26/08/2026
*𖥔 జిల్లా కార్యాలయాలకు స్థలాలు లేవు.. పార్టీ ఆఫీసుకు రెండు ఎకరాలా.?*
*◉ ప్రజల అవసరాల కోసం కొన్న భూమిని పార్టీకి కేటాయించడం దారుణం: వి.సి.కె నేత బొంతు రమణ..*
*అమలాపురం, ఆగస్టు 26: అమలాపురం ప్రజల తాగునీటి అవసరాల కోసం మున్సిపాలిటీ కొనుగోలు చేసిన విలువైన భూమిని అధికార టీడీపీ కార్యాలయానికి దీర్ఘకాలిక లీజుకు కేటాయించడంపై వి.సి.కె రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.*
*తాగునీటి అవసరాల కోసం కొనుగోలు చేసిన భూమిని ఇప్పుడు ‘మిగులు స్థలం’గా పేర్కొనడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రజల నిధులతో కొనుగోలు చేసిన భూమిని రాజకీయ పార్టీ కార్యాలయానికి కేటాయించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు.*
*
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాల కొరత ఉందని, అయితే అధికార పార్టీ కార్యాలయానికి మాత్రం కోట్లాది రూపాయల విలువైన రెండు ఎకరాలు కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం హాస్టళ్లు, ఉచిత స్టడీ సర్కిల్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.*
*టీడీపీ కార్యాలయానికి భూమి కేటాయింపునకు సంబంధించిన అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు, మున్సిపల్ తీర్మానాలు, లీజు వివరాలను ప్రజల ముందుంచాలని బొంతు రమణ డిమాండ్ చేశారు. భూమిని ప్రజల తాగునీటి అవసరాలు, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు లేదా స్టడీ సర్కిల్ కోసం వినియోగించాలని కోరారు.*
*ప్రజా ఆస్తులను రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తే వి.సి.కె పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపడతామని, అవసరమైతే న్యాయపోరాటానికి కూడా సిద్ధమని బొంతు రమణ స్పష్టం చేశారు.*
#అమలాపురం #బొంతురమణ #కోనసీమ #టీడీపీ #ప్రజాధనం #ప్రజాఆస్తులు #తాగునీరు ాస్టళ్లు #స్టడీసర్కిల్ #ప్రజాపోరాటం #న్యాయపోరాటం