీ విధులు నిర్వహిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో నైట్ రౌండ్స్ నిర్వహిస్తూ బీట్ పాయింట్లను నిరంతరం తనిఖీ చేస్తున్నారు.

ముఖ్యంగా ప్రార్థన మందిరాలు, ఏటిఎంలు, మరియు ప్రధాన వ్యాపార సముదాయాల వద్ద నిఘాను పెంచి, అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.
మరోవైపు హైవేలపై రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారు. డయల్ 100 మరియు హైవే మొబైల్ వాహనాల ద్వారా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ, రాత్రి వేళల్లో డ్రైవర్లు నిద్రమత్తు కారణంగా ప్రమాదాలకు గురికాకుండా ఉండటానికి 'వాష్ అండ్ గో' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా వాహనాలను నిలిపి, డ్రైవర్లు ముఖం కడుక్కునేలా చేసి, వారికి ప్రమాదాల పట్ల అవగాహన కల్పించి పంపిస్తున్నారు. వీటికి తోడు జిల్లా వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

ప్రజల భద్రత దృష్ట్యా పోలీసు వారు చేపడుతున్న ఈ తనిఖీలకు ప్రజలు, వాహనదారులు పూర్తిస్థాయిలో సహకరించాలని పోలీసు యంత్రాంగం కోరుతోంది.

కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు పెనమలూరు సీఐ ఎన్. వెంకటనారాయణ గారు, ఎస్‌ఐ ఉషారాణి గారు చైతన...
04/06/2026

కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు పెనమలూరు సీఐ ఎన్. వెంకటనారాయణ గారు, ఎస్‌ఐ ఉషారాణి గారు చైతన్య కాలేజ్ సరస్వతి క్యాంపస్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ ఉపయోగాలు, సైబర్ మోసాల పట్ల అప్రమత్తత, మహిళల భద్రత, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు.

అలాగే శక్తి యాప్‌ను మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని అత్యవసర పరిస్థితుల్లో ఎలా వినియోగించుకోవాలో వివరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 సేవలను వినియోగించాలని విద్యార్థులకు సూచించారు. మహిళలు మరియు యువతులు అప్రమత్తంగా ఉంటూ తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అవగాహన కల్పించారు.

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,జిల్లాలో శాంతిభద్రత...
03/06/2026

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,

జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై నియంత్రణ సాధించేందుకు పోలీసులు బైండోవర్ చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ తెలిపారు. బైండోవర్‌కు గురైన వ్యక్తులు నిబంధనలను పాటించకుండా తిరిగి నేరాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇటీవల కృష్ణా జిల్లాలో గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి, మచిలీపట్నం సబ్‌డివిజన్‌లోని ఆర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి, ఇనుకుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో మరో వ్యక్తి బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని గౌరవ మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారి దృష్టికి తీసుకెళ్లగా, వారి పై విధించిన బాండు మొత్తాన్ని వసూలు చేయడం లేదా చెల్లించని పక్షంలో జైలు శిక్ష విధించేలా చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగింది.

*బైండోవర్ ఉల్లంఘించిన వారి వివరాలు:*

గుడివాడ పట్టణంలోని వాంబే కాలనీకి చెందిన గొల్లపల్లి పోతురాజు (28) ఎటువంటి నేరాలకు పాల్పడకుండా నిరోధించేందుకు Sec.129(e) BNSS ప్రకారం M.C.No.04/2026 ద్వారా ఒక సంవత్సరం పాటు బైండోవర్ చేయబడినాడు. అదేవిధంగా రూ.2,00,000/- స్వీయ భద్రతా బాండ్ ఆరు నెలలకు అమలు చేయించబడింది. అయితే, పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా గడువు ముగియకుండానే, ది 15-05-2026 తేదీన సదరు వ్యక్తి నేరంలో పాల్గొనoదుకుగాను Cr.No.132/2025, U/s 118(1), 115(2) BNS కింద కేసు నమోదు చేయబడింది.
బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన విషయాన్ని మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అయిన తహశీల్దార్ గారికి నివేదించగా, బాండ్ ఉల్లంఘనపై నోటీసులు జారీ చేసి వివరణ కోరగా. స్వీయ భద్రతా బాండ్ కు సంబందించిన ష్యూరిటీ అమౌంట్ ను కట్టలేను అని సమాధానం ఇవ్వడంలో డిటెన్షన్ ఉత్తర్వులు జారీ చేయగా, నిందితుడిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

2 . మచిలీపట్నం లోని భాస్కరపురం కి చెందిన తన్నేరు నాగ రాజు (39) పై Sec.129(e) BNSS ప్రకారం M.C.No.44/2026 ద్వారా ఒక సంవత్సరం పాటు బైండోవర్ చేయబడినాడు. అదేవిధంగా రూ.2,00,000/- స్వీయ భద్రతా బాండ్, ఆరు నెలలకు అమలు చేయించబడింది. గడువు ముగియకుండానే, ది 03-04-2026 తేదీన సదరు వ్యక్తి Machilipatnam PS యొక్క Cr.No.34/2026 U/s 331(4), 305(a) అను కేసు నేరంలో పాల్గొనoదుకుగాను కేసు నమోదు చేయబడింది.

బైండోవర్ బాండును చెల్లించనని చెప్పడంతో డి టెన్షన్ ఉత్తర్వులు జారీ చేయగా అతనికి జైల

Address

Police Head Quarters
Machilipatnam
521001

Alerts

Be the first to know and let us send you an email when Krishna District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Krishna District Police:

Share