06/07/2023
ఏండ్లు గడిచినా...
న్యాయమే గెలిచింది
ఆదివాసి సంఘాల నేతల హర్షం. మంగపేట - ములుగు
ఏండ్లు గడిసిన న్యాయమే గెలిసిందని ఆదివాసి సంఘాల నేతలు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, ఆదివాసీ గిరిజన సంకతిక సంఘం కన్వీనర్ మంకిడి బుచ్చయ్య, గిరిజన ఉద్యోగుల గౌర అధ్యక్షుడు పొదేం కష్ణ ప్రసాద్, ఏఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్, బిసి సంఘలా నాయకులు ముంజల భిక్షపతి గౌడ్, తాడ్వాయి మండల మాజీ జడ్పీటిసి పులుసం పురుషోత్తం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతం కాదని 1973లో గిరిజనేతరులు హైకోర్టును ఆశ్రయించటం జరిగిందని, 1950 డిసెంబర్ 7 నుండి 1973 సంవత్సరం వరకు ఆదివాసీలు అప్పుడప్పుడే రాజ్యాంగ బద్దంగా విద్య, ఉపాధి, రాజకీయ రంగాలలో ఉపయోగించుకుంటున్న సమయంలో ఆంధ్ర వలసగిరిజనేతరులు మంగపేట మండలం షెడ్యూల్ ప్రాంతాల్లో లేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2006వ సంవత్సరం వరకు ఆదివాసీలు రాజ్యాంగ బద్దంగా దక్కాలిసిన విద్య, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి అవకాశాలు కోల్పోయారన్నారు. 2006 సంవత్సరంలో ఆదివాసీ ప్రజలకు అండగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అను కూలంగా తీర్పును ఇవ్వటం జరిగిందని, 2006 నుండి 2011 వరకు మంగపేట మండలంలోని 23 షెడ్యూల్ రెవెన్యూ గ్రామ పంచాయితీలు కొంత మేరకు రాజ్యాంగ అవకాశాలను అందిపుచ్చుకునే సమయంలోనే మరల గిరిజనేతరులు హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తీసుకు వచ్చి నేటివరకు 23 షెడ్యూల్ గ్రామ పంచాయితీలలో నేటికి ఎన్నికలు జరగక మండల అభివద్ధి అటకెక్కిందని, అదేవిదంగా విద్య, రాజకీయ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కూడా పూర్తిగా కోల్పోవటం జరిగిందన్నారు. ఏండ్లు గడిసిన కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదివాసీల పక్షాన రాజ్యాంగ బద్దంగా అనుకూలమైన తీర్పును ఇవ్వటం వలన జిల్లా వ్యాప్తంగా మంగపేట మండలంలోని ఆదివాసీ ప్రజలు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ విద్యార్థి ఉద్యోగ కార్మిక కర్షక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.