09/08/2023
ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసి నాయకపోడ్ ఘట్టమ్మ దేవాలయం వద్ద నాయకపోడ్ జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ అధ్యక్షతన ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి ములుగు డిఎంహెచ్ఓ డాక్టర్ అల్లం అప్పయ్య గారు జెండా ఎగరవేయడం జరిగింది అనంతరం ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క మరియు ములుగు జిల్లా జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి గారు మాట్లాడుతూ జల్ జంహిల్ జెమిన్ నినాదాలతో అది మా కాలం నుండి నేటి వరకు ప్రకృతి సహజసిద్ధమైన నీరు అడివి సంపదపై సర్వహక్కులతో కూడుకున్న ఆత్మగౌరవం స్వయం పాలన కొరకు నేటి పోరాట యోధులైన భీమ్ బిట్స్ ముండ మన్యం అల్లూరి సీతారామరాజు మల్లు దురాగంటదొర బిట్స్ ముండా ఆదివాసుల తిరుగుబాటు వీరోచిత పోరాటాలు కొన్ని వందల సంవత్సరాలుగా బ్రిటిష్ వలసలకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎందరో ఆదివాసి యువతీ యువకులు వృద్ధుల సైతం పోరాడి ప్రాణాలు అర్పించిన మన అమరవీరుల త్యాగాల వల్ల నేడు రాజ్యాంగంలో పొందవలసిన 5 6 షెడ్యూల్లో స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం ప్రపంచంలో 75 దేశాల్లో ఐదు వేల తెగలకు చెందిన 37 కోట్ల ఆదివాసి జనాభా 6700 భాషలు మాట్లాడుతున్నారు 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ఆదివాసులు అదిమిది కోట్ల మంది కాగా 461 రకాల తెగలుగా ఉండి 100 రకాల భాషలు మాట్లాడుతున్నారు అని అన్నారు
భారత ఆదివారం ఆదివాసుల పరిస్థితి ఆఫ్రికా దేశాల కంటే దయనీయంగా ఉందని ఎక్కిరాజ్యసమితి అంచనా వేసింది ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసుల వారసత్వ అడవి వనరులపై హక్కులు తదితర సమస్యలపై 1982లో ఆగస్టు 9న స్విట్జర్లాండ్ లో జనీవ నగరంలో 26 మంది స్వాతంత్రియ మనవ హక్కులు నిపుణులతో ఒక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచ దేశాలన్నీ నడుము కట్టి వారి సంరక్షణకు కృషి చేయాలని తీర్మానించింది అదే రోజు అంతర్జాతీయ ఆదివాసి ప్రజల దినోత్సవం గా ఐక్యరాజ్యసమితి గుర్తించింది అంతర్జాతీయంగా ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు విద్యా ఉద్యోగం ఆరోగ్యం భూమి సంప్రదాయ హక్కులు పర్యావరణం వంటి అంశాలపై సమితి సర్వ ప్రతినిధి సభ 1993లో ఒక తీర్మానం చేసింది 1994 సమితి సర్వ ప్రతినిధి సభ ఆదివాసుల హక్కులు పై ఒక ముసాయిదా పిలువరించింది ఈరోజునే ప్రపంచ ఆదివాసి దినోత్సవం గా నేడు జరుపుకుంటున్నారు అని అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజున సెలవుదినంగా ప్రకటించాలని అని అన్నారు ఆదివాసి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక వేదికగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఏర్పడిందన్నారు ఆదివాసి హాకుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఆదివాసి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా అందరం కలిసేటట్టుగా పోరాడి ఆదివాసి సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఘట్టమ ప్రధాన పూజారులు కొత్త సదయ్య కొత్త లక్ష్మయ్య ఆకుల మొగిలి అరిగెల సమ్మయ్య. పోదెంకృష్ణ ప్రసాద్ రాష్ట్ర అధ్యక్షులు గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయ సంఘం , మంకిడి రవి ఆదివాసి ఉద్యోగుల సంక్షేమ మరియు సంస్కృతిక సంఘం , అన్నవరం రవికాంత్ జిల్లా అధ్యక్షులు టీఎస్ సిపిఎస్ ఈ యు, దబగట్ల నారాయణ తైనవేని రాజు గంట మోరి తిరుపతి గొల్ల కుమార్ అధ్యక్షులు ఆదివాసి పోలీస్ ఉద్యోగుల సంఘం, వాసం నారాయణ, వంక సాంబయ్య ,మొగిలిపల్లి సమ్మయ్య , మంకిడి శ్రీనివాస్ , గొల్ల కుమార్, గంటమూరి తిరుపతయ్య , సిద్దబోయిన వెంకట్ , చింత బక్కయ్య , తాటి కృష్ణ ప్రసాద్, కురుసం అశోక్, కొప్పుల శివరాజ్ , యాలం విశ్వనాథం, కోటి సంపత్ తుడుం దెబ్బ ములుగు పట్టణ అధ్యక్షులు ఆదివాసి నాయకపోడ్ గట్టమ్మ పూజారులు చిర మహేష్ కొత్త రవి అరిగల రవి కళ్యాణ్ చిర్రా మహేందర్ అచ్చ రాజు మోట్లపల్లి సరోజన కొత్త నిర్మల మోట్లపల్లి తదితరులు పాల్గొన్నారు