Team NaraLokesh

Team NaraLokesh జై తెలుగుదేశం

*తాడేపల్లి ముస్లిం స్మశాన వాటిక 'జన్నతుల్ బఖీ' లో మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో ఆధునిక సౌకర్యాలు**అభివృద్ధి చేసిన పనుల...
16/07/2026

*తాడేపల్లి ముస్లిం స్మశాన వాటిక 'జన్నతుల్ బఖీ' లో మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో ఆధునిక సౌకర్యాలు*

*అభివృద్ధి చేసిన పనులకు ప్రారంభించిన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, మాజీ మండలి ఛైర్మన్ మహ్మద్ అహ్మద్ షరీఫ్*

తాడేపల్లి, జూలై 16 : తాడేపల్లి మండలం పోలకంపాడులోని ముస్లిం స్మశాన వాటిక "జన్నతుల్ బఖీ"లో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ తన సొంత నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తికావడంతో, వాటిని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, శాసన మండలి మాజీ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ వ్యవహారాల నేత మహ్మద్ అహ్మద్ షరీఫ్ ప్రారంభించారు.

ముస్లిం సోదరుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్మశాన వాటికలో ప్రహరీ గోడ, ఆకర్షణీయమైన ముఖద్వారం, ఆరు మినార్లు, వజూ ఖానా, గ్రీనరీ, కార్యాలయ గది, స్టోర్ రూమ్, వాచ్‌మన్ గది,ఐ మాక్స్ లైటింగ్, అంతర్గత మౌలిక సదుపాయాలు, విశ్రాంతి కోసం సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయడంతో పాటు, 80 ట్రక్కుల మట్టితో లెవెలింగ్ పనులు చేపట్టి అంతిమ సంస్కారాలకు వచ్చే కుటుంబ సభ్యులకు గౌరవప్రదమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించారు.

ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలు, మత పెద్దలు మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మాట్లాడుతూ, ప్రతి మనిషి జీవితంలోని చివరి ఘట్టమైన అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా, సంప్రదాయబద్ధంగా జరిగేలా అవసరమైన సదుపాయాలు కల్పించాలనే సంకల్పంతో మంత్రి నారా లోకేష్ ఈ పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. ముస్లిం సమాజం అవసరాలను గుర్తించి అన్ని హంగులతో స్మశాన వాటికను అభివృద్ధి చేయించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

శాసన మండలి మాజీ ఛైర్మన్ మహ్మద్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి మనోభావాలను గౌరవిస్తూ అందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తున్న నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు. సొంత నిధులతో ముస్లిం స్మశాన వాటికను అభివృద్ధి చేయించడం ఆయన సేవాభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. మంగళగిరి ప్రజలు అలాంటి సమర్థ నాయకుడిని ఎన్నుకోవడం అదృష్టమని, చివరి మజిలీ కూడా గౌరవప్రదంగా జరిగేలా లోకేష్ చొరవ తీసుకోవడం ప్రశంసనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు, ప్రధాన కార్యదర్శి దార దాసు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంఎస్ బేగ్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా, ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షుబ్లీ, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండీ ఇబ్రహీం, స్టేట్ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ అక్రమ్, స్టేట్ హజ్ కమిటీ సభ్యులు షేక్ జబిన్,పఠాన్ ఖాసీం ఖాన్,షేక్ రియాజ్, అబ్దుల్ మజీద్, ఎండీ నిజాముద్దీన్,పఠాన్ జానీ ఖాన్, ఫిరోజ్,షేక్ హన్నన్,అబ్దుల్లా ఖాన్,షేక్ సుభాని, నాగుల్ మీరా, చాంద్ బాషా, మస్తాన్ వలి, దుబాయ్ మస్తాన్, జామియా మస్జీద్, నూరాని మస్జీద్, మామూర్ మస్జీద్, పోలకంపాడు మక్కా మస్జీద్ కమిటీల సభ్యులు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

*నిడమర్రు జెడ్పిహెచ్ఎస్ మోడల్ స్కూల్‌లో అడ్మిషన్లకు విశేష స్పందన, నో అడ్మిషన్స్ బోర్డులు**మంత్రి నారా లోకేష్ చొరవతో అంతర...
04/07/2026

*నిడమర్రు జెడ్పిహెచ్ఎస్ మోడల్ స్కూల్‌లో అడ్మిషన్లకు విశేష స్పందన, నో అడ్మిషన్స్ బోర్డులు*

*మంత్రి నారా లోకేష్ చొరవతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమైన తొలి మోడల్ స్కూల్*

మంగళగిరి :మంగళగిరి నియోజకవర్గం నిడమర్రులో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారి చొరవతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన మోడల్ స్కూల్‌కు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నారా లోకేష్ గారి విజన్‌కు ప్రతీకగా రూపుదిద్దుకున్న ఈ విద్యా సంస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు సుమారు రూ.16 కోట్ల వ్యయంతో 5.2 ఎకరాల విస్తీర్ణంలో నిడమర్రు జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో ఈ మోడల్ స్కూల్‌ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించే లక్ష్యంతో అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేశారు.

తరగతి గదుల్లో గ్రీన్ బోర్డులు, చార్ట్ బోర్డులు, డిజిటల్ బోధన కోసం ఐఎఫ్‌పీ ప్యానెల్స్, ఆధునిక టేబుల్స్, కుర్చీలు ఏర్పాటు చేశారు. క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ ఫుట్‌బాల్ మైదానం, 200 మీటర్ల రన్నింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, ఫ్లడ్ లైట్స్, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టులతో పాటు మల్టీ స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియాన్ని నిర్మించారు. సుమారు 400 మంది విద్యార్థులు వీక్షించే సామర్థ్యంతో యాంఫీ థియేటర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

సైన్స్ మ్యూజియం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ ల్యాబ్‌లు, ఆటల్ టింకరింగ్ ల్యాబ్, ఆధునిక గ్రంథాలయం వంటి సౌకర్యాలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు దోహదపడనున్నాయి. 500 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసే డైనింగ్ హాల్, ఆర్వో తాగునీటి ప్లాంట్, 40 సీసీ కెమెరాలతో భద్రతా వ్యవస్థ, ప్రత్యేక పార్కింగ్ స్థలం, కిచెన్ గార్డెన్, చిన్నారుల కోసం ఆధునిక ఆట పరికరాలతో చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేశారు.

ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థుల కోసం 28 తరగతి గదులు, తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థుల కోసం ప్రత్యేక బ్లాక్‌లో 12 తరగతి గదులు నిర్మించారు. చిన్నారుల్లో చదువుపై ఆసక్తి పెంచేలా గోడలపై ఆకర్షణీయమైన చిత్రాలు రూపొందించారు. సాంకేతికత ఆధారిత బోధనతో ఈ పాఠశాల విద్యారంగంలో కొత్త దిశను చూపుతోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక చొరవతో నిర్మితమైన నిడమర్రు మోడల్ స్కూల్‌లో అడ్మిషన్లకు తల్లిదండ్రులు భారీగా ఆసక్తి చూపుతుండగా, ప్రస్తుతం అడ్మిషన్స్ పూర్తి అయ్యాయి,భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్య అందించే కేంద్రంగా ఈ పాఠశాల నిలవనుందని స్థానికులు పేర్కొన్నారు.

********************

*మంగళగిరి నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన**నూతన యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి**...
03/07/2026

*మంగళగిరి నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన*

*నూతన యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి*

*వాహనశాల, గంటా మండపం పునర్నిర్మాణం*

*శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణకు భూమిపూజ*

*రూ.6.3 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి లోకేష్*

మంగళగిరి: ప్రముఖ పుణ్యక్షేత్రం మంగళగిరి దిగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జీర్ణోద్ధరణ పనులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నూతన యాగశాల నిర్మాణంతో పాటు వాహనశాల, గంటా మండపం పునర్నిర్మాణం, శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆలయ అధికారులు ఏర్పాటుచేసిన నమూనా చిత్రాలను పరిశీలించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని, రాజ్యలక్ష్మీ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదాశీర్వచనం చేసిన స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

*రూ.6.3 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం*

దేవాదాయ శాఖ నిధులు రూ.6.3 కోట్ల వ్యయంతో శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణతో పాటు యాగశాల, గంటా మండపం, వాహనశాల పునర్నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా దేవాలయం మొత్తం కలియతిరిగిన మంత్రి నారా లోకేష్ అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు కావాల్సిన వసతులు, ఆలయ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం కల్పించడంతో పాటు నిత్యప్రసాదానికి చర్యలు తీసుకోవాలన్నారు. పుష్కరిణిని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అందరితో కలిసి ఫోటోలు దిగారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్, ఆలయ ఈవో కోగంటి సునీల్ కుమార్, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులతో పాటు పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీ దేవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షులు కేశంనేని శ్రీ అనిత తదితరులు పాల్గొన్నారు.
*****

డిజైన్‌పై ఉన్న అభిరుచిని విజయవంతమైన ఆభరణాల బ్రాండ్‌గా మలిచిన యువ పారిశ్రామికవేత్త ప్రియాంక బొడ్డపాటి నేటి తరం మహిళల కోసం...
25/06/2026

డిజైన్‌పై ఉన్న అభిరుచిని విజయవంతమైన ఆభరణాల బ్రాండ్‌గా మలిచిన యువ పారిశ్రామికవేత్త ప్రియాంక బొడ్డపాటి నేటి తరం మహిళల కోసం మినిమల్ జ్యువెలరీకి కొత్త నిర్వచనం ఇస్తున్నారు.

సెలారా ఫైన్ జ్యువెలరీ వ్యవస్థాపకురాలైన ప్రియాంక, కళాశాల విద్యార్థినులు, ఉద్యోగినులు మరియు నగర జీవనశైలికి అనుగుణంగా ఉండే మహిళల కోసం అందమైన, అందుబాటు ధరల్లో లభించే, ప్రతిరోజూ ధరించగలిగే ఆభరణాలను అందిస్తున్నారు. స్టైలిష్, సులభంగా అందుబాటులో ఉండే మరియు ఎప్పటికీ ట్రెండ్‌లో ఉండే ఫైన్ జ్యువెలరీని అందించాలనే లక్ష్యంతో ఆమె ఈ బ్రాండ్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

ఈ ప్రేరణాత్మక ఇంటర్వ్యూలో ప్రియాంక తన వ్యాపార ప్రయాణం, సెలారా ఫైన్ జ్యువెలరీ ప్రారంభం వెనుక కథ, వ్యాపార నిర్మాణంలో ఎదురైన సవాళ్లు, మారుతున్న వినియోగదారుల అభిరుచులు, పోటీతో కూడిన రంగంలో ప్రత్యేక బ్రాండ్‌ను ఎలా నిర్మించాలనే అంశాలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఇటీవల నారా బ్రాహ్మణి చేతుల మీదుగా కోకాపేట్ స్టోర్ ప్రారంభం కావడం, అలాగే జూబ్లీహిల్స్‌లో కొత్త స్టోర్ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయడం ద్వారా సెలారా ఫైన్ జ్యువెలరీ ఆభరణాల రంగంలో తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటోంది.

💎 యువ మహిళా పారిశ్రామికవేత్తగా విజయపథంలో దూసుకెళ్తున్న ప్రియాంక బొడ్డపాటి ప్రయాణం, బ్రాండింగ్, జ్యువెలరీ ట్రెండ్స్ మరియు వ్యాపార విజయ రహస్యాల గురించి తెలుసుకోవడానికి ఈ పూర్తి ఇంటర్వ్యూను తప్పకుండా వీక్షించండి.

From a passion for design to building a fast-growing jewellery bran...

*తాడేపల్లి ముస్లిం స్మశాన వాటికలో అభివృద్ధి పనులు పూర్తి**సొంత నిధులతో సౌకర్యాలు కల్పించిన మంత్రి నారా లోకేష్‌కు ముస్లిం...
22/06/2026

*తాడేపల్లి ముస్లిం స్మశాన వాటికలో అభివృద్ధి పనులు పూర్తి*

*సొంత నిధులతో సౌకర్యాలు కల్పించిన మంత్రి నారా లోకేష్‌కు ముస్లిం కుటుంబాలు, మత పెద్దల కృతజ్ఞతలు*

తాడేపల్లి, జూన్ 22: రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులతో తాడేపల్లి మండలం పోలకంపాడులోని ముస్లిం స్మశాన వాటికలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ముస్లిం సోదరుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్మశాన వాటికలో పలు మౌలిక సదుపాయాలను కల్పించారు.

స్మశాన వాటికలో ప్రహరీ గోడ నిర్మాణం, ముఖద్వారం,ఆరు మినార్ ల ఏర్పాటు,వజూ ఖానా, గ్రీనరీ, ఆఫీస్ రూమ్, స్టోర్ రూమ్, వాచ్ మాన్ రూమ్,, ఐమాక్స్ లైటింగ్ పోల్,మౌళిక సదుపాయాలు,విశ్రాంతి కోసం సిమెంట్ బల్లలు వంటి పనులను పూర్తి చేశారు. 80 ట్రక్కుల మట్టితో లెవెలింగ్ చేయించారు దీంతో అంతిమ సంస్కారాలకు వచ్చే కుటుంబ సభ్యులకు అన్ని విధాలా సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడిందని స్థానికులు తెలిపారు.

మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలోని స్మశాన వాటికలను అభివృద్ధి చేయడంపై స్థానిక ముస్లిం కుటుంబాలు, మత పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి మనిషి జీవితంలోని అఖరి మజిలీ అయిన అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలనే సంకల్పంతో మంత్రి నారా లోకేష్ ఈ అభివృద్ధి పనులు చేపట్టడం సంతోష కరమైన విషయమని తెలిపారు

ముస్లిం సమాజం అవసరాలను గుర్తించి స్మశాన వాటికను అన్ని హంగులతో అభివృద్ధి చేయించిన మంత్రి నారా లోకేష్‌కు స్థానిక ముస్లిం కుటుంబాలు, మత పెద్దలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

*****************

*మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానాన్ని సందర్శించిన మంత్రి లోకేష్**రూ.3.25 కోట్ల వ్యయంతో హిందూ శ్మశాన వాటిక ఆధునీకరణ*మంగళగిరి:...
17/06/2026

*మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానాన్ని సందర్శించిన మంత్రి లోకేష్*

*రూ.3.25 కోట్ల వ్యయంతో హిందూ శ్మశాన వాటిక ఆధునీకరణ*

మంగళగిరి: పాత మంగళగిరి బిట్రావారి వీధి, దింపుడు కళ్లం వద్ద ఆధునిక సదుపాయాలతో నిర్మించిన మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానాన్ని ఆధునీకరించారు. మొత్తం 2.90 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. ఇందులో 1.90 ఎకరాలు హిందూ శ్మశానవాటిక కాగా.. మరో ఎకరం క్రైస్తవుల సమాధుల కోసం కేటాయించారు. హిందూ వైకుంఠ మహాప్రస్థానాన్ని ఫీనిక్స్ ఫౌండేషన్ రూ.3.25 కోట్ల సీఎస్ఆర్ నిధుల భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. దీంతో పాటు మంత్రి లోకేష్ సొంత నిధులను కూడా వెచ్చించారు.

ఈ ప్రాజెక్ట్ లో భాగంగా నాలుగు ఆధునిక దహన వేదికలు(ఉడ్ ఫైర్స్), వాటి ఎదురుగా నాలుగు నిరీక్షణ మందిరాలు, అంత్యక్రియలకు హాజరయ్యే బంధువుల సౌకర్యార్థం ఒకేసారి 60 మంది కూర్చోవడానికి వీలుగా భోజనశాల నిర్మించారు. భోజనశాల పక్కనే కార్యాలయంతో పాటు అస్థికలు భద్రపరిచే గది నిర్మించారు. పిండ ప్రదానాల కోసం రెండు ప్రత్యేక ఆచార గదులు, స్టోర్ రూమ్, క్షౌరశాల ఏర్పాటుచేశారు. పురుషులు, మహిళలకు రెండు వేర్వేరు మరుగుదొడ్లు, దహన సంస్కారాలకు కలప నిల్వ చేసేందుకు ప్రత్యేక షెడ్, రెండు మార్చురీ బాక్స్ లు, విద్యుత్ అంతరాయం లేకుండా 15 కేవీఏ సామర్థ్యం గల జనరేటర్ ఏర్పాటుచేశారు. ఆవరణలో సుందరీకరణ పనులు, శిల్పాలు, సోలార్ వీధి దీపాలు, కార్యాలయ, భోజనశాల ఫర్నీచర్, నిరీక్షణ మందిరాల కోసం 50 కుర్చీలు ఏర్పాటుచేశారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, మండల పార్టీ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
*****

*కాజ ఈస్ట్ లేక్ పార్క్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్* *రూ.3.3 కోట్ల వ్యయంతో పార్క్ నిర్మాణం*మంగళగిరి: మంగళగిరి మండలం కాజ...
17/06/2026

*కాజ ఈస్ట్ లేక్ పార్క్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్*

*రూ.3.3 కోట్ల వ్యయంతో పార్క్ నిర్మాణం*

మంగళగిరి: మంగళగిరి మండలం కాజ గ్రామంలోని ఉప్పలపాడు-నంబూరు-కాజ రోడ్డు మార్గంలో ఆధునిక హంగులతో నిర్మించిన కాజ ఈస్ట్ లేక్ పార్క్ ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా కాజ లేక్ పార్క్ కు చేరుకున్న మంత్రి లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ లకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కాజ ఈస్ట్ లేక్ పార్క్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. పార్క్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కను నాటారు. అనంతరం పార్క్ మొత్తం కలియతిరిగి వసతులను పరిశీలించారు. సెల్ఫీ తీసుకున్నారు.

*రూ.3.3 కోట్ల వ్యయంతో పార్క్ నిర్మాణం*

మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన పర్యావరణం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా కాజ గ్రామంలో ఈస్ట్ లేక్ పార్క్ ను నిర్మించారు. సెల్ కాన్ సంస్థ రూ.3.3 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఈ పార్క్‌ను అభివృద్ధి చేయడం జరిగింది. 17.18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు చుట్టూ ఆధునిక హంగులతో పార్క్‌ను తీర్చిదిద్దారు. ఇప్పటికే ఉన్న చెరువు కట్టను 1.7 కిలోమీటర్ల మేర బలోపేతం చేశారు. పార్క్‌లో 42 రకాల జాతులకు చెందిన మొత్తం 12,800 మొక్కలను నాటారు. 1.7 కిలోమీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం ప్రత్యేక ప్లే ఏరియా, భద్రత కోసం ట్రాక్ కు ఇరువైపులా జీఐ చైన్- లింక్ మెష్ ఫెన్సింగ్, ఆధునిక సుందరీకరణ పనులు చేపట్టి పార్క్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వాకింక్ ట్రాక్ వెంట విద్యుత్ దీపాల సౌకర్యం కల్పించారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, మండల పార్టీ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, మంగళగిరి ఏఎంసీ ఛైర్మన్ జవ్వాది కిరణ్ చందు, ఏపీ సివిల్ సప్లైస్ కార్పోరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్యతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు.
*****

*మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్**నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర...
17/06/2026

*మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్*

*నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన*

మంగళగిరి: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృషితో మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. మంగళగిరి ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. నంబూరు-మంగళగిరి సెక్షన్ మార్గంలో మంగళగిరి-నిడమర్రు మార్గంలో 14వ నెంబర్ రైల్వే లెవల్ క్రాసింగ్ గేటు స్థానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణ పనులకు ఈ ఉదయం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా మంగళగిరి-నిడమర్రు రోడ్డు వద్దకు చేరుకున్న మంత్రి లోకేష్, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ లకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు.

*రూ.142 కోట్ల వ్యయంతో ఆర్వోబీ నిర్మాణం*

మంగళగిరి నుంచి రాజధాని అమరావతికి, తాడికొండ నియోజకవర్గానికి అనుసంధానంగా నిడమర్రు రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద రూ.142 కోట్ల వ్యయంతో ఆర్వోబీని నిర్మించనున్నారు. దశాబ్దాలుగా ఈ మార్గంలో రైల్వే లెవల్ క్రాసింగ్ వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో మంత్రి లోకేష్ చొరవ తీసుకుని రైల్వే లెవల్ క్రాసింగ్ పై ఆర్వోబీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరు చేయించారు. సమస్య శాశ్వత పరిష్కారంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరుకు కృషిచేశారు. ఆర్వోబీ నిర్మాణం పూర్తయితే నిడమర్రు, మంగళగిరి, తాడికొండ, అమరావతి ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయి. ప్రజా రాజధాని అమరావతికి సులభమైన, నిరంతరాయ రవాణ అనుసంధానాన్ని కల్పిస్తుంది. మంగళగిరి, అమరావతి మధ్య ప్రయాణ దూరం తగ్గుతుంది. మంగళగిరి పట్టణం నుంచి మంగళగిరి నియోజకవర్గంలోని బేతపూడి, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ గ్రామాల ప్రజలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. భవిష్యత్ లో ఈ ప్రాంతంలో పట్టణీకరణ, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. రైల్వే క్రాసింగ్ గేటు ద్వారా రోజుకు సుమారు 60 రైళ్లు ప్రయాణిస్తాయి. రోజుకు రహదారి రాకపోకల కోసం గేటు మూసివేసే సగటు వ్యవధి 8 నుంచి 10 గంటలుగా ఉంది. లెవల్ క్రాసింగ్ గేటు మూసివేసిన సమయంలో ప్రయాణీకులు దాటేందుకు 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టేది. ఆర్వోబీ నిర్మాణంతో సుమారు నిమిషంలోనే దాటే అవకాశం ఉంది.

నిడమర్రు రైల్వే లెవల్ క్రాసింగ్ పై ఆర్వోబీ రైల్వే లైన్ పై 10 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. దీని పొడవు 767.50 మీటర్లు. ఇందులో రైల్వే లైన్ నుంచి అమరావతి వైపు 362 మీటర్లు, మంగళగిరి వైపు 405.50 మీటర్లు నిర్మాణం చేపట్టనున్నారు. వంతెనపై నాలుగు లైన్లు రహదారి ఏర్పాటుచేయనున్నారు. ప్రతి లైను 3.75 మీటర్లు కాగా మొత్తం క్యారేజ్ వే వెడల్పు 15 మీటర్లు ఉంటుంది. అదనంగా 0.45 మీటర్లు చొప్పున రెండు వైపులా క్రాష్ బ్యారియర్లు, 0.45 మీటర్లు మధ్య డివైడర్ నిర్మించనున్నారు. సర్వీసు రోడ్లు డ్రైన్లతో కలిపి రెండు వైపులా 11 మీటర్లు(5.5*2) 5.5 మీటర్ల వెడల్పుతో ఏర్పాటుచేయనున్నారు. సర్వీస్ రోడ్లతో సహా ఆర్వోబీ మొత్తం వెడల్పు 28 మీటర్లు ఉండనుంది.

ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, మండల పార్టీ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
*****

*మంగళగిరి దివ్యక్షేత్ర పునర్వైభవం: స్వామివారి సేవలో ‘లోకేశునికి’ లభించిన అదృష్టం*!​ఎన్నో యుగాలు.. ఎందరో మహారాజులు.. కానీ...
12/06/2026

*మంగళగిరి దివ్యక్షేత్ర పునర్వైభవం: స్వామివారి సేవలో ‘లోకేశునికి’ లభించిన అదృష్టం*!

​ఎన్నో యుగాలు.. ఎందరో మహారాజులు.. కానీ, ఆ నారసింహుడి సంకల్పం ఇప్పుడు నెరవేరుతోంది!

​కృతయుగంలో తోతాద్రిగా, త్రేతాయుగంలో ముక్త్యద్రిగా, ద్వాపరయుగంలో ధర్మాద్రిగా.. నేడు కలియుగంలో భక్తుల కొంగుబంగారమై వెలిసిన క్షేత్రం — మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధి. పానకాల స్వామి గర్జనతో, దిగువ సన్నిధి నారసింహుడి శాంత స్వరూపంతో విరాజిల్లుతున్న ఈ పుణ్యభూమికి ఒక ప్రత్యేకమైన చారిత్రాత్మక, ఆధ్యాత్మిక బంధం ఉంది.

​ఆనాడు.. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి, సనాతన ధర్మ రక్షకుడు శ్రీకృష్ణదేవరాయలు స్వామివారి వైభవాన్ని కీర్తిస్తూ ఇక్కడ ఒక మహోన్నతమైన మండపాన్ని నిర్మించారు. ఆ తర్వాత అమరావతి రాజు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తన భక్తికి నిదర్శనంగా 11 అంతస్తుల ఆకాశసింధూర గాలిగోపురాన్ని నిలిపారు.

​చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఆ వైభవం తర్వాత.. మళ్లీ ఇన్నాళ్లకు, ఈ కలియుగంలో ఆ స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణకు, పూర్వ వైభవానికి కాలం ఆసన్నమైంది. ఎందరో వస్తుంటారు.. పోతుంటారు.. కానీ, భగవంతుడి ఆలయాన్ని పునరుద్ధరించే మహా భాగ్యం అందరికీ దక్కదు. ఆ నారసింహస్వామే స్వయంగా ఎంచుకుంటే తప్ప, ఆ సేవ చేసే అదృష్టం లభించదు.

​నేడు, మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రూపంలో ఆ ‘నారసింహుడి సంకల్పం’ సాకారమవుతోంది.

​ఒక్క జీవితం.. ఒక్కటే అవకాశం!

ఉండవల్లి నివాసంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి నారా లోకేష్ అన్న మాటలు ప్రతి ఒక్క భక్తుడి గుండెను తాకాయి:

​"దేవుడి ఆలయాన్ని, అదీ ఇంతటి చారిత్రాత్మక క్షేత్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఇది మనకు దక్కిన అదృష్టం. భక్తుల మనోభావాలు, ఆలయ సంప్రదాయాలు దెబ్బతినకుండా పకడ్బందీగా ఈ పనులు జరగాలి."

​ఈ మాటల్లో ఒక బాధ్యతగల ప్రజాప్రతినిధి మాత్రమే కాదు.. స్వామివారి పట్ల అనన్యమైన భక్తి కలిగిన ఒక సేవకుడు కనిపించాడు. అందుకే, మంగళగిరి భక్తజనం ముక్తకంఠంతో అంటోంది: "ఎందరో వచ్చారు.. కానీ స్వామివారు లోకేష్‌నే ఎంచుకున్నారు. ఇది లోకేష్ గారి పూర్వజన్మ సుకృతం.. మంగళగిరి ప్రజల అదృష్టం!"

​చరిత్రను పునర్లిఖిస్తూ.. రూ. 6 కోట్లతో మహా సంకల్పం
​ఈ పునరుద్ధరణ కేవలం రాళ్లు, రప్పల నిర్మాణం కాదు; మన సంస్కృతికి, చరిత్రకు పోయబోతున్న ప్రాణం! దాతల సహకారంతో, రూ. 6 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టబోయే ఈ మహా కార్యంలో ప్రధాన ఘట్టాలు ఇవే:

​శ్రీకృష్ణదేవరాయల మండప పునరుద్ధరణ: రాయల కాలం నాటి ఆ అద్భుత శిల్పకళా వైభవాన్ని, చారిత్రాత్మక వారసత్వాన్ని తర్వాతి తరాలకు అందించేలా పునర్నిర్మాణం.

​యాగశాల, గంట మండపాల నిర్మాణం: వైఖానస ఆగమ శాస్త్ర సంప్రదాయాల ప్రకారం, యజ్ఞయాగాదులు వైభవంగా సాగేలా నూతన యాగశాల, గంభీరమైన నాదంతో మారుమోగేలా గంట మండప పునర్నిర్మాణం.

​వాహనశాల నూతన నిర్మాణం: స్వామివారి ఉత్సవ వాహనాలను అత్యంత పవిత్రంగా, భద్రంగా ఉంచేందుకు అత్యాధునిక, సాంప్రదాయ శైలి వాహనశాల.

​జులై 3.. మంగళగిరి చరిత్రలో సువర్ణాక్షరాల ఘట్టం

​ఆగమ శాస్త్ర నిపుణులు, వాస్తుశిల్పి పరమేశ్వరప్ప పర్యవేక్షణలో రూపొందిన ఈ ప్లాన్‌కు మంత్రి లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాబోయే జులై 3వ తేదీన ఈ చారిత్రాత్మక జీర్ణోద్ధరణ పనులకు శంకుస్థాపన జరగబోతోంది.

​శతాబ్దాల నాటి వైభవాన్ని కళ్లజూడాలని తపిస్తున్న భక్తుల కలలను నిజం చేస్తూ.. మంగళగిరి నారసింహుడి పాదాల చెంత సేవకుడిగా నిలిచిన ‘లక్కీ లోకేష్’ నేతృత్వంలో ఈ క్షేత్రం మరింత దేదీప్యమానంగా వెలగబోతోంది.

​ఓం నమో నారసింహాయ!

మంగళగిరి క్షేత్రే.. శ్రీ లక్ష్మీనరసింహ స్వామినే నమః!

(కంటెంట్ క్రెడిట్స్ #చాకిరేవు)

*మంగళగిరి నియోజకవర్గంలో మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ* – మొహమ్మద్ ఇబ్రహీంమంగళగిరి నియ...
12/06/2026

*మంగళగిరి నియోజకవర్గంలో మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ* – మొహమ్మద్ ఇబ్రహీం

మంగళగిరి నియోజకవర్గంలో గత రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి సొంత నిధులతో, ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు అమలు చేశారని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్, మంగళగిరి నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ ఇబ్రహీం తెలిపారు.

మైనారిటీల మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం, చిర్రావూరు, మంగళగిరి మండలం నవులూరు, పోలకంపాడు ముస్లిం బరియల్ గ్రౌండ్ల అభివృద్ధి పనులు సొంత నిధులతో చేపట్టారని తెలిపారు. మెల్లంపూడి ఈద్గాహ్ అభివృద్ధికి రూ.7 లక్షలు, చిలువూరు ఈద్గాహ్ నిర్మాణానికి రూ.10 లక్షలు, కంఠంరాజు కొండూరు ముస్లిం షాదీఖానా మరమ్మత్తులకు రూ.10 లక్షలు సొంత నిధుల ద్వారా అందించారని తెలిపారు, యంటీయంసీ నిధులతో యర్రబాలెం ముస్లిం బరియల్ గ్రౌండ్ అభివృద్ధి పరిచారని తెలిపారు

నులకపేటలో సీఎస్ఆర్ నిధులతో మైనారిటీల కోసం ప్రత్యేక కమ్యూనిటీ హాల్ నిర్మించగా,సొంత నిధులతో నూరాని మస్జీద్‌కు బోర్, పైప్‌లైన్ ఏర్పాటు చేయించారని తెలిపారు. మంగళగిరి నూర్ మస్జీద్‌కు రూ.5 లక్షలతో లిఫ్ట్ నిర్మాణం, పాత మంగళగిరి హజరత్ అలీ పీర్ల పంజా భవన నిర్మాణానికి రూ.2.50 లక్షల సాయం అందించారని పేర్కొన్నారు.

చిలువూరు మైనారిటీ కాలనీలో ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు పూర్తి చేయించారని, పెనుమూలి బరియల్ గ్రౌండ్ లెవెలింగ్‌కు ప్రణాళికలు సిద్ధం చేశారని, తుమ్మపూడి ఈద్గాహ్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.

సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 109 మంది మైనారిటీలకు రూ.66,92,475 చెక్కుల రూపంలో, మరో 37 మందికి ఎల్వోసీ ద్వారా రూ.75,47,340 వైద్య సహాయం అందజేశారని చెప్పారు. అలాగే సొంత నిధులతో ఇమామ్‌లు, మౌజన్‌లకు ప్రభుత్వం వచ్చాక రెండు సార్లు రంజాన్ తోఫా అందించారని తెలిపారు.

స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా 154 మంది మైనారిటీ మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారని, గత రెండు సంవత్సరాల్లో మరణించిన 77 మంది మైనారిటీ కుటుంబాలకు మట్టి ఖర్చుల నిమిత్తం ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున సాయం అందించారని పేర్కొన్నారు.

అదేవిధంగా 184 ముస్లిం జంటలకు పెళ్లి కానుకలు అందించడంతో పాటు స్వయం ఉపాధి కోసం మైనారిటీ యువతకు టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లు, బడ్డీ కొట్లు, వెల్డింగ్ మెషిన్లు, ఫ్లాట్‌ఫామ్ రిక్షాలు అందజేసి ఆర్థికంగా నిలదొక్కుకునేలా మంత్రి నారా లోకేష్ కృషి చేశారని మొహమ్మద్ ఇబ్రహీం తెలిపారు.

భవిష్యత్తులో కూడా మంగళగిరి నియోజకవర్గంలోని మైనారిటీ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి మంత్రి నారా లోకేష్ ఇదే విధంగా అండగా ఉంటారని ఆయన అన్నారు.

***************************


Address

Mangalagiri

Alerts

Be the first to know and let us send you an email when Team NaraLokesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share