16/10/2020
👏పెద్దలు అందరికీ నమస్కారం జాతి కోసం ఒక జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని చాలామంది పెద్దలు సూచించారు.... దీనిలో భాగంగానే కాపు చరిత్ర సంకలన సమితి ఆ బాధ్యతను తలకెత్తుకుంది. సుమారుగా ఒక నెల పాటు సుదీర్ఘ చర్చలు వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో పలువురు పెద్దలు, మేధావులు వారి వారి సూచనలు, సలహాలను అందించారు. అందరి సలహాలను,సూచనలను పరిగణలోకి తీసుకొని వివిధ రకాల పతాకాలను తయారు చేయడం జరిగింది. వాటన్నింటి లో పైన వున్న సువర్ణ గరుడ ధ్వజాన్నే మెజారిటీ కుల ప్రముఖులు ఆమోదించారు.... జాతి కోసం ఒక అర్థవంతమైన పతాకాన్ని తయారుచేయడంలో అమూల్యమైన సలహాలు, సూచనలు అందజేసిన పెద్దలందరికీ కాపు చరిత్ర సంకలన సమితి కృతజ్ఞతలు తెలియజేస్తోంది. పెద్దలు ఇచ్చినవన్నీ అమూల్యమైన సలహాలే... వారి వారి సలహాల మేరకు పదుల సంఖ్యలో పతాకాలు డిజైన్ చేయించడం జరిగింది. కానీ అన్ని పతాకాలను ఆమోదించడం సాధ్యం కాదు కాబట్టి మెజారిటీ సభ్యుల అభిప్రాయాల మేరకు పై పతాకాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది.
పతాకం పేరు: సువర్ణ గరుడ ద్వజం
ఈ పతాకంలో మొత్తం 5 రంగులు ప్రస్పుటంగా కనిపిస్తాయి.
1. కాషాయం : ఇది త్యాగానికి చిహ్నం. చత్రపతి శివాజీ వంటి వారు ఈ రంగు పతాకాన్నే వాడారు... ప్రాచీన భారతీయ సమాజంలో లో సనాతన ధర్మాన్ని అనుసరించిన వారు కానీ, బౌద్ధులు, జైనులు ఈ రంగును ఎక్కువగా వాడడం జరిగింది... భారతీయ సమాజం ఈ రంగును త్యాగానికి చిహ్నంగానే భావిస్తుంది.
2. ఆకుపచ్చ : ఆకుపచ్చ సంపదకు, స్వయం సమృద్ధి కి, ఆర్థిక పరిపుష్టికి చిహ్నం
3. పసుపు : పసుపు రంగు భారతీయ సమాజంలో అత్యంత శుభసూచక మైనది. భారతీయ సమాజంలోని ముత్తయిదువలకు పసుపు, కుంకుమ, గాజులు, నల్లపూసలు వంటివి అందజేయాల్సిన బాధ్యతలు బలిజ కాపులవి. వాటికి గుర్తుగా పసుపు రంగు వృత్తాన్ని తీసుకోవడం జరిగింది.
4. తెలుపు: తెలుపు రంగు స్వచ్ఛతకు, శాంతికి చిహ్నంగా పరిగణింపబడుతోంది.
5. బంగారు రంగు: సర్వ శుభాలకు, సంపదకు చిహ్నం.
6. ఇక ప్రధానమైనది 'గరుడ' ప్రపంచానికి, మానవజాతికి నాగరికత నేర్పి సంపద సృష్టించడం ఎలాగో నేర్పిన ఒకే ఒక జాతి వీర బలిజలు. భూగోళం పైన వీరు వ్యాపారం చేయని చోటు లేదంటే అతిశయోక్తి కాదు. వేల సంవత్సరాల క్రితమే ప్రపంచంలోని అన్ని ఖండాలను చుట్టిన ఘనత వీరబలిజలదే... భూగోళం పైన 500 వీర శాసనాలు కలిగిన ఒకే ఒక మానవజాతి ఈ వీర బలిజలు. చరిత్రలో యోద్ధ వ్యాపారులుగా పిలువబడిన వీరు అనేక ప్రాచీన సామ్రాజ్యాలను స్థాపించారు. ప్రపంచ మానవాళి చరిత్రలో ఇంతటి ఘనకీర్తి కలిగిన జాతి మరొకటి లేదు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం.... నేటికీ సజీవ సాక్షాలు గా నిలిచిన దేశ విదేశాల్లోని శిలా శాసనాలు వీరి గొప్పదనం గురించి వివరిస్తాయి. ఈరోజు కాపు, తెలగ, బలిజ, ఒంటరులుగా పిలువబడుతున్న వారు ఈ వీర బలిజల వారసులే.... గజపతి, అశ్వపతి, నరపతి సింహాసనాలతోపాటు బలిజ సింహాసనం అనే ప్రస్తావనలు శాసనాలలో ఉన్నాయి... వీరి పతాక మే 'సువర్ణ గరుడధ్వజం' మన పూర్వీకుల వారసత్వ సంపద గా వారి సంస్కృతి, సాంప్రదాయాలను ఆచరించాల్సిన బాధ్యతలు మనవి. మహోన్నత చరిత్ర కలిగిన వీర బలిజ ధర్మ పరిరక్షకులు వీర బలిజలు. వారి వారసత్వం ప్రతి ఫలించాలనే వారు వాడిన సువర్ణ గరుడ ధ్వజాన్ని జాతి జాతీయ పతాకంగా ఎంపిక చేయడం జరిగింది. ఈ పతాకాన్ని మన సంఘీయులు చేపట్టే అన్ని కార్యక్రమాల్లో ఉపయోగించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.👏👏👏
-అఖిలభారత కాపు చరిత్ర సంకలన సమితి.