Telugu Desam Party: Mydukur

Telugu Desam Party: Mydukur Official Page of TDP Mydukur

పాయకరావుపేట వద్ద క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారాప్రవహించిన గోదారమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నా...
03/09/2026

పాయకరావుపేట వద్ద క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా
ప్రవహించిన గోదారమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పరవళ్లు తొక్కుతూ వస్తున్న గోదావరి జలాలకు సీఎం సాష్టాంగ నమస్కారం చేశారు.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


చౌడేశ్వరి నగర్‌లో ₹17 లక్షల DMF నిధులతో CC రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ..మైదుకూరు: మైదుకూరు మున్సిపాలిటీ 22వ వార్డు చ...
03/09/2026

చౌడేశ్వరి నగర్‌లో ₹17 లక్షల DMF నిధులతో CC రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ..

మైదుకూరు: మైదుకూరు మున్సిపాలిటీ 22వ వార్డు చౌడేశ్వరి నగర్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు మరో ముందడుగు పడింది. స్థానిక ప్రజల చిరకాల సమస్యలను పరిష్కరించే దిశగా ₹17 లక్షల DMF గ్రాంట్ నిధులతో CC రోడ్డు మరియు డ్రైనేజీ పనులకు మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు గురువారం భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.

చౌడేశ్వరి నగర్‌లో రోడ్లు, డ్రైనేజీ సమస్యల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానికులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎమ్మెల్యే గారు సంబంధిత అధికారులతో సమన్వయం చేసి DMF నిధుల ద్వారా ₹17 లక్షలు మంజూరు చేయించేందుకు చొరవ తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన నిధులను సమకూర్చి అభివృద్ధి పనులను చేపడుతున్నామని చెప్పారు.

ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు, వాటి పరిష్కారానికి అవసరమైన నిధులు తీసుకువచ్చి పనులను ప్రారంభించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తదితర ప్రాథమిక మౌలిక వసతులను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.

చౌడేశ్వరి నగర్‌లో CC రోడ్డు, డ్రైనేజీ పనులు పూర్తయిన అనంతరం స్థానిక ప్రజలకు రాకపోకల సౌకర్యంతో పాటు పారిశుధ్య పరిస్థితులు మరింత మెరుగుపడనున్నాయని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

03/09/2026

గిరిజనుల సంపదను దోచుకుని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి, విధ్వంసానికే బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన జగన్ రెడ్డికి.. వికాసం, విజ్ఞానం, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సీఎం చంద్రబాబు గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. "Both are not same"


03/09/2026

గొడ్డలి పార్టీ క్రెడిట్ చోరీ మొదలుపెట్టింది.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


03/09/2026

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజన్ విద్యాశాఖలో విజయాలు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 72.6% నుండి 82.1% కి పెరిగింది. విద్యా శాఖ చేపట్టిన 'అక్షర ఆంధ్ర' కార్యక్రమం ద్వారా 25 లక్షల మందికి పైగా అక్షరాస్యులు అయ్యారు. 2027 నాటికి 100% అక్షరాస్యత సాధించాలనే లక్ష్యం దిశగా ప్రయాణం సాగుతోంది.


•పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రవహించిన గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలను...
03/09/2026

•పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రవహించిన గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలను శిరస్సుపై చల్లుకుని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు

•తూర్పు కనుమలు దాటి వచ్చిన గోదావరి జలాలను వచ్చే ఏడాది సింహాచలం అప్పన్న చెంతకు, ఆపై అరసవల్లి వరకు, చివరికి వంశధార వరకు తీసుకెళ్తామని సీఎం చంద్రబాబు తెలిపారు

•జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు

•బాబాయిని, సొంత కార్యకర్తలను చంపి ఆ నెపాన్ని ఇతరులపై నెట్టే వ్యక్తి జగన్ అని నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

•విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పల్నాడు జిల్లాలో పర్యటించి, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను ప్రారంభించారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/13MXl


నరసరావుపేట పట్టణ వీధుల్లో యువనేత నారా లోకేష్ కు జనం బ్రహ్మరథం.
02/09/2026

నరసరావుపేట పట్టణ వీధుల్లో యువనేత నారా లోకేష్ కు జనం బ్రహ్మరథం.


నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్ కు టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానుల ఘనస్వాగతం. ఎస్ ఆర్ కే సెంటర్ లో డప్పులు, డీజే లతో...
02/09/2026

నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్ కు టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానుల ఘనస్వాగతం. ఎస్ ఆర్ కే సెంటర్ లో డప్పులు, డీజే లతో హోరెత్తించిన పసుపు సైనికులు, అభిమానులు. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో లోకేష్ కు కార్యకర్తల స్వాగతం. మంత్రి లోకేష్ కు స్వాగతం పలికిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, భాష్యం రామకృష్ణ, నర్సరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జాన్ సైదా, ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్, దర్శి ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మి, గుంటూరు మేయర్ కోవెలమూడి నాని, టీడీపీ నాయకులు నల్లపాటి రామచంద్ర ప్రసాద్, మన్నవ మోహన కృష్ణ, గోనుగుంట్ల కోటేశ్వరరావు, కనుమూరి బాజి చౌదరి, కనపర్తి శ్రీనివాసరావు, మానుకొండ శివప్రసాద్ తదితర నాయకులు.


Address

Mydukur

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Mydukur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Mydukur:

Shortcuts

Share