Mahabubnagar District Police

Mahabubnagar District Police Mahabubnagar District Police

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్తెలంగా...
02/06/2026

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయం నందు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రజలకు మరింత చేరువై బాధ్యతాయుతంగా సేవలు అందించడం ప్రతి పోలీసు అధికారికి ముఖ్య కర్తవ్యమని సూచించారు.

అలాగే ప్రజా సంక్షేమం, మహిళల భద్రత, యువతలో చైతన్యం, సైబర్ నేరాలపై అవగాహన వంటి అంశాలలో పోలీసు శాఖ నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో AR అదనపు ఎస్పీ సురేష్ కుమార్, DSP వెంకటేశ్వర్లు, DCRB DSP రమణా రెడ్డి, వర్టికల్ DSP బాలాజీ, AO రుక్మిణి భాయ్, RI లు కృష్ణయ్య నగేష్ అశోక్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

02/06/2026

మన తెలంగాణ కోటి రతనాల వీణ. సిరులు పండే ఈ నేల ఖ్యాతిని పెంచేలా నడుచుకుందాం. మన తెలంగాణ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేద్దాం. సాటివారిపట్ల ప్రేమ, సహనాన్ని కలిగి ఉంటూ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలి.

జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీప్రజా సమస్యల పరిష్కారం, నాణ్యమైన దర్యాప్తుపై ప్రత...
01/06/2026

జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ

ప్రజా సమస్యల పరిష్కారం, నాణ్యమైన దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ఎన్‌హెచ్-44పై ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

నిష్పక్షపాత విధులతో ప్రజల విశ్వాసం పెంపొందించాలి

హెల్మెట్ ధరించడం తప్పనిసరి… పోలీసులే ప్రజలకు ఆదర్శం కావాలి

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నిర్వహిస్తున్న ఎఫ్‌ఐఆర్ నమోదు విధానం, స్టేషన్ డైరీలు, పెండింగ్ కేసులు, రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, బీట్ బుక్స్, సీజ్ ప్రాపర్టీ రికార్డులు, వారెంట్ల అమలు, సీసీటీఎన్‌ఎస్ నమోదు విధానం తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.

ప్రతి కేసును సమయానుకూలంగా నమోదు చేసి సీసీటీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, ప్రతి దశలో పారదర్శకత మరియు జవాబుదారీతనం పాటించాలని స్పష్టం చేశారు.

రాష్ట్ర డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ గారి ఆదేశాలను సిబ్బందికి వివరిస్తూ, నిష్పక్షపాత విధులే పోలీసుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలని సూచించారు.

ముఖ్యంగా నేషనల్ హైవే-44పై అధిక ట్రాఫిక్ రద్దీ నెలకొంటున్న నేపథ్యంలో, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పర్యవేక్షణ, అవసరమైన చోట ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

అలాగే పోలీస్ స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణ వంటి అంశాలను కూడా పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని మర్యాదగా పలకరిస్తూ, వారి సమస్యలను ఓర్పుతో విని చట్టపరమైన సహాయం అందించాలని సిబ్బందికి సూచించారు.

పోలీస్ సిబ్బంది ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం తగ్గుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసులే ప్రజలకు ఆదర్శంగా ఉండాలని పేర్కొంటూ, హెల్మెట్ లేకుండా వచ్చే సిబ్బందిని పోలీస్ స్టేషన్‌లోకి అనుమతించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం స్టేషన్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ, వారి విధుల నిర్వహణకు సంబంధించిన అంశాలు మరియు వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత ఇబ్బందులు ఉన్న సిబ్బంది ప్రతి శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేరుగా తనను కలవవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ కమలాకర్, ఎస్‌ఐలు జయప్రసాద్, ఖాదర్, అక్షయదీప్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండకూడదు : జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంల...
01/06/2026

ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండకూడదు : జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి పరిశీలించారు. కుటుంబ వివాదాలు, భూ సమస్యలు, ఆర్థిక మోసాలు, సైబర్ నేరాలు మరియు ఇతర అంశాలకు సంబంధించిన పలువురు బాధితుల వినతులను ఓర్పుతో విని సంబంధిత పోలీస్ అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడం పోలీసు శాఖ యొక్క ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా విచారించి చట్టపరమైన చర్యల ద్వారా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి అధికారి ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ స్పందనాత్మకంగా పనిచేయాలని సూచించారు.
అలాగే మహిళలు, వృద్ధులు మరియు సైబర్ మోసాలకు గురైన బాధితుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.

గౌరవ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి IPS గారి ఆదేశాల మేరకు జడ్చర్ల  పోలీస్ స్టేషన్ పరిధిలోని   స్థానిక శ్రీనివాస PVT ITI ల...
01/06/2026

గౌరవ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి IPS గారి ఆదేశాల మేరకు జడ్చర్ల
పోలీస్ స్టేషన్ పరిధిలోని
స్థానిక
శ్రీనివాస PVT ITI లో
సురక్ష పోలీసు కళా బృందం,
AHTU, SHE టీమ్ సభ్యుల ఆధ్వర్యంలో
“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత” కార్యక్రమం జరిగింది.

కార్యక్రమంలో క్రింది అంశాలపై అవగాహన కల్పించారు:

✅ లింగ వివక్ష (Sexism), జెండర్ బియాస్ (Gender Bias), వివక్ష (Discrimination), మిసోజనీ (Misogyny) గురించి అవగాహన కల్పించారు.

✅ షీ టీమ్‌ను ఎలా సంప్రదించాలి, ఈవ్ టీజింగ్ ఫిర్యాదులు ఎలా ఇవ్వాలి, టి-సేఫ్, మానవ అక్రమ రవాణా (Human Trafficking), అక్రమ దత్తత వంటి నేరాలు మరియు మహిళల హెల్ప్ డెస్క్, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ గురించి వివరించారు.
మహిళలని అమ్మాయిల్ని వేధిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నదానిపై విద్యార్థులకు సూచనలు చేయడం జరిగింది.
ఆపత్సమయంలో SHE Team NO; 8712659365ని
AHTU NO; 8712680066 లేదా 100 Dial
సంప్రదించి సహాయం పొందాలని సూచించారు.

✅ బాల్య వివాహాలు, బాల కార్మికత్వం / బాండెడ్ లేబర్ గురించి తెలియజేశారు.
ఎక్కడైనా ఇలాంటి సమాచారం ఉంటే 1098 నంబరుకు ఫిర్యాదు చేయాలి.

✅ ఇంటర్నెట్ భద్రత మన చేతుల్లోనే ఉంది – వ్యక్తిగత సమాచారాన్ని ఎలా రక్షించుకోవాలో సూచించారు.
ఎవరైనా ఎప్పుడైనా సైబర్ క్రైమ్ బాధితులైతే వెంటనే
1930 నంబర్ ను సంప్రదించాలి.

✅ సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన రక్షణ & భద్రతా చర్యలు వివరించారు.

ఈ కార్యక్రమంలో
లెక్చరర్స్ కృష్ణయ్య, విష్ణు, మల్లేష్, ప్రశాంత్ గార్లు
ASI శ్రీమతి జయరాణి SHE Team, చందర్ రావు PC
శ్రీమతి జ్యోతి HC AHTU Team,
సురక్ష పోలీసు కళాబృందం సభ్యులు డి.రాములు HC, D.జగదీష్ PC,
విద్యార్థులు సిబ్బంది
పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు: జిల్లా యస్.పి  డి.జానకి.శాంతి భద్రతలను దృష్టి...
01/06/2026

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు: జిల్లా యస్.పి డి.జానకి.

శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
కావున జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టకూడదని హెచ్చరించారు. ఇట్టి విషయంలో జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు వారికి సహకరించవలసిందిగా ఎస్పీ గారు సూచించారు.
అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

హన్వాడ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్నిష్పక్షపాత విధులు, ప్రజలకు సత...
31/05/2026

హన్వాడ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్

నిష్పక్షపాత విధులు, ప్రజలకు సత్వర సేవలపై ఎస్పీ దిశానిర్దేశం

మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు ఆదివారం సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, ఎఫ్‌ఐఆర్ నమోదు విధానం, స్టేషన్ డైరీలు, పెండింగ్ కేసులు, రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, బీట్ బుక్స్, సీజ్ ప్రాపర్టీ రికార్డులు, వారెంట్ల అమలు, సీసీటీఎన్‌ఎస్ నమోదు విధానం, ఆన్‌లైన్ అప్డేట్స్ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.

ప్రతి కేసును సమయానుకూలంగా నమోదు చేసి సీసీటీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. కేసుల దర్యాప్తులో నాణ్యత పెంపొందించడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఫిర్యాదుల స్వీకరణ నుంచి కేసుల దర్యాప్తు వరకు ప్రతి దశలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేశారు.

రాష్ట్ర డీజీపీ శ్రీ సి.వి.ఆనంద్, ఐపిఎస్ గారు ఇచ్చిన ఆదేశాలను జిల్లా ఎస్పీ గారు సిబ్బందికి వివరించారు. నిష్పక్షపాత విధులే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీజీపీ సూచించినట్లు తెలిపారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

అలాగే పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణ వంటి అంశాలను కూడా జిల్లా ఎస్పీ పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి దరఖాస్తుదారుతో మర్యాదగా మాట్లాడాలని, వారి సమస్యలను ఓర్పుతో విని చట్టపరమైన సహాయం అందించాలని సిబ్బందికి సూచించారు.

పోలీస్ సిబ్బంది ద్విచక్ర వాహనాలు నడుపుతున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. హెల్మెట్ ధరించడం ద్వారా రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం తగ్గుతుందని తెలిపారు. పోలీస్ సిబ్బందే ప్రజలకు ఆదర్శంగా ఉండాలని పేర్కొంటూ, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై వచ్చే సిబ్బందిని పోలీస్ స్టేషన్‌లోకి అనుమతించవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం స్టేషన్ సిబ్బందితో జిల్లా ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత సమస్యలు ఉన్న సిబ్బంది ప్రతి శనివారం జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి నేరుగా తనను కలవవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో DSP వెంకటేశ్వర్లు, DCRB DSP రమణా, రూరల్ సీఐ గాంధీ నాయక్, హన్వాడ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీసులుజిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి ఐపీఎస్ గారి ఆద...
29/05/2026

మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీసులు

జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ పట్టణంలో మైనర్ డ్రైవింగ్ నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి, వారి తల్లిదండ్రులతో సహా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగినది. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం వలన జరిగే ప్రమాదాలు, చట్టపరమైన చర్యలు మరియు ప్రాణాపాయ పరిస్థితుల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, మైనర్ డ్రైవింగ్ అనేది చాలా ప్రమాదకరమైందని, చిన్న వయస్సులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధారణ, సీట్‌బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ వంటి నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. ప్రజల సహకారంతో మహబూబ్‌నగర్‌ను “ఆక్సిడెంట్ ఫ్రీ మహబూబ్‌నగర్”గా తీర్చిదిద్దాలని పోలీసులు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి మరియు ఇతర ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

బక్రీద్ సందర్భంగా ఈద్గా వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి ఐపీఎస్బక్రీద్ పండుగ సందర్భంగ...
28/05/2026

బక్రీద్ సందర్భంగా ఈద్గా వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి ఐపీఎస్

బక్రీద్ పండుగ సందర్భంగా మహబూబ్‌నగర్ పట్టణంలోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి ఐపీఎస్ గారు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు మరియు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకుంటున్న చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

అలాగే జిల్లాలోని అన్ని ఈద్గా ప్రాంగణాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి ఐపీఎస్ గారు జిల్లా ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం సోదరులు, సోదరీమణులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ పండుగను సోదరభావంతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
బందోబస్త్ నందు అదనపు ఎస్పి NB రత్నం, AR అదనపు ఎస్పీ సురేష్ కుమార్, DSP వెంకటేశ్వర్లు, DCRB DSP రమణా రెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, SB ఇన్స్పెక్టర్ మోతిరాం, CCS inspector కృష్ణా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా ముస్లిం సోదర సోదరీమణులందరికీ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, IPS ...
28/05/2026

బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా ముస్లిం సోదర సోదరీమణులందరికీ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, IPS గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

త్యాగానికి, ప్రేమకు, సోదరభావానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ శాంతి, సామరస్య వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Address

Opp Union Bank Main Branch
Mahabubnagar
509001

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahabubnagar District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share