04/08/2026
*ఆపరేషన్ ముస్కాన్–2026 విజయవంతం.*
*జిల్లా కేంద్రంలో సంయుక్త ముగింపు సమావేశం నిర్వహణ*
ఈ రోజు **ఆపరేషన్ ముస్కాన్–XII ముగింపు సమావేశం** నిర్వహించడం జరిగింది. గత నెల రోజులుగా ములుగు జిల్లా వ్యాప్తంగా పిల్లలను గుర్తించి, రక్షించి వారికి అవసరమైన సంరక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది.
ఈ ప్రత్యేక ఆపరేషన్లో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, బాల కార్మికులు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను గుర్తించి మొత్తం 138 మంది చిన్నారులను రక్షించడం జరిగింది. వీరిలో 86 బాలురు మంది , 52 మంది బాలికలు ఉన్నారు. ఇందులో **24 మంది బాల కార్మికులు, 112 మంది డ్రాప్అవుట్ పిల్లలు, 1 రన్అవే చైల్డ్ మరియు 1 అనాథ బాలుడు** ఉన్నారు. డ్రాప్అవుట్ పిల్లల్లో కొందరికి పాఠశాలల్లో తిరిగి ప్రవేశం కల్పించగా, ఆశ్రయం లేని బాలికలను **ములుగు బాలసదన్లో**, బాలురను **ఆశ్రమ పాఠశాలల్లో** చేర్పించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన **ముస్కాన్ ఇన్చార్జ్, DSP DCRB శ్రీ E. కిషోర్ కుమార్ గారు** ముస్కాన్ టీమ్ సభ్యులను అభినందించారు. బాల్యవివాహాలు, బాల కార్మికత్వం, పిల్లలపై ఎలాంటి వేధింపులు జరిగినా నిర్లక్ష్యం చేయకూడదని, ప్రతి పిల్లవాడు పనిలో కాకుండా **పాఠశాలలో ఉండేలా చూడాలని** సూచించారు.
**DLO శ్రీమతి V. వినోద గారు** జిల్లాలో నమోదైన 8 FIRల్లో ఎక్కువగా బాల కార్మికత్వానికి సంబంధించినవేనని, బాల కార్మికులపై నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు.
**DWO శ్రీమతి ప్రేమలత గారు** ములుగు జిల్లా SSC ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. రక్షించిన డ్రాప్అవుట్ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టి, వారు తిరిగి చదువుకునేలా అందరూ కలిసి కృషి చేస్తే వారి **బంగారు భవిష్యత్తుకు మంచి మార్గం చూపినవారమవుతామని** తెలిపారు.
సబ్డివిజన్ వారీగా రక్షించిన చిన్నారులు:
ములుగు సబ్డివిజన్: 29 మంది
ఏటూరునాగారం సబ్డివిజన్: 109 మంది
ఆపరేషన్ సందర్భంగా బాల కార్మికులను పనిలో పెట్టుకున్నట్లు గుర్తించిన 08 మంది యజమానులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసులు తెలిపారు.
ఈ ఆపరేషన్లో జిల్లా పోలీసు శాఖతో పాటు కార్మిక శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, బాలల సంక్షేమ కమిటీ (CWC), చైల్డ్లైన్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేశాయి.
జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు, వీధి బాలలు లేదా ప్రమాదంలో ఉన్న చిన్నారులు కనిపిస్తే వెంటనే సమీప పోలీసు స్టేషన్కు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని జిల్లా పోలీసు శాఖ ప్రజలను కోరింది.
ఈ కార్యక్రమంలో బిసిఆర్బి డిఎస్పి కిషోర్ కుమార్, డిడబ్ల్యుఓ ప్రేమలత పాల్గొన్నారు, డి ఎల్ ఓ వినోద మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు