05/06/2026
ప్రపంచ పర్యావరణ దినోత్సవం ( ) సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి & అటవీ శాఖ మంత్రి శ్రీ Pawan Kalyan గారు ములపాడు బటర్ఫ్లై పార్క్లో 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
స్వయం సహాయక సంఘాల మహిళలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు అధికారులతో కలిసి స్థానిక జాతుల విత్తనాలతో స్వయంగా సీడ్ బాల్స్ తయారు చేసి, అడవుల్లో డ్రోన్ల ద్వారా విత్తనాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.
జూన్ 15 నాటికి 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి ఈకో-టూరిజం పార్క్లో యోగా హాల్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడంతో పాటు, సంప్రదాయ కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు ప్రచారం మరియు "వుడ్ బ్యాంక్" కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.
పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణం వైపు ఇది ఒక కీలక ముందడుగు. 🌱🌍
పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ప్రతి సీడ్ బాల్ ఒక ఆశాకిరణం. 🌍💚